బీజేపీతో టీడిపి పొత్తు వెనక చంద్రబాబు వ్యూహం ఏమిటి ???

 

చంద్రబాబు  ఊరకే పొత్తులకు వెళ్లరు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది. ఏపీలో బీజేపీతో పొత్తు టీడీపీకి ఏమి లాభం అన్న చర్చను అందరూ చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే అదే నిజం అని కూడా అనిపిస్తుంది. అర శాతం ఓట్లు ఉన్న బీజేపీకి ఏపీలో నలభై శాతం ఓట్లు ఉన్న టీడీపీకి పొత్తు ఏమిటి అని ఆశ్చర్యం ప్రకటించేవారూ ఉన్నారు. కానీ చంద్రబాబు ఊరకే పొత్తులకు వెళ్లారు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది.  జనసేనతో పొత్తు వల్ల ఒక బలమైన సామాజిక వర్గం టీడీపీ వెంట నడుస్తుంది. అలాగే సినీ గ్లామర్ కలిగిన పవన్ వెంట ఉంటే కామన్ ఓటర్ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇక యూత్ ఓట్లు కూడా టీడీపీకి టర్న్ అవుతాయి. ఎలక్షనీరింగ్ లో జనసేన క్యాడర్ సాయం కూడా ఆయాచితంగా లభిస్తుంది.దాంతోనే ఎవరు ఏమి అనుకున్నా చంద్రబాబు జనసేనకు సీట్లు ఇస్తూ పొత్తులను కుదుర్చుకుంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు ఓకే అయింది. ఇక ఇపుడు చూస్తే బీజేపీ విషయం. బాబు ఇటీవల స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ పొత్తులు పెట్టుకుని వచ్చారని టాక్. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించారు అన్నది మరో ప్రచారం. ఇలా చేయవచ్చా అన్నది కూడా సొంత పార్టీతో పాటు బయట కూడా చర్చ సాగుతోంది. కానీ ఏపీలో జగన్ ని కట్టడి చేయాలంటే బీజేపీ సాయం తప్పసరి అని బాబు భావిస్తున్నారు. నిజానికి చూస్తే ఇదే కరెక్ట్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నారు. ఎలక్షనీరింగ్ లో ఆయన్ని కొట్టడం టీడీపీకి ఈ టైం లో చాలా కష్టం. ఆయనకు తోడు బీజేపీ సెంటర్ లో పవర్ లో ఉంది. బీజేపీ ప్లస్ జగన్ అంటే అగ్నికి వాయువు తోడు అయినట్లే.  దాంతో పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీ దారుణంగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు బూతుల వద్ద టీడీపీకి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చినా పట్టించుకునే నాధుడు ఉండడని అంటున్నారు. అందువల్ల కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని తమ వైపు తిప్పుకుంటే జగన్ ని కట్టడి చేయవచ్చు అన్నదే టీడీపీ ఎత్తుగడ. అంతే కాదు మనీ ఫ్లో విషయంలో కూడా ఫ్రీ మూమెంట్ ఉండాలీ అంటే కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ అండ కావాలి. బీజేపీని తమ వైపు తిప్పుకుంటే అర్ధ బలం అంగబలం ఒకేసారి టీడీపీ జట్టులోకి వచ్చేస్తాయి. అందుకే చంద్రబాబు తెలివిగానే పావులు కదిపారు అని అంటున్నారు. అయితే బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేస్తే ఈ లాభం కాస్తా గూబల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు.  ఇపుడు చూస్తే బీజేపీని అవును అనిపించుకుంటే ఆ తరువాత చంద్రబాబు చాణక్యంతో సీట్ల సర్దుబాటులోనూ పై చేయి సాధిస్తారు అని అంటున్నారు. అంతేకాక బిజెపి ఈవీఎంల ద్వారా గోల్మాల్ చేసి అధికారంలోకి వస్తుందని, లేదంటే అవతలి పార్టీకి చెందిన   ఎమ్మెల్యేలను కొనుగోలు చేసో  అధికారంలోకి రావడం లేదా తమతో చేయి కలపని  పార్టీలు అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టడం వంటి అనేక కుట్రలకు పాల్పడుతుందని ప్రతిపక్షాలు కోడై కూర్చున్న విషయం తెలిసిందే . ఈ కిటుకులు తెలిసిన   వారు ఏపీలో ఇద్దరే ఇద్దరు. ఒకరు చంద్రబాబు. రెండవ వారు జగన్.తాము కానీ తమ ప్రభుత్వాలు గానీ మనుగడ సాధించాలంటే బిజెపి సాయం తప్పనిసరి కాబట్టి ఆ ఇద్దరు  అందుకే ఒకరి తరువాత ఒకరు ఢిల్లీ టూర్లు చేశారు అని అంటున్నారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…