బాపట్ల పట్టణం వైసిపీ కి చెందిన సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాథ్ రెడ్డి బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాకప్పుకొని తెలుగుదేశం పార్టీ లోకి చేరారు
*కొందరికి బుజ్జగింపులు*టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు.తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.ఫస్ట్ లిస్టులో సీట్లు కోల్పోయిన వారందరికీ చంద్రబాబు పిలుపు.చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఆలపాటి రాజా.రేపు పెనుకొండ ఇన్ఛార్జ్ పార్థసారథికి పిలుపు.అధినేత నుంచి పిలుపు కోసం వేచిచూస్తున్న సీట్లు దక్కని నేతలు.ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు.
👉ఢిల్లీలో మద్దతు ధరలు ఇవ్వాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ రైతులపై కాల్పులకి నిరసనగా సోమవారం ప్రకాశం జిల్లా కొండపిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.
👉 *జనసైనికులు మరొక్కసారి ఆలోచించుకోండి, బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల*
అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారని. పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు
👉ప్యాకేజీ కోసం తమ అభిమానులను ఆమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త: మంత్రి అంబటి*..పవన్ సీఎం అవుతారని ఆశ పడ్డ జనసైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి అన్నారు. ప్యాకేజీకి ఆమ్ముడుపోయిన జనసేనని వెంట జనసైనికులు వెళ్లవద్దని హితవు పలికారు, లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు.
👉బి పేటలో నాగార్జునరెడ్డి కి ఘన స్వాగతం.. వైకాపాఖ్యాలు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. సోమవారం జరిగిన బేస్తవారిపేట మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.బేస్తవారిపేట ఎంపీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,కుందూరు నాగార్జునరెడ్డి విద్యావంతుడు, సౌమ్యుడు,నిరంతరము ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప మనసున్న మహారాజు అని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పనిచేయాలని పలువురు వైకాపా నాయకులు,కార్యకర్తలు కోరారు.