జగన్ రెడ్డి పాలనలో ఒక్క బీసీ సోదరునికి అయినా సబ్సిడీ ఋణం అందించారా..?

*తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటాం*

*గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల*

రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న జగన్ రెడ్డి ఒక్క బీసీ సోదరునికయినా సబ్సిడీ ఋణం అందించారా అని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.శనివారం అర్ధవీడు మండలం దొనకొండ గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గోన్న అశోక్ రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలకు వెన్నుపోటు పొడిచాడని, ఎన్నికల సమయంలో బీసీ సోదరులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా బీసీలపై దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టటం వైసీపీ నాయకుల దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. నాడు తెలుగుదేశం హయాంలో బీసీ సోదరుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని గుర్తు చేశారు.. గిద్దలూరు నియోజకవర్గంలో బీసీ భవనాలను మంజూరు చేసి పనులను ప్రారంభిస్తే ఈ వైసీపీ పాలకులు ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.. రాష్ట్రంలో బీసీ సోదరుల సంక్షేమం కోసం కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అని, మళ్ళీ అధికారంలోకి రాగానే గతంలో అందించిన పథకాలతో పాటు బీసీ సోదరులను అన్నీ విధాలుగా ఆదుకొనే బాధ్యత తెలుగుదేశం పార్టీది అని భరోసానిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ టీడీపి, జనసేన లకు మద్దతుగా నిలిచి రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని కోరారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్, ప్రధాన కార్యదర్శి కొణతం రంగారెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు ఈర్ల ఎర్రన్న యాదవ్, స్థానిక సర్పంచ్ సిరివెళ్ళ ఎస్తేరు రాణి, మాజీ సర్పంచ్ బండి నారాయణ రెడ్డి, యాచవరం సర్పంచ్ పీరయ్య, పాపినేనిపల్లె సర్పంచ్ పుల్లారావు, మాజీ ఎంపీటీసీ మండ్ల రంగయ్య, బోయపాటి వెంకటేశ్వర్లు, బియ్యాల నారాయణ, ఉపాధ్యక్షులు సూరె కృష్ణయ్య, క్లస్టర్ ఇంచార్జ్ మారెడ్డి రంగారెడ్డి, మండల టీడీపీ నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు