బాబూ బీజేపీని నమ్మొద్దు..ఆ వీర మహిళా జవాన్ కు దేశం మద్దతు..రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు  పార్థివదేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు,భువనేశ్వరి,కందుల..పెంచుకున్న వారే కడతేర్చారు.మార్కాపురం డిఎస్పి..బి పేటలో టిడిపి సంబరాలు.

👉బాబూ బీజేపీని నమ్మొద్దు.. ఆ పదవిని తీసుకోండి! ఈ నేపథ్యంలో శివసేన  విభాగం నేత ఆదిత్య ఠాక్రే..చంద్రబాబుకు కీలక సూచన

చేశారు. లోక్‌ సభ స్పీకర్‌ పదవిని తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. కూటమి ధాటికి వైసీపీ కకావికలమైంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ టీడీపీ చక్రం తిప్పనుంది. టీడీపీకి 16 లోక్‌ సభ స్థానాలు వచ్చాయి. జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ 18 స్థానాలు మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది ఎంపీలు అవసరం కాగా బీజేపీ 240 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. మెజార్టీకి 32 స్థానాల దూరంలో బీజేపీ ఆగిపోయింది.ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఆ తర్వాత జేడీయూ నిలుస్తోంది. జేడీయూకి 12 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో సంకీర్ణ సర్కారులో టీడీపీదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో తమకు నాలుగైదు కేబినెట్‌ మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను చంద్రబాబు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో లోక్‌ సభ స్పీకర్‌ పదవిని టీడీపీ చేపట్టి ఉండటంతో ఈసారి కూడా తమకు లోక్‌ సభ స్పీకర్‌ పదవిని కేటాయించాలని అడుగుతున్నట్టు సమాచారం. అయితే స్పీకర్‌ తో సహా కీలక శాఖలను మిత్ర పక్షాలకు కేటాయించే ఉద్దేశంలో బీజేపీ లేదని అంటున్నారు. కీలక శాఖలు మినహాయించి ఇతర శాఖలనే మిత్ర పక్షాలకు కేటాయించవచ్చని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్‌) విభాగం నేత ఆదిత్య ఠాక్రే.. చంద్రబాబుకు కీలక సూచన చేశారు. లోక్‌ సభ స్పీకర్‌ పదవిని తీసుకోవాలని కోరారు.ఆ పదవిని బీజేపీకి వదిలేయొద్దన్నారు.తమ అనుభవాల దృష్ట్యా ఈ సూచన చేస్తున్నామని ఆయన సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు. భారత్ పెద్ద మనసు మిత్ర పక్షాలను చీల్చి లబ్ధి పొందడం బీజేపీకి అలవాటు అని ఆదిత్య ఠాక్రే గుర్తు చేశారు. గతంలో తమ పార్టీని ఇలాగే చీల్చారన్నారు. అందువల్ల స్పీకర్‌ పదవిని టీడీపీ తీసుకోవాలన్నారు. స్పీకర్‌ పదవిని తీసుకుంటే బీజేపీ మిత్రపక్షాలను చీల్చే అవకాశం ఉండదన్నారు. జేడీయూకూ కూడా ఆదిత్య ఠాక్రే ఇదే సూచన చేశారు. స్పీకర్‌ పదవిని మిత్ర పక్షాలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ స్పీకర్‌ పదవిని తీసుకుంటే పార్టీలను చీల్చడం ఖాయమని హెచ్చరించారు. మరి శివసేన నేత సూచించినట్టు టీడీపీ, జేడీయూ స్పీకర్‌ పదవి కోసం పట్టుబడతాయో, లేదో వేచిచూడాల్సిందే.

👉 రైతులు తమ హక్కుల కోసం నిరాహార దీక్షలు చేస్తూ నెలలు తరబడి రోడ్లపై కూర్చుని ఉంటే సమాజం యొక్క నైతిక విలువలు తెలవని ఒక నటి లంగనారావత్ అక్కడ కూర్చున్న హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు రోజుకు 100 రూపాయలకు కిరాయి తెచ్చిన కూలీలు అని ఎగతాళి చేసింది.దేశ రక్షణ బలగాలలో సేవ చేస్తున్న ఈ మహిళ తన తల్లి ఆ దీక్షలో కూర్చున్నందుకు ఇలా అవమానించిన ఆ నటి చెంప పెడేళ్లు అనిపించింది. ఈ ధీర వనిత చెల్లికి యావత్ భారత సమాజం.. పాధాభి వందనాలు చేస్తున్నది.ఎండకు వానకు చూడకుండా మన కోసం భూమి నుండి ఆహారం సమకూర్చే రైతులను నోటి దురుషుతో ఇలా ప్రవర్తించడం కర్షక సమాజాన్ని అవమానించడమే….ఈ వీర వనితకు సపోర్టుగా మనం నిలబడదాం.రైతులను అవమానించే ఈ మతోన్మాద పార్టీని భూస్థాపితం చేద్దాం..

👉సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

👉 రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు  పార్థివదేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి.

