వివేకం సినిమాపై సునీత వివాదాస్పద వ్యాఖ్యలు.. జగన్ కు భారీ షాక్.. విస్తృత ప్రచారంలో గిద్దలూరు వైసిపి,టిడిపి.. ఏసీబీ కి పట్టుబడ్డ ఎస్సై

అంతకు మించి… “వివేకం” సినిమాపై సునీత వ్యాఖ్యలు వైరల్!!!

అవును… వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనమైన విషయంగా మారిందనే సంగతి తెలిసిందే. జగన్ ఇటీవల ప్రారంభించిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ వివేకా మర్డర్ కేసుపై చేసిన వ్యాఖ్యల అనంతరం సునీత తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.నాటి నుంచి మరి ఎక్కువగా సునీత నర్రెడ్డి.. ఏపీ సీఎం జగన్ ని వెంటాడుతున్నట్లు చెబుతున్నారు.నేరుగా వైసీపీ ఓటు వేయొద్దనే క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేసినంత పనిచేశారని అంటున్నారు!! ఈ సమయంలో తాజాగా “వివేకం” సినిమా స్పందించారు! అవును… వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనమైన విషయంగా మారిందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఈయన హత్య జరిగినప్పటినుంచి నేటి వరకూ ఈ కేసు వార్తల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది! పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో…ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది.ఇదే సమయంలో వివేకా కుమార్తె సునీత చేస్తున్న కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి.ఈ సమయంలో వివేకా జీవిత చరిత్రతో తెరకెక్కినట్లు చెబుతున్న “వివేకం” సినిమాపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా…”వివేకం” అనేది డాక్యుమెంటరీ అనాలో, సినిమా అనాలో తెలియడం లేదు” అని మొదలుపెట్టిన సునీత…ఎవరో కానీ..చాలా ధైర్యంగా ఆ సినిమా తీశారని తెలిపారు. ఆ సినిమాలో కొన్ని వ్యక్తిగత అంశాలో తేడా ఉంటే ఉండొచ్చు కానీ…చివరి అరగంట మాత్రం తనకు చాలా భయమేసిందని..ఆ సమయంలో తాను కళ్లు మూసుకున్నానని సునీత చెప్పారు! ఇదే సమయంలో… వివేకా మర్డర్ విషయంలో రియాలిటీని తలచుకొంటే మాత్రం “వివేకం” సినిమాను లైట్ గా తీశారని చెప్పారు. ఇదే సమయంలో..గత ఎన్నికల్లో తన తండ్రి హత్యను రాజకీయాలకు వాడుకున్నారని చెప్పిన సునీత..ఐదేళ్ల తర్వాత తిరిగి ఇప్పుడూ అదే చేస్తున్నారని అన్నారు.ఇక తానెప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు కానీ.. తప్పు జరుగుతోంది కాబట్టి బయటకు వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో…వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా తనతో పాటు రాష్ట్రానికీ మంచిది కాదని చెప్పడం గమనార్హం! వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యక్తిగతంగా నాతో పాటు ఈ రాష్ట్రానికీ మంచిది కాదు’’అని సునీత వ్యాఖ్యానించారు. కాగా…ఈ సినిమాపై వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన స్టేట్ మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ప్రదర్శనతో పాటు, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ లను ప్రతివాదులుగా చేర్చారు.

👉ఎన్నికల ముందు జగన్‍కు భారీ షాక్.*  అవును… సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో… ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఉన్నతాధికరులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా… ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఆరుగురు ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి.. ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ ఒక లేఖ రాశారు. ఇందులో భాగంగా… ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), ఐదుగురు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ని బదిలీ చేస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో… బదిలీ అయిన వరికి 2024 సార్వత్రిక ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశాలు.

👉 టంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబి దాడులు..ఎస్సై నాగేశ్వరావు ఓ కేసు విషయం లో లంచం తీసుకుంటుండగా ఏసీబి డీ ఎస్పీ శ్రీనివాస్ కు పట్టు బడ్డ వైనం..ఓ సివిల్ వివాదం లో రూ1:70 వేలు కాకుటూరు పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద డిమాండ్ చేసిన ఎస్సై నాగేశ్వరావు..70000 లంచం తీసుకుంటు ఏసీబి కి పట్టుబడ్డారు

👉ముత్తుముల సమక్షంలో కంభం అంకాలమ్మ తిప్పకు చెందిన 17 కుటుంబాలు టిడిపిలోచేరిక .

గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మంగళవారం కంభం పట్టణంలోని అంకాలమ్మ తిప్ప వీధిలో కంభం పట్టణ మహిళా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి.తోట శ్రీనివాసులు. ఓబుల్ రెడ్డి మాధవ ఆధ్వర్యంలో 17 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉 కంభంలో ప్రచారం నిర్వహించిన గిద్దలూరు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.నాగార్జున రెడ్డి..

గిద్దలూరు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.నాగార్జున రెడ్డి మంగళవారం పట్టణంలోని పలు వీధులలోని ముఖ్య నాయకులను కలిశారు. కోనేటి వీధిలో ముస్లిం మైనార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన వైకాపా హయాంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

👉అనంతరం ఆయనకు కంభం మండల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు..ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..కార్యక్రమంలో కంభం మండల పరిషత్ అధ్యక్షులు చేగిరెడ్డి తులసమ్మ,ఓబుల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ డిష్ మున్నా,కంభం మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి ,మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి,సర్పంచులు,ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునను గెలిపించాలని కోరుతూ గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో ప్రచారం చేసిన నాగార్జున రెడ్డి సతీమణి కల్పన రెడ్డి..గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నాగార్జునరెడ్డి సతీమణి కల్పన రెడ్డి గెలుపే లక్ష్యంగా గిద్దలూరు పట్టణంలో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుకు చెందిన నల్లబండ బజార్,పాములపల్లె రోడ్ లో ఇంటింటికి తిరిగి వైసీపీ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.మే13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగార్జున రెడ్డిని,ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాను గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలి..గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ముత్తుముల సతీమణి పుష్పలీల*  గిద్దలూరు..నగర పంచాయతీ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతినెల అందచేయుచున్న సామాజిక పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా అందచేయాలని గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ గారికి టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల వినతి పత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బంది వారి వార్డు పరిధిలోని పింఛన్ దారులకు ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేయవలెనని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులను ఇబ్బందులకు గురి చేయకుండా వారికీ సకాలంలో పెన్షన్ నగదును అందచేయాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పిడతల సరస్వతి, పట్టణ కౌన్సిలర్లు బిల్లా రమేష్, గడ్డం భాస్కర్ రెడ్డి, పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, కాపు నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య, బోయిలపల్లి కిషోర్, మండ్ల శ్రీను, ధనలక్ష్మి, బొంతా లక్ష్మీదేవి, సుశీలమ్మ, తదితరులు పాల్గోన్నారు*..

👉విశాఖ :నగరంలో సుమారు కోటి రూపాయలు నగదు పట్టుకున్న పోలీసులు….నగరంలోని ద్వారకా నగర్ వద్ద సుమారు కోటి రూపాయలు నగదు పట్టుకున్న పోలీసులు….ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు..నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ద్వారక సి.ఐ పోలీసులు సిబ్బందిద్దరు వ్యక్తులతో పాటు నగదు సీజ్ చేసి ద్వారక పోలీస్ స్టేషన్ కు తరలింపు…..

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు