అనూహ్య ఓటములు..దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీలువీరికే..90 వేల నుంచి 59 వేల‌తో..జ‌గ‌న్ గెలిచారు అంతే!.అధికారుల‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు..చంద్రబాబును కలిసిన అధికారులు..కంభంలో సంబరాలు .

👉అనూహ్య ఓటములు..అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. గాంధీ- నెహ్రూ కుటుంబానికి విధేయుడైన కిషోరీ లాల్ శర్మ అక్కడ గెలిచారు.2019లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు, దీంతో నెహ్రూ- గాంధీ కుటుంబ వారసుడు ఒక సాధారణ బీజేపీ నాయకురాలి చేతిలో ఓడిపోయారనే సందేశం పంపారు. ఈసారి స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేయలేదు, కానీ, కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దించి, విజయం సాధించారు.ప్రారంభంలో ప్రధాని మోదీ కూడా బనారస్‌ (వారణాసి)లో వెనుకంజలో కనిపించారు. తర్వాత రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని సంపాదించారు. అయితే ఈసారి బనారస్ నుంచి మోదీ గతంలో మాదిరి భారీ విజయమైతే నమోదు చేయలేకపోయారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో బనారస్‌లో దాదాపు నాలుగు లక్షల 80 వేల ఓట్లతో విజయం సాధించారు మోదీ. 63 శాతం ఓట్లు వచ్చాయి.2014లో 56 శాతంతో 5,81,022 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాకు 2,09,238 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు.ఉత్తరప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు పోటీలో ఉన్నారు.ప్రధాని మోదీ బనారస్ నుంచి, రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగారు. రాజ్‌నాథ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆయన సతీమణి డింపుల్ యాదవ్ కూడా పోటీ చేశారు.ఉత్తరప్రదేశ్‌లో ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం, రాజ్యాంగం బలహీనపడటం వంటి అంశాలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు లేవనెత్తాయి. రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రిజర్వేషన్‌ను అంతం చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. దీనితో పాటు, భారత ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై కూడా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు.యూపీలో బీజేపీ 33 సీట్లకు తగ్గిపోవడం ప్రధాని మోదీకి ఎదురుదెబ్బే కాదు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా చేదువార్త అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ అన్నారు.

👉 దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీలు వీరికే..

లాల్వాణీ (ఇండోర్-బీజేపీ) 11,75,092

రక్బీల్ హుస్సేన్ (ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476

శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ-బీజేపీ) 8,21,408

సీఆర్ పాటిల్(నవసారి-బీజేపీ) 7,73,551

అమిత్ షా(గాంధీనగర్-బీజేపీ) 7,44,716

అభిషేక్ బెనర్జీ(డైమండ్ హార్బర్-టీఎంసీ)7,10,930

రఘువీర్ రెడ్డి ( నల్గొండ-కాంగ్రెస్) 5,59,905

👉 90 వేల నుంచి 59 వేల‌తో.. జ‌గ‌న్ గెలిచారు అంతే! ఇక, పార్టీకి ఆయువు ప‌ట్టువంటి సీమ‌లో అస‌లు వైసీపీ నామ‌రూపాలు కూడా లేకుండాపోయింది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఘోరప‌రాజ‌యాన్నే కాదు.. అత్యంత ఘోర అవ‌మానాన్ని కూడా మిగిల్చాయి. ఆయ‌న పార్టీకి చెందిన అతిర‌థ మ‌హార‌థుల‌న‌ద‌గిన నాయ‌కులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మిన‌హా మిగిలిన వారంతా ఈ ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిచారు. ఇక‌, కీల‌క నాయ‌కులు కూడా.. టీడీపీకూట‌మి సృష్టించిన‌.. ఓట్ల సునామీలో కొట్టుకుపోయారు.ఇక, పార్టీకి ఆయువు ప‌ట్టువంటి సీమ‌లో అస‌లు వైసీపీ నామ‌రూపాలు కూడా లేకుండాపోయింది. ఏపీలో గరం లేపిన గురుమూర్తి ! ఇంత ఘోర ప‌రాజ‌యం ఓవైపు జ‌గ‌న్‌ను వెంటాడుతుంటే.. మ‌రో ఘోర అవ‌మానం కూడా..ఆయ‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది. అదేఆయ‌న గెలిచిన పులివెందుల‌లో ద‌క్కిన మెజారిటీ. 2019లో 90 వేల‌కు పైగా.. మెజారిటీ ద‌క్కించుకుని రాష్ట్రంలో నెంబ‌ర్ వ‌న్ మెజారిటీ ద‌క్కించుకున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు జ‌గ‌న్‌. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఇంత కుమించి మెజారిటీ వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశించారు.ఇదే విష‌యాన్ని ఆయ‌న స‌తీమ‌ణి కూడా.. చెప్పుకొచ్చారు. కానీ, ఫ‌లితం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. లీడ్స్ ఒకానొక ద‌శ‌లో జ‌గ‌న్ ను భ‌య కంపితుల‌ను చేశాయ‌న‌డంలోసందేహం లేదు.అయితే..ఎట్ట‌కేల‌కు 59 వేల మెజారిటీతో జ‌గ‌న్ గ‌ట్టెక్కారు. కానీ,గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న సాధించిన మెజారిటీతో పోల్చుకుంటే.. మాత్రం ఇది అత్యంత నాశిర‌కం.అంతేకాదు.. అంత‌కు మించిన అవ‌మానం కూడా అంటున్నారు ప‌రిశీల‌కులు.జ‌గ‌న్ ఇమేజ్‌తో ఎమ్మెల్యేలు గెలిచార‌ని.. 2019లో చెప్పుకొన్న నాయ‌కులు.. ఇప్పుడు అదే జ‌గ‌న్ కు దారుణ‌మైన మెజారిటీ రావ‌డంతో కిమ్మ‌న‌డం లేదు.ఇదంతా కూడా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప‌ట్టి చూపించింద‌ని ప‌లువ‌రు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం జ‌గ‌న్ సాధించిన మెజారిటీ టీడీపీ కి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు అంత‌కు మించి సాధించారు. ముఖ్యంగా జ‌గ‌న్ ఓడించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేసిన టీడీపీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్‌కు 91 వేల‌కు పైగా మెజారిటీ లభించింది.ఇక‌, చంద్ర‌బాబును ఓడించాల‌ని అనుకున్నారు.కానీ, ఆయ‌న‌కు 47 వేల‌కుపైగా ఓట్ల మెజారిటీ ద‌క్కింది. ఇలా..జ‌గ‌న్ కంటే.. చాలా మంది భారీ మెజారిటీ సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా ఒక్క ఛాన్స్ ను స‌రిగా నిల‌బెట్టుకోని ఫ‌లితంగా జ‌గ‌న్ బొక్క‌బోర్లా ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

