ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు..జనసేనలోకి బాలినేని..వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం..నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు..కొడుకు ప్రేమ వివాహం – తల్లిని కట్టేసి చిత్రహింసలు ..పొదిలిలో నిఘా నేత్రాలు.

👉హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్లు..
ట్రాన్స్‌జెండర్ల సేవల అంశాన్ని పరిశీలించాలన్న సీఎం రేవంత్ రెడ్డి..హోంగార్డ్ తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం.

👉నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారు:**తెలంగాణా హై కోర్టు*
హైడ్రాను రద్దు చేయాలన్న పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్పూర్లో ఈనెల 3న షెడ్లు కూల్చివేశారన్న పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
👉 జనసేనలోకి భారీగా చేరికలు..దెందులూరు నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం జనసేనలో పార్టీలోచేరారు.ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే, చిర్రి బాలరాజు. నరసాపురం ఎమ్మెల్యే, బొమ్మిడి నాయకర్. ఉంగుటూరు ఎమ్మెల్యే, పత్స మట్ల.ధర్మరాజు. ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు. ఇతర నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
👉 కరెంట్ షాక్ తో రైతు మృతి. సిబ్బంది సస్పెండ్..
ఏలూరు జిల్లా.. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో రైతు కంకిపాటి నాగరాజు ఈనెల 12న కరెంట్ షాక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. లక్కవరం ఏఈ, జోషఫ్. జేఎల్ఎం, తామా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశామని షిఫ్ట్ ఆపరేటర్ మణికుమార్ ని విధుల నుండి తొలగించగా లైన్ ఇన్స్పెక్టర్ గణేష్ సింగ్ కు షోకాస్ నోటీస్ ఇచ్చామని డి ఈ, రాధాకృష్ణ తెలిపారు.
👉ఏపీలో ఇవాళి నుంచి పీహెచ్సీ ఆస్పత్రుల్లో OPలు బంద్*
పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాల్టి నుంచి పీహెచ్సీ వైద్యులు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బహిష్కరించ నున్నారు.
అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తామని పీహెచ్సీ వైద్యుల సంఘం తెలిపింది.
నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
రేపు ఛలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని, మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని తెలిపింది.
👉గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ?*
ఏపీ లో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నిన్న ఈ నాలుగు జిల్లాల నేతలతో టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమావేశమయ్యారు.
అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని వారిని కోరారు..
పోటీ చేసేందుకు నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
👉నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎస్‌లు కాంతిరాణా, పీఎస్ఆర్, విశాల్‌గున్నీపై చర్యలకు సిద్ధం*..ఏసీపీ హనుమంతరావు, సీఐ ఎం.సత్య నారాయణ రావుపై ప్రభుత్వం వేటు.జత్వానీ ఇంటరాగేషన్‌లో కీలక పాత్ర పోషించిన హనుమంతరావు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో జత్వానీని ఆగమేఘాలపై అరెస్ట్ చేసిన సత్యానారాయణ.గత రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీ ఫిర్యాదు..ఏపీలో సంచలనమైన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం.సత్యనారాయణరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జత్వానీ కేసు అనంతరం హనుమంతరావు కాకినాడకు డీఎస్పీగా బదిలీ అయ్యారు. జత్వానీ ఇంటరాగేషన్‌లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించారు. ఆమె పోలీసు కస్టడీలో ఉండగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమెను ఇంటరాగేట్ చేశారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సత్యనారాయణరావు ఎలాంటి వివరాలు లేకున్నా సరే ఉన్నతాధికారుల ఆదేశాలపై జత్వానీని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ కేసులో అన్నీ తామై నడిపించిన ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ తదితరులపై చర్యలకు రంగం సిద్దమైంది.
ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీ ఫిర్యాదు
తల్లిదండ్రులు, న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌చంద్ర, పాల్‌తో కలిసి గతరాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నటి జత్వానీ విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు తమను అరెస్ట్ చేశారని, ఏ తప్పూ చేయకున్నా తమ కుంటుంబం 42 రోజులపాటు జైలులో మగ్గిందని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన పోలీసు అధికారులతోపాటు విద్యాసాగర్‌పైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
👉ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు..గనులశాఖలో రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు
ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా కేసులో ఆరోపణలు
ఎదుర్కొంటున్న వెంకటరెడ్డి.గురువారం కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి..ఏపీ, తెలంగాణతోపాటు చెన్నైలోనూ ఆయన కోసం గాలింపు..ఏపీలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. గురువారం ఆయనపై కేసు నమోదు కాగా, అప్పటి నుంచి మూడు బృందాలు ఆయన కోసం వెతుకుతున్నాయి. ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులోనూ ఆయన కోసం గాలిస్తున్నారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు చెన్నై, తిరుపతి, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, కొర్లకుంట తదితర గ్రామాల్లోని ఆయన నివాసాలతోపాటు రైల్వే కోడూరులోని ఆయన అత్తగారి ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక కాంట్రాక్టు, నిర్వహణలో రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. కేసు నమోదైన వెంటనే వెంకటరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గనుల శాఖలో ఆయన సన్నిహితులను ఏసీబీ విచారించింది
👉జనసేనలోకి బాలినేని???.ఇతర నేతలు వెళ్లకుండా వైసీపీ హైకమాండ్ జాగ్రత్తలు..
వైఎస్ఆర్‌సీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు.తాజాగా జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేపోమాపో ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
కనీసం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్నారు. తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడం లేదని కూడా గతంలో పార్టీపై అసంతృృప్తి వ్యక్తం చేశారు.వైసీపీ తరపున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. ఆయన బాలినేనికి సన్నిహితుడు. ఆయన సిఫారసు ద్వారానే సిట్టింగ్ గా ఉన్న మంత్రి ఆదిమూలం సురేష్ ను తప్పించి .. తాటిపర్తికి టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు బాలినేని పార్టీ మారిపోతే ఆయన కూడా వెళ్తారన్న ఉద్దేశంతో.. పార్టీ ఆఫీసు నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ కు పిలుపు వచ్చింది . జగన్ ఆయనతో మాట్లాడి.. పార్టీకి విధేయంగా ఉండాలని..బాలినేనితో కలిసి నడవవొద్దని చెబుతారని అంటున్నారు.బాలినేనికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. ఆయన పార్టీని చక్క బెడతారని పలువురు ప్రకాశం జిల్లా నేతలు ఇటీవలి కాలంలో జగన్ తో పాటు పార్టీ నేతల్ని కలిసి చెబుతున్నారు. అయితే అసలు బాలినేనికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలియడంతో … ఆయనకు మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు బాలినేనిని టీడీపీలోకి రానివ్వరు. బీజేపీలో చేరలేరు. పవన్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గతంలో కూడా బాలినేనిపై ఈ ప్రచారం జరిగింది. అప్పట్లో ఖండించారు కానీ.. ఇప్పుడు ఖండించడం లేదు. తనను ఆ పార్టీలోకి వెళ్లాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.
👉వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు శనివారం మధ్యాహ్నం లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్, తలశిల రఘురాం హాజరు కానున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని మరోసారి పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు వీరందరికి మరోసారి నోటీసులు పంపారు.
దీంతో వీరందరూ శనివారం హాజరుకానున్నారు.
మరో ప్రక్క మాజీ ఎంపీ నందిగామ సురేశ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్న సంగతి తెలిసిందే.
👉కొడుకు ప్రేమ వివాహం – తల్లిని కట్టేసి చిత్రహింసలు పెట్టిన యువతి బంధువులు, కర్నూలు జిల్లాలో దారుణం*
కర్నూల్ జిల్లా..పెద్దకడుబురు మండలం..
ఓ యువకుడు వేరే వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడం అతని తల్లిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. యువతి బంధువులు దళిత మహిళ అయిన ఆమెను స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దళితుడైన ఈరన్న అనే యువకుడు.. మరో వర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు కులం అడ్డంకిగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఊరి నుంచి వెళ్లిపోయారు. ఇలా జరిగిన వెంటనే యువకుని కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయారు. 6 నెలల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో యువతి బంధువులు తీవ్ర ఆగ్రహంతో యువకుడి తల్లి గోవిందమ్మను గురువారం రాత్రి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు. దీంతో స్థానికులు ఆమెను విడిపించేందుకు యత్నించగా వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..
*రక్షించిన పోలీసులు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు. ఆరు నెలల క్రితం దళితుడైన ఈరన్న.. మరో సామాజిక వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడమే అని పేర్కొన్నారు. అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని మరో సామాజికవర్గం ఆదేశించడంతో గొడవ మొదలైనట్లుగా తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల రూపాయలతో బోర్డ్ తిప్పేసిన కంపెనీ… లబోదిబోమంటున్నారు బాధితులు!!!..
ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు.. అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు.. పేరు ఏదైనా.. మోసం మాత్రం కామన్‌ అయిపోతోంది
అవును.. ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం తీరా కొద్దినెలల తర్వాత బిచాణా ఎత్తేయడం.. అలాగే.. అధిక వడ్డీలు పేరు చెప్పి కొన్ని సంస్థలు ప్రజల్ని నిండా ముంచేస్తున్నాయి.
ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు.
మొన్నామధ్య హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసి వందలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేసింది. ఉద్యోగాల పేరుతో 10 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించడంతో మోసపోయిన బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన తెరపైకి వచ్చింది.
హైదరాబాద్‌ మాదాపూర్‌లోని DKZ టెక్నాలజీస్ కంపెనీ అధిక వడ్డీల పేరుతో 700కోట్లు వసూలు చేసింది. కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని పెద్దయెత్తున ప్రచారం చేయడంతో విశేష స్పందన వచ్చింది. మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకి వడ్డీ రూపంలో అధికంగా చెల్లించారు నిర్వాహకులు. ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండడంతో వేల మందితో పెట్టుబడులు పెట్టించారు కొందరు సభ్యులు. అయితే.. రెండు నెలల నుంచి డబ్బులు చెల్లించక పోవడంతో కంపెనీ నిర్వాహకులను నిలదీశారు డబ్బులు కట్టించినవారు, కట్టినవారు. దాంతో.. ఏకంగా.. మాదాపూర్‌లోని ఆఫీస్‌కి తాళం వేసి పరారయ్యారు DKZ టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ ఇక్బాల్, రాహిల్ అనే వ్యక్తులు DKZ సంస్థను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామని నిందితులు ప్రచారం చేసినట్లు తెలిపారు. ఇక.. DKZ టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులు.. సుమారు 18వేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇలాంటి కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు హైదరాబాద్‌ పోలీసులు
👉గణేష్ నిమజ్జనానికి భారీ పోలీస్ బలగాలతో బందోబస్తు..
హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జనం సందర్భం గా 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావే శంలో సిపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ…సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని మధ్యా హ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహ కులతో చర్చించామని.. దానికి వాళ్లు అంగీకరించా రని తెలిపారు.
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్‌సాగర్‌ పరిస రాలకు వస్తారని… దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు.
👉తిరుపతి: మదనపల్లి ఫైల్స్‌ దగ్ధం కేసు
మహిళా రైతు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ
సబ్‌కలెక్టర్‌, MRO ఆఫీసులో కొనసాగుతున్న సోదాలు
కోళ్లబైలు, వలసపల్లి రికార్డులు పరిశీలన..
ఫ్రీ హోల్డ్‌ భూముల కోసం రైతుల దరఖాస్తు
రైతుల స్టేట్మెంట్‌ రికార్డు చేసిన అధికారులు..
👉 పొదిలిలో నిఘా నేత్రాలు పట్నంలోని అన్ని సెంటర్లలో నిఘా నేత్రాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో సీఐ టీవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వి వేమన తెలిపారు. గతంలో 16 నిఘ నేత్రాలు ఉండేయని, వాటిలో కొన్నింటికి మరమ్మత్తులు చేయించడంతోపాటు, నాలుగు కొత్తవి కూడా ఏర్పడడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వీటివల్ల దొంగతనాలు,అనుకోని సంఘటన జరిగిన పసికట్టేవీలు కలుగుతుంది అన్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త