చెలరేగిపోతున్న మట్టి మాఫియా..ఘనంగా ఉడుముల గృహప్రవేశం.. జగన్ పై ధ్వజమెత్తిన ముత్తుముల.. ఫ్లెక్సీలను తగలబెట్టిన బి.కె అభిమానులు.

👉100 కోట్ల మట్టి తరలించుకెళ్లారు .. దుమ్ము ధూళి కి పంటలు దెబ్బతింటున్నాయి.. గుంతలలో పశువులు చనిపోతున్నాయి..ఎర్రమట్టి కొండ తవ్వకాలను శాశ్వతంగా ఆపకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం..

బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని బొబ్బేపల్లి గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి కొండను పలుకుబడి కలిగిన రాజకీయనాయకులు గత 15 సంవత్సరాల నుండి గుత్తేదారులు, అధికారులు అండదండలతో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎర్రమట్టి కొండను అక్రమంగా తవ్వుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతో తమ తాము వేసుకున్న ఫైర్లు దుమ్ము ధూళి వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి రైతులు లక్షలాది రూపాయలు నష్టం చవిచూస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా పొగాకు పత్తి మిర్చి కూరగాయల పంటలు పండిస్తుంటారు. గత 15 ఏళ్లుగా ఎర్ర మట్టి తవ్వకాలవల్ల,వాహనాల రాకపోకలు సాగిస్తున్నాడం వల్ల పైర్లపై దుమ్ము ధూళి పడి పసిడి రాశులు కురిపించే పూత కాయ దశల్లో సమూలంగా పీకి పారేస్తున్నామని రైతులు వాపోతున్నారు. గత 15 ఏళ్లుగా సుమారు 100 కోట్లకు పైగా మట్టిని అక్రమంగా తరలించారని అన్నారు. ఇక మేతకోసం వెళ్లే గేదెలు మేకలు వంటి పశువులు వర్షాకాలంలో గుంతలలో పడిపోయి చనిపోతున్నాయని పశుపోశకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గురువారం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన నాయకులు,ప్రజలు కొండ వద్దకు చేరుకొని ఎర్ర మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రమట్టి కొండను అక్రమంగా తొలిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని దాని వలన గ్రామానికి ఎటువంటి ఉపయోగం లేకపోగా ఎన్నో అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాక దొంగ బిల్లులతో సైతం అక్రమ రవాణా జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు తమ మొరను వినిపించినా కూడా వారు కూడా అందిన కాడికి దండుకుంటున్నారే కానీ గ్రామ ప్రజానీకం ఆవేదనను పట్టించుకోవడంలేదని, అధికారుల సైతం తమ సమస్యను పరిష్కరించకపోగా తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తవ్వకాలను శాశ్వతంగా ఆపివేయాలని తద్వారా పర్యావరణాన్ని తమ పంట పొలాలను కాపాడాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు .ఈ సమస్యను ఎన్నికలలోపు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికలను తమ గ్రామంలోని ప్రజలంతా కలిసికట్టుగా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

*ఉడుముల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే లు అన్నా, కుందూరు

పొదిలికి చెందిన ఉడుముల గురువారెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త అన్నా రాంబాబు, మార్కాపురం ఎమ్మెల్యే,గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కుందూరు నాగర్జున రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారిని ఎమ్మెల్యే లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

👉జగన్ రెడ్డి మాట తప్పాడు, మడమతిప్పాడు..చంద్రబాబు 2సెంట్లు ఇంటి పట్టా ఇస్తే.. జగన్ రెడ్డి సెంటుకు కుదించాడు..మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా పశ్చిమ ప్రాంత వాసులకు వెన్నుపోటు పొడిచాడు..వెలుగొండ జలాలు అందించడంలో మాట తప్పాడు..కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి అయిన సబ్సిడీ ఋణం అందించాడా..?గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల..

రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అశోక్ రెడ్డి మాట్లాడుతూ 57నెలల పాలనా కాలంలో 14 లక్షల అసైన్మెంట్ భూములను కబ్జా చేసిన జగన్ రెడ్డి ముఠా ప్రజా ద్రోహులు కాదా అని ప్రశ్నించారు. పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఆయువు పట్టు అయిన వెలుగొండ జలాలను నాడు తెలుగుదేశం హయాంలో యుద్ధప్రాతిపదికన 80% పనులను పూర్తి చేస్తే, 2023 డిసెంబర్ నాటికీ నీరు అందిస్తానని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి వెలుగొండ జలాలను అందించకుండా జిల్లాలోకి ఎలా వచ్చాడన్నారు. జిల్లాల పునర్విభజనలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం కనిపించలేదా అన్నారు. గత తెలుగుదేశం హయాంలో పక్కా గృహలకు 2.50 లక్షలు మంజూరు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ.1.80 వేల రూపాయలతోనే చేతులు దులుపుకొని పేదల పై కపట ప్రేమ చూపించారన్నారు. కార్పొరేషన్ల ద్వారా ఒక్కరికైనా, ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఋణం అందించలేదన్నారు. అదే విధంగా జగనన్న లేఅవుట్ ల, పేరుతో పేదలకు లబ్ది చేకూర్చటం కంటే అధికారపార్టీ నాయకుల దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చాడని, ఆర్బాటాలతో మొదలు పెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఒక్క రూపాయి లబ్ది చేకూరలేదన్నారు. జగన్ పాలన అంతా అబద్దపు హామీలు, అరాచక పాలన తప్ప అభివృద్ధి శూన్యమని రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపటం ఖాయమన్నారు.

👉ప్రకాశం జిల్లా, కొత్తపట్నంలో ఆరవీటి సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ కార్యక్రమంలో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి..

*👉తెదేపా టికెట్ బి.కె పార్థసారథి కి ఇవ్వనందుకు ఫ్లెక్సీలను తగలబెట్టిన బి.కె అభిమానులు. పెనుకొండ లోని బి.కె పార్థసారథి ఇంటి ముందు తెదేపా ఫ్లెక్సీలు తగలబెట్టి,రోడ్డుపై బైఠాయించిన బికే అభిమానులు.*

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..