నరసారావుపేట లోక్ సభ స్థానం వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్..!

నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్‌ యాదవ్‌ను
వైఎస్‌ఆర్‌ సీపీ అధిష్టానం
నరసరావుపేట లోక్ సభ స్థానానికి ఎందుకు పంపింది..?!

చాలా మంది మెదళ్లను..
తొలుస్తున్న ప్రశ్న ఇది.

సీఎం వైఎస్‌ జగన్‌కు
అనిల్ కుమార్‌ యాదవ్ అత్యంత విశ్వాసపాత్రుడు

అనిల్ కుమార్‌ యాదవ్‌కు
స్టేట్‌ వైడ్ ఫేమ్ ఉంది
మంచి స్పీకర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

చంద్రబాబు మీద, పవన్‌ మీద..
లోకేష్‌పై దూకుడుగా విమర్శలు చేయడం..
చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్పడం
అనిల్ కుమార్‌ యాదవ్‌ అలవాటు.

సీఎం జగన్ మొదటి కేబినెట్‌లో
నీటి పారుదల శాఖ మంత్రిగా అనిల్ పని చేసి
తానేంటో నిరూపించుకున్నారు,
మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలో..
పలు నియోజకవర్గాల్లో పాల్గొన్న అనిల్ యాదవ్..
తన ప్రసంగాలతో ప్రతిపక్షంపై
పిడుగుల్లాంటి విమర్శలు చేశారు.

నెల్లూరు జిల్లాకు నరసరావు పేట
నియోజకవర్గానికి మంచి సంబంధం ఉంది

1999లో నెల్లూరు జిల్లాకు చెందిన
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
నరసరావు పేట ఎంపీగా పోటీ చేసి
టీడీపీ అభ్యర్ధి లాల్ జాన్ భాషపై
13,882 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2004లో నెల్లూరు జిల్లాకు చెందిన
మేకపాటి రాజమోహన్ రెడ్డి ..
నరసారావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి మద్ది లక్ష్మయ్యపై
86,255 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

20 ఏళ్ల తరువాత మళ్లీ నెల్లూరుకు చెందిన
అనిల్ కుమార్‌ యాదవ్‌కు ..
నరసరావు పేట లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం అవకాశం కల్పించింది.

👉బీసీ ఓటు బ్యాంక్‌..
వైఎస్ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకును
దృష్టిలో పెట్టుకునే
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం
అనిల్ ను నరసరావు పేట నుంచి రంగంలోకి
దించిందని అనుకోవాలి.

2019లో కూడా నరసారావు పేట లోక్ సభ
స్థానాన్ని వైఎస్ఆర్‌ సీపీనే గెల్చుకుంది.

వైఎస్ఆర్‌ సీపీ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి రాయపాటి సాంబశివ రావుపై
1,53,978 ఓట్లతో గెలిచారు.

కానీ
మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో
నరసారావుపేట లోక్ సభ స్థానం బీసీలకు
ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం భావించింది.
అందులో భాగంగానే
బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన
అనిల్‌ను బరిలోకి దించింది.

శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు లోక్ సభ స్థానానికి
మారితే బాగుండేది.
ఆయన కూడా
వైఎస్ఆర్ సీపీ తరపున ఈజీగా గెలిచేవారు.

కానీ తొందరపాటుతో
వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారని పలువురు భావిస్తున్నారు .
టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా
పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదు.

నరసారావుపేట లోక్ సభ స్థానంలో
బలమైన రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంక్‌
బీసీల ఓటు బ్యాంక్ వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్ధి
అనిల్‌కు అండగా ఉంటుంది
అనడంలో సందేహం లేదు.

వైఎస్ఆర్ సీపీ స్థాపించాక
అప్పటి నుంచి నరసరావు పేట ఎంపీ స్థానం
ఆ పార్టీకి కంచుకోటగా ఉంది.

గతంలో యాదవ సామాజిక వర్గ ఓట్లు
టీడీపీకి పడేవి.
ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రంగ ప్రవేశంతో
యాదవుల ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడతాయని
అనడంలో సందేహం లేదని వైకాపా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి .

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో
పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట..
సత్తెనపల్లి, వినుకొండ, గురజాల,
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
మొదటి నుంచి నరసరావు పేట లోక్ సభ
నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గ..
ఫైట్‌గా ఉండేది.
ఇప్పుడు బీసీ మరియు రెడ్డి వర్సెస్‌ కమ్మ సామాజికవర్గ ఫైట్‌కు
నరసరావుపేట లోక్ సభ స్థానం వేదిక కానుంది.
సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో
ఎక్కువ లబ్ధి పొందింది బీసీ వర్గాల వారే.
గతంలో బీసీల ఓట్లు టీడీపీకి పడేవని
ఈ ఎన్నికల్లో బీసీల మెజార్టీ ఓట్లు
వైఎస్ఆర్‌ సీపీ వైపు వచ్చే అవకాశముంది.
నరసరావుపేట లోక్ సభ స్థానంలో
అనిల్ కుమార్ యాదవ్
మంచి మెజార్టీతో గెలుస్తారనడంలో
ఏమాత్రం సందేహం లేదని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త