ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం-దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు….ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న చంద్రబాబు..కర్ణాటకలో కమలం బిజీ..బిజెపిపై నమ్మకం సన్నగిల్లుతుందా..జనసేన డాక్టర్ కార్తికేయ పై దాడి..కర్నూల్ జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య..డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి.. పెనమలూరులో జోరుగా జూద క్రీడ..

♦👉కర్ణాటకంలో కమలం బిజీ…ఇమేజ్ ని పందెం కట్టి ! ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్ అంటూ బీజేపీ పరోక్షంగా ఆడిస్తున్న ఈ ఆటలో పావు గవర్నర్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.* బీజేపీ అంటే తేడా పార్టీ అంటారు.ఆ తేడా కి అర్ధం ఏంటి అంటే మిగిలిన పార్టీల కంటే సిద్ధాంతపరంగా తేడా అని. నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి నీతిగా నిజాయితీగా ఉండే పార్టీ అని.*అయితే ఇదంతా ఒకప్పటి మాట. నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ఇపుడు నయా పాలిటిక్స్ కి తెర తీసింది.తాము అధికారంలో లేని చోట రాజకీయంగా చేయాల్సినవన్నీ చేస్తూ పోతోంది.* 2018 లో కర్నాటకం స్టార్ట్ చేసి చాలా మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.*ఆ తరువాత మధ్యప్రదేశ్ లో అదే గేం ఆడింది.*మహారాష్ట్రలో ఒకే ఫిలాసఫీ తో నడిచే చిరకాల మిత్రపక్షం అయిన శివసేనను సైతం రెండుగా చీల్చి మరీ అక్కడ అధికార పంట పండించుకుంది. *జార్ఖండ్ లో సీఎం గా ఉన్న హేమంత్ సోరెన్ కి జైలు దారి చూపించి అక్కడ పాగా వేద్దామని ప్రయత్నం చేసింది అని కూడా విమర్శలు ఉన్నాయి. *ఇపుడు తిప్పి తిప్పి మళ్ళీ కర్నాటకం స్టార్ట్ చేసింది అనుకుంటున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్ అంటూ బీజేపీ పరోక్షంగా ఆడిస్తున్న ఈ ఆటలో పావు గవర్నర్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.ఏమీ లేని చోట ఏదో అయినట్లుగా భ్రాంతికి కలిగించి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి అందులో రాజకీయ లాభం చూసుకునే కమలం తీరు పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఏణ్ణర్థం క్రితం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారు. కాంగ్రెస్ ని తెచ్చి పెట్టారు.*అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడీయూతో పొత్తు పెట్టుకుని బీజేపీ మళ్ళీ ఎక్కువ ఎంపీ సీట్లను తెచ్చుకోవడం ద్వారా తన పొలిటికల్ గ్రాఫ్ ని పెంచుకుంది.కాంగ్రెస్ సర్కార్ కొనసాగితే ఆ ప్రభుత్వం పట్ల జనాలకు విసుగు పుడితే బీజేపీకి చాన్స్ ఉండొచ్చు. అలా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు అయిన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎందుకు తాపత్రయం అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.ఆ రాజకీయ అలజడిలో చలి కాచుకోవాలని ఎందుకు ఆరాటం అని కూడా నిలదీస్తున్న వారు ఉన్నారు. *ఏది ఏమైనా సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీగా కర్ణాటక రాజకీయం సాగుతోంది. గవర్నర్ చేసింది ఒప్పు అని బీజేపీ నేతలు సమర్ధించుకుంటూంటే కాదు గవర్నర్ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి ఎలా కధ కంచికి చేరుతుంది ఎవరికి లాభం ఎవరికి బూమరాంగ్ అన్నది ఇపుడే తెలియదు కానీ బీజేపీ మాత్రం కర్నాటకంలో చేయి పెట్టడం పట్ల విమర్శలు అయితే వస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం రాజకీయంలో బీజేపీ ఇమేజ్ సైతం దెబ్బతింటోందని అనే వారూ ఉన్నారు. అంతలా తన అస్థిత్వాన్నే ఫణంగా పెట్టి పందెం కట్టి రాజకీయ జూదం ఆడాలా అన్న చర్చ కూడా పార్టీ లోపలా బయటా ఉంది మరి.
👉ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న చంద్రబాబు..

ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం లోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈసందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీలో రూ.900కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకుప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.
👉జనసేన బీసీ నాయకుడు డాక్టర్ కార్తికేయ పై దాడి ..కృష్ణాజిల్లా..ఉయ్యూరు.ఈ కుట్ర వెనక గంజాయి బ్యాచ్ ఉందని అనుమానిస్తున్న డాక్టర్..నిస్పక్షపాతంగా విచారణ జరుగుతుందా అని అనుమానాలు…

👉ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్..*
రాఖీ పండగకు వనపర్తికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన గర్భిణి..మార్గమధ్యలో పురిటి నొప్పులు..
బస్సులో ఉన్న నర్సు సహాయంతో పురుడు పోసిన కండక్టర్ భారతీని అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
👉సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన చెల్లి..!!!
మహబూబాబాద్ – నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
దీంతో ఆస్పత్రిలో చేర్పించారు.. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.
👉 గుర్తుతెలియని మృతదేహం లభ్యం  పల్నాడు జిల్లా.. మాచర్ల మండలం విజయపురిసౌత్ లోని కృష్ణవేణి పుష్కర్ ఘాట్ వద్ద గుర్తుతెలియని కాలిబూడిదైన వ్యక్తి మృతదేహం లభ్యం..మృతదేహం వద్ద పెట్రోల్ డబ్బా తో పాటు వాటర్ బాటిల్స్ గుర్తింపుసంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉కడప రిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం తో ఓ నిండు ప్రాణం బలి.*విషద్రావం తాగి సీరియస్ గా ఉన్న ఈశ్వరయ్యను కడప రిమ్స్ కు తరలింపు.*ఆసుపత్రికి వెళ్లిన అరగంట అయినా పట్టించుకోని రిమ్స్ వైద్యులు. *రిమ్స్ డాక్టర్ల నిండు నిర్లక్ష్యానికి ఈశ్వరయ్య మృతి.*ఎమర్జెన్సీ కేసుకు కూడా ఓపి తెచ్చుకోవాల్సిందే అంటూ డాక్టర్ల హుకుం.*బోరున విలపిస్తున్న మృతుడి భార్య, బంధువులు.*మృతుడు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం సాదువారి పల్లె కు చెందిన వాడు
👉కర్నూల్ జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య?*
*గొంతు కోసి హత్య చేసిన దుండగులు*

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. పెద్దహరివాణంలో బీజేపీ నేత శేఖన్న (50)ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు.ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్నను కొందరు దుండ గులు గొంతు కోసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 తిరుపతి జిల్లా శ్రీసిటీ నందు పలు భూమిపూజలు మరియు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ రేణిగుంట విమానాశ్రయం నందు పూలగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
👉కృష్ణా జిల్లా, పెనమలూరు* నియోజకవర్గం లో గతంలో ఎన్నడూ లేని విధంగా జోరుగా కొనసాగుతున్న *జూద క్రీడ..గత ప్రభుత్వం లో జిల్లాలో జూదానికి *గన్నవరం* అడ్డాగా ఉండేది..ఇప్పుడు జూదం ఆడే పేకాట రాయుళ్లకు *పెనమలూరు* అడ్డాగా మారుతుంది..*గోదావరి* జూదగాళ్లను సైతం ఆకర్షిస్తున్న *పెనమలూరు..*పెనమలూరు స్టేషన్ పరిధిలో సీఐ *వెంకటరమణ* బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దాడుల్లో వందల సంఖ్యలో పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న వైనం..*పలు దాడుల్లో పట్టుబడ్డ రాజకీయ నాయకులు, ప్రముఖులు.*పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరించి ఇలాంటి జూద క్రీడలను అదుపులోకి తేవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు..
👉 అనకాపల్లి జిల్లా లో ఫుడ్ పాయిజన్ జరిగి నలుగురు విద్యార్థులు మృతి ..*అనకాపల్లి జిల్లా కోటవురట్ల లో కైలాసపట్నం అనాద పాఠశాల లో కలిసిత ఆహారం తిని 27 మంది తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ నలుగురు విద్యార్థులు చనిపోయారు. మెరుగు అయిన చికిత్స కోసం విద్యార్థుల ను KGH కు తరలించారు. విద్యార్థుల మృతి పై తీవ్ర విచారణ వ్యక్తం చేసిన చంద్రబాబు . విచారణ కు ఆదేశించిన సిఎం

👉కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో కాచిన నూనే పోసి తోడికోడల పై దాడి.!*
కాచిన నూనె పోసి సొంత తోడికోడలపై దాడి చేసిన సంఘటన కోడూరు గ్రామంలో చోటుచేసుకుంది.
ఆదివారం కోడూరు (ఆర్యవైశ్య) మినుముల కొనుగోలు వ్యాపారి భార్యపై అతని తమ్ముడు భార్య కాచిన నూనె మొహం మీద పోసి దాడికి పాల్పడినట్లు సమాచారం.?
ఈ దాడిలో వ్యాపారి భార్య తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పాత గొడవల కారణంగానే తోడికోడలపై దాడికి పాల్పడినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై యువకుల అత్యాచారం..
ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.
రెండు నెలలుగా ప్రేమ పేరు తో అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. యువ కుడికి మరో ఇద్దరు యువ కులు సహకరించినట్లు సమాచారం.
ఈనెల 10న స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారా నికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతులపై ఫోక్సో కేసు నమోదు చేశారు …
👉జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 19: కుటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సంగతి విధితమే రెండో పేజీలో జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట, కిర్లంపూడి మండలాలకు అన్నా క్యాంటీన్లు శాంక్షన్ అవటంతో సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ పబ్లిక్ అండ్ హెల్త్ బ్రహ్మ తేజ తో కలిసి గోకవరం రోడ్ లో గల పంచాయతీరాజ్ అతిథి గృహం సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల సరిపోతుందని వారు తెలియజేశారు. కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పంచాయతీ సెక్రెటరీ చిరంజీవి రాజు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త