భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ (India vs Australia Final) ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేదుకు విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆంధ్ర
క్రికెట్
అసోసియేషన్ వారు లైవ్ స్ట్రీమ్ స్క్రీన్పై సుమారు 10 వేల మంది క్రికెట్ అభిమానులు
భారత్
vs ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి మ్యాచ్ ను విక్షించాలి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ తెలిపారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రపంచ కప్ భారత్ మరియు ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి విజయవాడ నగర వాసులు పెద్ద ఎత్తున కదిలి రావాలి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాధ్ కోరారు.
నిరుద్యోగులకు జాబ్ మేళా… టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగాలు
సుమారు ఇందిరాగాంధీ స్టేడియంలో బ్లూ జెర్సీలు మరియు జాతీయ జెండాలతో క్రికెట్ అభిమానులు సందడి చేసేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. భారత్ మరియు ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించటానికి వచ్చే క్రికెట్ అభిమానులుకోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తునట్టు ACA అధికారులు తెలిపారు.
లక్షన్నర జీతంతో టీటీడీలో ఉద్యోగాలు… దరఖాస్తుకు మరో 10 రోజులే ఛాన్స్
క్రికెట్ అభిమాని మాట్లాడుతూ…
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా ఎంత గట్టి ప్రత్యార్థి టీం అయిన వాళ్ళు ఆడుతుంది భారత్ లో అది గుర్తుంచుకోవాలి. మ్యాచ్ ఎవరి మీదైనా భారత్ టీంకి తిరుగు లేదు. భారత్ విజయం కోసం చాలా ఈగేర్లీగా వెయిట్ చేస్తున్నం అని అభిమాని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..