👉ప్రముఖ వ్యాపారస్తులు భవాని గ్రూప్స్ అధినేత  పేర్ల శ్రీనివాసరావు పొదిలి లోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సంస్థ ఛైర్మెన్ మువ్వల పార్థసారథికి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు.పొదిలి లో మానవత సంస్థ ఏర్పడిన తరువాత నిరుపేదలకు చేయూత నిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని భవిష్యత్ లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని తనవంతు గా ఈ ఆర్థిక సహాయం చేసినట్లు పేర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పొదిలి మానవత సంస్థ వారికి అభినందలు తెలియచేసింది.

👉 మార్కాపురం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత కీర్తిశేషులు రామోజీరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన సంతాపం తెలియజేసిన టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తమ్ముడు కందుల రామిరెడ్డి. ఈ కార్యక్రమం లో పాల్గొని నివాళ్లు అర్పించిన పలు టీడీపీ నాయకులు…

👉 ఉద్యోగ అవకాశం..కంభం పట్టణంలోని ప్రముఖ హాస్పిటల్ అయిన శ్రీ రామచంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మార్కెటింగ్ విభాగం నందు pro గా పని చేయుటకు పురుషులు కావలెను.👉 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:* *8639700334*

👉 బేస్తవారిపేట టౌన్ నందు 87 బూతు నందు మల్ల అల్లూరయ్య ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తుమూల అశోక రెడ్డి గెలుపు సందర్భంగా కేక్ ను కట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట టౌన్ అధ్యక్షుడు దూదేకుల కాసిం పీరా (సైదులు) కస్టర్ ఇంచార్జి ముప్పూరి రాము యూనిట్ ఇన్చార్జి సుబ్రహ్మణ్యం బీసు అరుణ్. బూత్ కన్వీనర్లు సున్నపు అనిత అనుముల కిషోర్ వల్లపు మహీంద్రా మరియు కందగట్ల బాల చెన్నయ్య పాల్గొన్నారు.

👉పెంచుకున్న వారే శాన్విని హత్య చేశారు.డీఎస్పీ ఎం బాల సుందర రావు.. ప్రకాశం జిల్లా కంభం ..పెంచుకున్న వారే శాన్విని హత్య చేశారని మార్కాపురం  డీఎస్పీ ఎం బాల సుందర రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన కంభం సీఐ కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈనెల ఆరవ తేదీన అర్ధవీడు మండలం అర్థవిడు గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక శాన్వి రెడ్డి హత్యకు గురైన విషయం విధితమే .. తొలుత హత్య ఎవరో దుండగులు చేసి ఉంటారని ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ కేసు విషయమై మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర రావు తమ సిబ్బందితో కలిసి వేరు వేరు బృందాలుగా విచారణ జరిపారు.

అర్ధవీడు మండలంలో ఉపాధ్యాయంగా పనిచేస్తున్న పుచ్చకాయల వెంకటరమణారెడ్డి లక్ష్మీ పద్మావతి దంపతులకు సంతానం లేకపోవడంతో తన అన్న అయినా వెంకట రంగారెడ్డి కుమార్తెను 9 ఏళ్ల కిందట దత్తతకు తీసుకున్నాడు. అయితే ఇటీవల శాన్వి రెడ్డి కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తులు విషయంలో గొడవలు జరిగాయని డిఎస్పి బాలసుందర్రావు తెలిపారు. కన్న తల్లిదండ్రులు కూడా శాన్విరెడ్డిని ప్రేమగా చూస్తుండడంతో, రమణారెడ్డి లక్ష్మీ పద్మావతి దంపతులు ఓర్వలేకపోయినట్లు, పాము ఎన్నాళ్లు పోషించిన శాన్వి రెడ్డి తల్లిదండ్రులకు దగ్గర కావడం, పైగా ఆస్తి కూడా మొత్తం శాన్వి రెడ్డికే రాసి ఇవ్వాల్సి వస్తుందని ఓర్వలేక గొంతు కోసి హత్య చేసినట్లు తెలిపారు.ఆరో తేదీ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తన బెడ్ రూమ్లో ఫోన్ చూసుకుంటున్న శాన్వి రెడ్డిని పుచ్చకాయల లక్ష్మీ పద్మావతి వంటగదిలో ఉన్న కత్తి తీసుకొని వెళ్లి ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి పట్టి శాన్వి రెడ్డి గొంతును కోసి హత్య చేసినట్లు ఆ సమయంలో రెండవ ముద్దాయి అయినా వెంకటరమణారెడ్డి గేటు వద్ద నిలబడి ఎవరైనా వస్తారేమోనని కాపలా గా నిలబడినట్లు తెలిపారు. అనంతరం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్వి రెడ్డిని హత్య చేసినారని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ముద్దాయిలైన వెంకటరమణారెడ్డి లక్ష్మీ పద్మావతి లను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. కేసును చాకచక్యంగా విచారణ జరిపి అసలు నేరస్తులను గుర్తించి కేసు నమోదు చేసిన 48 గంటల లోపు ముద్దాయిలను అరెస్టు చేసినందుకు గాను కంభం సీఐ జె.రామకోటయ్య తో పాటు కంభం సర్కిల్లోని ఎస్ఐలను సిబ్బందిని డిఎస్పి బాలసుందర్రావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సిఐ జె రామకోటయ్య, కంభం ఎస్ఐ పులి రాజేష్, అర్ధవీడు ఎస్సై ఎం అనిత, బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి