సోనియాతో పీవీకి విభేదాలు ఎందుకు వచ్చాయి…????

ఎంత చెప్పుకున్నా పీవీ గురించి తక్కువే. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కని మెట్లు లేవు. ఆయనకు రాని బిరుదులు లేవు . పీవీ నరసింహారావు గ్రేట్ లీడర్. అందులో నో డౌట్. ఆయన లాంటి రాజకీయ వైతాళికుడిని ఈ దేశం గతంలో చూసి ఉండదు, భవిష్యత్తులో అసలు చూడదు. ఆయన బహు ముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పదహారు భాషలలో పట్టు సాధించిన వారు. రాజకీయ నాయకుడు కాదు రాజకీయ వేత్త. మేధావి అపర చాణక్యుడు. మౌనం కూడా ఒక నిర్ణయమే అన్న కొత్త సూత్రాన్ని కనిపెట్టి లోకానికి పరిచయం చేసిన జ్ఞాని.
ఇలా ఎంత చెప్పుకున్నా పీవీ గురించి తక్కువే. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కని మెట్లు లేవు. ఆయనకు రాని బిరుదులు లేవు. ఇపుడు ఆయన భారత రత్నం అయ్యారు. నిజంగా ఆ అవార్డుకు ఆయన నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. ఎందుకంటే తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశాన్ని ఒక దశలో దిశలో నడిపించారు. అలా నాలుగున్నర దశాబ్దాల ప్రయాణం తరువాత దేశం గమనం ఇబ్బందులలో పడినపుడు ఈ దేశం బంగారాన్ని సైతం అమ్ముకునే స్థితి ఏర్పడినపుడు ఆర్ధిక సంస్కరణలతో కొత్త మలుపు తిప్పి ఈ రోజు నవీన భారతానికి పునాది వేసిన మహనీయుడు పీవీ కాకుండా భారత రత్నం మరెవరు అవుతారు పీవీకి పదవుల మీద వ్యామోహం లేదు. ఆయన రాజకీయాల్లో ఉన్నా తామరాకు మీద నీటి బొట్టు చందంగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. కానీ ఉమ్మడి ఏపీలో ఆయన ముఖ్యమంత్రి అయి కొన్నాళ్ళు ఆ పదవిలో ఉన్నారు. ఇక కేంద్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. విదేశాంగ శాఖ నుంచి మానవ వనరుల శాఖ నుంచి హోం శాఖ వరకూ ఎన్నో చేపట్టి అన్నింటికీ వన్నె తెచ్చారు. ఆయన చేపట్టని ఒకే ఒక పదవి ప్రధాని అని అప్పట్లో అంతా అనుకునేవారు. అలాంటి పీవీ తట్టా బుట్టా సర్దుకుని ఇక ఈ రాజకీయం చాలు అని హైదరాబాద్ కి వెళ్ళిపోదామని అనుకుంటున్న వేళ రాజీవ్ గాంధీ దారుణ హత్య జరిగింది. అది 1991 మే 21. అప్పటికి కొన్ని దశల లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. ఆ దుర్ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ అంతా కలసి పీవీనే కాంగ్రెస్ కి నాయకత్వం వహించమని కోరింది. అలా ఆయన తాను వద్దనుకున్న బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అదే ఏడాది జూన్ లో కాంగ్రెస్ నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వానికి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అలా అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన సమర్ధత చాలా గొప్పది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ లో ప్రధానిగా ఏఐసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఒక్కరే నిర్వహించడం నెహ్రూ ఇందిర రాజీవ్ తరువాత పీవీకే దక్కింది వారంతా ఒకే కుటుంబం. కానీ నెహ్రూ గాంధీ కుటుంబేతరుడు ఇలా కీలక బాధ్యతలు మోస్తూ జాతీయ స్థాయిలో అయిదేళ్ల పాటు గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ కి లీడర్ గా ఉండడం అంటే అది గొప్పగా చూడాలి. ఆ సమయంలో సోనియాగాంధీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు నాటి సీనియర్ నేతలు కొందరు పీవీ మీద పనిగట్టుకుని సోనియాగాంధీకి చాడీలు చెప్పేవారు అని ప్రచారంలో ఉన్న మాట. పీవీ సైతం తన రాజకీయ ఠీవిని ఏనాడూ కోల్పోలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. పార్టీ మేలు కోసం పనిచేశారు. ఆయన భజన బృందాల మాదిరిగా వ్యవహరించలేదు. బహుశా ఈ కారణాలే ఆయనకు సోనియాగాంధీకు మధ్య గ్యాప్ ని పెంచాయని అంటారు. ఎంతలా అంటే సోనియా గాంధీకి పీవీ పొడ గిట్టనంత అని చెబుతారు. పీవీకి రాజకీయాల మీద వ్యామోహంలేదు. పార్టీని తన వారసులకు ఇవ్వాలన ఆశ అంతకంటే లేదు. కానీ ఆయన కాంగ్రెస్ ని కష్టకాలంలో నిలబెట్టి తాను కష్టాల పాలు అయ్యారు. ఆయన గాంధీ కుటుంబానికి గిట్టని వారు అని భజన బృందాలు చేసిన ప్రచారానికి బలి అయ్యారు. కాంగ్రెస్ ని నిలబెట్టడం కోసం ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని రక్షించడానికి చూస్తే చివరికి అదే ఆయనకు ఇబ్బందిగా మార్చాయి దశాబ్దాల బంధం కాంగ్రెస్ తో ఉన్న పీవీ చివరికి అదే కాంగ్రెస్ లో ఒంటరి అయ్యారు. దేశాన్ని పాలించిన ప్రధానులు చనిపోతే ఢిల్లీలో వారికి అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ పీవీకి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఆయన చనిపోయేనాటికి దేశంలో కాంగ్రెస్ నాయకత్వాన యూపీయే వన్ ప్రభుత్వం ఉంది. అయినా ఆయన భౌతిక కాయాన్ని సొంత స్టేట్ అయిన ఏపీకి తీసుకుని వెళ్లేలా కొన్ని పరిణామాలు జరిగాయి. ఇంతకీ ఆయన కాంగ్రెస్ పెద్దలకు చేసిన అపకారం ఏమిటి అన్నది చూస్తే జవాబు ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. కానీ రాజకీయాల్లో ఎంతటి మహా శిఖరం అయినా కొన్నింటికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా పీవీ రాజకీయాలలో చివరి పుటలను చూడాలి.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..