1000 కోట్ల వ్యవహారంపై షర్మిళ ఘాటు రియాక్షన్.. చంద్రబాబు భూ కబ్జాదారుడు.. సజ్జల.. విస్తృత ప్రచారంలో మాగుంట..ముత్తుముల కుందూరు కుటుంబాలు..టిడిపిలో చేరిన స్టార్ భాష.

1000 కోట్ల వ్యవహారంపై షర్మిళ ఘాటు రియాక్షన్! ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో… వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ వ్యవహారం పీక్స్ కి చేరుతుంది. ఇందులో భాగంగా… రూ.1000 కోట్ల వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో…షర్మిల అడిగిన రూ.1000 కోట్ల పనులు చేయకపోవడమే ఆమె తమతో విభేదించడానికి కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.అవును… ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ వర్సెస్ షర్మిళ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుంది.ఇందులో భాగం…రూ.1000 కోట్ల పనులు అడిగితే చేయలేదనే షర్మిళ తమతో విభేదించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నవేళ… ఆమె రియాక్ట్ అయ్యారు.ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానంటూ వైసీపీ నేతలకు షర్మిళ సవాల్ విసిరారు. దీంతో… ఈ వెయ్యి కోట్ల పనుల వ్యవహారం ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మరింత స్పందించిన షర్మిళ… వివేకా హత్య కేసుపై మాట్లాడుతూ జగన్‌ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారు కానీ.. అధికారంలోకి రాగానే మాత్రం ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఇదే సమయంలో…జగన్‌ ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక రూ.వెయ్యి కోట్ల ఆరోపణలపై స్పందించిన షర్మిళ…ఆ వ్యవహారానికి సంబంధించి రుజువులు ఉంటే బయటపెట్టాలని కోరారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా షర్మిల స్పందించారు.ఇందులో భాగంగా… తన భర్త అనిల్‌ కుమార్‌ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు,కలవరని చెప్పారు. ఇదే క్రమంలో…అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు.అదేవిధంగా… బీజేపీతో కంటికి కనిపించని పొత్తును జగన్‌ కొనసాగిస్తున్నారని చెప్పిన షర్మిళ… అదానీ,అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టారని ఫైరయ్యారు.ఇదే సమయంలో… జగన్‌ బీజేపీకి దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్‌ చెప్పారని..మోడీ వారసుడిగానే ఆయన ఉన్నారు తప్ప వైఎస్సార్‌ వారసుడిగా కాదని చెప్పుకొచ్చారు.ఇదే క్రమంలో… తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌ లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని షర్మిళ తీవ్ర విమర్శలు చేశారు!

👉చంద్రబాబు నాయుడు లాంటి భూ కబ్జాదారులకు భూ హక్కు చట్టం ఉక్కు పాదం మోపనుంది, పేద సన్నకారు రైతులకి ఇది మేలు చేస్తుంది.

భూ హక్కు చట్టం చిన్న, సన్నకారు రైతులకు మేలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థ ప్రయోజనాలతో అక్రమంగా భూములు లాక్కుంటున్న వ్యక్తులకు ఇది పెద్ద దెబ్బ. అందుకే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మరిచిపోకండి,ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నీతి ఆయోగ్ (కేంద్రం) ప్రతిపాదించింది.. *సజ్జల రామకృష్ణ రెడ్డి*

👉 రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్………….రాష్ట్రమనే పొలాన్ని జగన్ అనే రైతుకు ఐదేళ్ల క్రితం ఇచ్చారని అనుకుంటే,ఆ జగన్ అనే రైతు ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే పొలంలో పథకాలు, చేసిన మార్పులు, తెచ్చిన సంస్కరణలనే విత్తనాలను, మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలోని ఇంటింటా సంక్షేమం,అభివృద్ధి, సంతోషం,మంచి భవిష్యత్ అనే మొక్కలను నాటారు. ప్రతి గ్రామం,పట్టణం, సామాజిక వర్గంలో నాటిన ఈ విత్తనాలన్నీ మరో 15 ఏళ్లలో వృక్షాలు అవుతాయి.నాణ్యమైన చదువులతో బయటికి వచ్చే మన పిల్లలతో పేదల బతుకులు,రాష్ట్రంలో పేదరికం అనే మాట మాటుమాయం అవుతుందని మీ బిడ్డ సగర్వంగా తెలియజేస్తున్నారు : రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్👉వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా.. పేదల పిల్లలకు మంచి చదువులు అందాలన్నా.. నాణ్యమైన వైద్యం అందాలన్నా.. మన గ్రామాల్లో వ్యవసాయం బాగుపడాలన్నా.. ఎన్నికల రోజు రెండు బటన్లు (ఓట్లు) ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. 177/175 ఎమ్మెల్యే స్థానాల్లో, 25/25 ఎంపీ స్థానాల్లో ఫ్యాన్ గెలవాలి. తగ్గేందుకు వీలే లేదు. దీని కోసం మీరంతా సిద్ధమేనా.. రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్*

👉 ఒంగోలు లోని క్లౌపేట లో రాయపాటి వినోద్ ఆధ్వర్యం లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్, జిల్లా జనసేన ఇంచార్జి షేక్ రియాజ్ సమక్షం లో 200మంది నేడు వై. యస్. ఆర్. సి. పి ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో అయినాబత్తిన ఘన శ్యామ్ తాతా ప్రసాద్,మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి మరియు పలువురు నాయకులు,టీడీపీ,జనసేన, బీజేపీ డివిజన్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

👉 ఒంగోలు లో 33వ డివిజన్ లో దారావారికుంట లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మరదళ్లు శశికళ, సురేఖ,చెల్లెళ్లు సంధ్య, జ్యోత్స్న, మేనకోడలు కీర్తి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ మరదలు డా. హిమబిందు, అక్క మాధవి, కుమార్తె అనిషా లక్ష్మి ,కోడలు శ్రీమతి కీర్తన మరియు ఆత్మకూరి బ్రహ్మయ్య సాయిరాం కార్యక్రమం లో తెలుగుదేశం,జనసేన, బిజెపి నాయకులు, మహిళా కార్యకర్తలు,కార్యకర్తలు, నాయకులు,పాల్గొన్నారు 👉మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో గార్నెపూడి భాస్కర్ ఆధ్వర్యంలో లో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు పలువురు ఆర్యవైశ్య నాయకులు తదితర నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు మండలం పొదలకుంటపల్లె గ్రామం లో తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన రెడ్డి గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల కార్యక్రమంలో కుప్పా రంగసాయి, జయరాం రెడ్డి,భాస్కర్ రెడ్డి, నారాయణ, గుర్రాల రాము కార్యక్రమం లో తెలుగుదేశం, జనసేన,బిజెపి  నాయకులు, మహిళా కార్యకర్తలు,నాయకులు ,పాల్గొన్నారు.

👉 ఒంగోలు పట్టణం లో 25వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదళ్ళు సురేఖ, శశికళ చెల్లెలు వాణి,సంధ్య, మేనకోడలు కీర్తి, దామచర్ల జనార్దన్ అక్క మాధవి,కుమార్తె అనిషా లక్ష్మి,మరదలు డా.హిమ బిందు కోడలు ఆత్మకూరి బ్రహ్మయ్య,సాయి రామ్ తదితర నాయకులు తెలుగుదేశం,జనసేన,బీజేపీ నాయకులు,అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉కాంగ్రెస్ మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో పట్టుబడ్డ నోట్ల కట్టల గుట్టలు!

జార్ఖండ్ కాంగ్రెస్ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించగా రూ 20 కోట్లు బయటపడ్డాయి. అతడి పనిమనిషి సాయంతోడబ్బును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

👉ఇంటింటి ప్రచారంలో ముత్తుముల తనయుడు..

కొమరోలు మండలం గుండ్రేడ్డి పల్లె,నారాయణ పల్లె గ్రామలలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి సోమవారం ఉదయం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

👉, BJP-TDP-JSP మోసపూరిత పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:

 1) 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి

 2) వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు

 3) APలో CAA/NRC ఉండకూడదు.

4) ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.

5) ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం అని చెప్పగలగాలి.

ఇవి ప్రకటించక పోతే మీరు కపట నాటక సూత్రధారి అని, న్యాయంలేనివారు అని నిర్ధారణ అవుతుంది!..సంక్షేమ సారథి అయిన జగనన్నకు మద్దతు ఇద్దాం*….

కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కుందూరు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కోమలతా రెడ్డి ..*

కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి మరదలు కోమలతా రెడ్డి..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి నవరత్నల సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందజేశారని తెలిపారు.

*సంక్షేమ సారథి అయిన జగనన్నకు మనం మద్దతు నిలిచి,మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని,ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు*…..

 కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు,మహిళ నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.

👉ఎన్నికల వేళ గిద్దలూరు వైసీపీలోకి వలస పర్వ

కుందూరు సమక్షంలో నరవ బయనపల్లెకు చెందిన 30 కుటుంబాలు టీడీపీకి గుడ్ బై..

గిద్దలూరు మండలం నరవ బయనపల్లి గ్రామానికి చెందిన దాదాపు 30 కుటుంబాలు* *గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి  సమక్షంలో టీడీపీకి గుడ్ బై చెప్తూ వైసీపీలోకి చేరిక*పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించిన కుందూరు నాగార్జున రెడ్డి.

 👉టీడీపీలో చేరిన కంభం మాజీ సర్పంచ్,.స్టార్ బాషా….కంభం పట్టణంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం పట్టణ మాజీ సర్పంచ్, ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు స్టార్ భాషా వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కొన్నాళ్ల కిందట ఆయన తన అనుచర వర్గంతో వైకాపాలో చేరారు. ప్రస్తుతం ఆయన తిరిగి టిడిపిలో చేరడం పట్ల సర్వత్రా చర్చ్యోపచర్చలు జరుగుతున్నాయి.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…