ప్రకాశం జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి అదేశాల మేరకు అదనపు ఎస్పీ నాగేశ్వరావు నేతృత్వంలో చిమకుర్తి మండలం బుదవాడ గ్రామంలో బీహార్ వాసి రమేష్ సహానీ దగ్గర నుంచి 540 గంజాయి చాక్లెట్లు (3.480 గ్రాములు) సుమారు 10 వేల రూపాయిలు విలువ కలిగిన చాక్లెట్ లను ఎస్ఈబి సిఐ మారయ్య బాబు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం తప్పవని ఈ సందర్బంగా సిఐ మారయ్య బాబు తనదైన శైలిలో హెచ్చరించారు. సమీపంలో ఉన్న క్వారీలలో పనిచేసే వారినే టార్గెట్ చేసుకునే ఇలాంటి వారిపై నిరంతరం నిఘా ఉంటుందని, ఇలాంటి వాటికి సంబందించి వివరాలను ఎస్ఈబి అధికారులకు తెలియజేస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ రైడ్స్ లో ఎస్ఐ వినితా రెడ్డి, హెడ్ యూసఫ్ షరీఫ్, కానిస్టేబుల్ రామిరెడ్డి, బాలసుబ్బయ్య, సురేష్, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు