ఇష్యూ సీరియస్… దేశరాజధానికి ట్రాక్టర్లపై క్యూ కట్టిన రైతులు!!!

హస్తిన వేదికగా అన్నదాతలు మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. హస్తిన వేదికగా అన్నదాతలు మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం సెంట్రల్ గవర్నమెంట్ తో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు “ఢిల్లీ చలో” పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా… పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు దేశ రాజధాని దిశగా కదిలారు. దీంతో రాజధానిలో పరిస్థితి టెన్షన్ గా మారిందని అంటున్నారు. అవును… పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన – 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు పంజాబ్‌ లోని ఫతేగఢ్‌ సాహిబ్‌ నుంచి వేలాదిమంది అన్నదాతలు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయల్దేరారు.మరోవైపు రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇందులో భాగంగా సిటీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా రోడ్లపై భారీఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేశారు. కొన్ని చోట్ల కాంక్రీట్‌ బ్లాక్స్లు, ఇనుప కంచెలు అడ్డుగా పెట్టారు. ఇదే సమయంలో అన్నదాతల ఆందోళన దృష్ట్యా… ఢిల్లీ అంతటా నెల రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంట్‌ సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్‌ ను మూసివేశారు. ఇలా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది. ఈ సందర్భంగా కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్‌ సింగ్‌ పంధేర్‌ మాట్లాడారు. తాము బారికేడ్లను బద్దలుకొట్టాలనుకోవడం లేదని.. చర్చలతోనే తమ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని.. కానీ, కేంద్రం ఏ విధంగానూ సహాయం చేయడం లేదని అన్నారు. అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాలీ మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఈ విషయాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఇందులో భాగంగా… అన్నదాతల ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టిందని, ఈ క్రమంలోనే రైతులను నిర్బంధించేందుకు వీలుగా ఢిల్లీలోని బావనా ప్రాంతంలో తాత్కాలిక జైలుగా ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించిందని తెలిపారు. రైతన్నలను జైల్లో పెట్టడం సరికాదని స్పష్టం చేశారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…