👉అధికారుల‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు.. విష‌యం ఏంటి? ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ క‌నీ వినీ ఎరుగ‌ని ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ క‌నీ వినీ ఎరుగ‌ని ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. కూట‌మిగా బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లిన టీడీపీ.. సీట్లు పంచుకుంది. ఈ క్ర‌మంలో 144 సీట్ల‌లోనే టీడీపీ పోటీ చేసింది. అయితే.. 135 స్థానాల‌కు పైగా టీడీపీ ఒంట‌రిగానే ద‌క్కించుకుంది.ఇక‌, జ‌న‌సేన పూర్తిగా 21 -స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. ఇలా.. కూట‌మి భారీ విజ‌యంతో దూసుకుపోయింది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణం చేసేందుకు ఇంకా స‌మ‌యం ఉంది.మంచి రోజు.. ముహూర్తం కోసం.. వేచి చూస్తున్నారు.తాను ఓడి.. అన్ననూ ఓడించిన షర్మిల.. ఏపీ ఫలితాలపై ఏమన్నారంటే? అయితే.. సాధారణంగా ఎక్క‌డైనా ప్ర‌భుత్వం మారుతుంటే.. ఫైళ్లు ధ్వంసం చేయ‌డం.. మాయంచేయ‌డం అనేవి ప‌రిపాటిగా మారి పోయాయి. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాలు..వివాదాస్ప‌ద అంశాల‌కు సంబంధించిన ఫైళ్ల‌ను మాయం చేస్తుంటారు. గ‌త 2023లో తెలంగాణ ప్ర‌భుత్వం మారిన‌ప్పుడు కూడా ఇలానే చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.ఇది అక్క‌డ పెద్ద వివాదం అయింది. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలోనూ ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని గుర్తించిన టీడీపీఅధినేత‌, కాబోయే సీఎం చంద్ర‌బాబు..ముందుగానే ఇలాంటి విష‌యంపై దృష్టి పెట్టారు.అన‌ధికారికంగానే ఆయ‌న సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిసింది.ఏ విభాగం నుంచి ఏ ఒక్క ఫైలు కూడా..మిస్ కావ‌డానికి వీల్లేద‌ని క‌ఠిన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.అంతేకాదు.. ఏ ఫైలైనా మిస్స‌యినా.. ధ్వంస‌మైనా..సంబంధింత అధికారుల‌ను బాధ్యుల‌ను చేసి ఖ‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది.ప్ర‌స్తుతం ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం..అత్యంత దారుణ‌మైన స్థితిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే.దీంతో చంద్ర‌బాబు ఈ నెల 9న మంచి ముహూర్తంలో అమ‌రావ‌తిలో ప్ర‌మాణం చేయ‌నున్నారు.దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

👉టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,మరికొందరు IAS, IPS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

కంభంలో మిన్నంటిన సంబరాలు  సంబరాలుగిద్దలూరు లో టిడిపి అభ్యర్థి గా ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందిన సందర్బంగా కంభం పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ లో, కందులాపురం లో కేకులు కట్ చేసి బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.. మంగళవారం సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు బాణసంచా కాలుస్తూనే ఉన్నారు. కార్యక్రమంలో కంభం మాజీ సర్పంచ్ స్టార్ భాష, టిడిపి నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, రజాక్ బాషా, జిలాని, రహిమాన్ ఫజల్, మస్రోద్ సుకూర్, అశ్వక్, నలబుల వెంకటేశ్వర్లు, తోట శీను, ఆర్టీసీ జిలాని, ఖాదర్ మాస్టర్,తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త