నరసారావుపేట లోక్ సభ స్థానం వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్..!

నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్‌ యాదవ్‌ను
వైఎస్‌ఆర్‌ సీపీ అధిష్టానం
నరసరావుపేట లోక్ సభ స్థానానికి ఎందుకు పంపింది..?!

చాలా మంది మెదళ్లను..
తొలుస్తున్న ప్రశ్న ఇది.

సీఎం వైఎస్‌ జగన్‌కు
అనిల్ కుమార్‌ యాదవ్ అత్యంత విశ్వాసపాత్రుడు

అనిల్ కుమార్‌ యాదవ్‌కు
స్టేట్‌ వైడ్ ఫేమ్ ఉంది
మంచి స్పీకర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

చంద్రబాబు మీద, పవన్‌ మీద..
లోకేష్‌పై దూకుడుగా విమర్శలు చేయడం..
చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్పడం
అనిల్ కుమార్‌ యాదవ్‌ అలవాటు.

సీఎం జగన్ మొదటి కేబినెట్‌లో
నీటి పారుదల శాఖ మంత్రిగా అనిల్ పని చేసి
తానేంటో నిరూపించుకున్నారు,
మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలో..
పలు నియోజకవర్గాల్లో పాల్గొన్న అనిల్ యాదవ్..
తన ప్రసంగాలతో ప్రతిపక్షంపై
పిడుగుల్లాంటి విమర్శలు చేశారు.

నెల్లూరు జిల్లాకు నరసరావు పేట
నియోజకవర్గానికి మంచి సంబంధం ఉంది

1999లో నెల్లూరు జిల్లాకు చెందిన
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
నరసరావు పేట ఎంపీగా పోటీ చేసి
టీడీపీ అభ్యర్ధి లాల్ జాన్ భాషపై
13,882 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2004లో నెల్లూరు జిల్లాకు చెందిన
మేకపాటి రాజమోహన్ రెడ్డి ..
నరసారావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి మద్ది లక్ష్మయ్యపై
86,255 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

20 ఏళ్ల తరువాత మళ్లీ నెల్లూరుకు చెందిన
అనిల్ కుమార్‌ యాదవ్‌కు ..
నరసరావు పేట లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం అవకాశం కల్పించింది.

👉బీసీ ఓటు బ్యాంక్‌..
వైఎస్ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకును
దృష్టిలో పెట్టుకునే
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం
అనిల్ ను నరసరావు పేట నుంచి రంగంలోకి
దించిందని అనుకోవాలి.

2019లో కూడా నరసారావు పేట లోక్ సభ
స్థానాన్ని వైఎస్ఆర్‌ సీపీనే గెల్చుకుంది.

వైఎస్ఆర్‌ సీపీ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి రాయపాటి సాంబశివ రావుపై
1,53,978 ఓట్లతో గెలిచారు.

కానీ
మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో
నరసారావుపేట లోక్ సభ స్థానం బీసీలకు
ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం భావించింది.
అందులో భాగంగానే
బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన
అనిల్‌ను బరిలోకి దించింది.

శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు లోక్ సభ స్థానానికి
మారితే బాగుండేది.
ఆయన కూడా
వైఎస్ఆర్ సీపీ తరపున ఈజీగా గెలిచేవారు.

కానీ తొందరపాటుతో
వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారని పలువురు భావిస్తున్నారు .
టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా
పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదు.

నరసారావుపేట లోక్ సభ స్థానంలో
బలమైన రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంక్‌
బీసీల ఓటు బ్యాంక్ వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్ధి
అనిల్‌కు అండగా ఉంటుంది
అనడంలో సందేహం లేదు.

వైఎస్ఆర్ సీపీ స్థాపించాక
అప్పటి నుంచి నరసరావు పేట ఎంపీ స్థానం
ఆ పార్టీకి కంచుకోటగా ఉంది.

గతంలో యాదవ సామాజిక వర్గ ఓట్లు
టీడీపీకి పడేవి.
ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రంగ ప్రవేశంతో
యాదవుల ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడతాయని
అనడంలో సందేహం లేదని వైకాపా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి .

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో
పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట..
సత్తెనపల్లి, వినుకొండ, గురజాల,
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
మొదటి నుంచి నరసరావు పేట లోక్ సభ
నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గ..
ఫైట్‌గా ఉండేది.
ఇప్పుడు బీసీ మరియు రెడ్డి వర్సెస్‌ కమ్మ సామాజికవర్గ ఫైట్‌కు
నరసరావుపేట లోక్ సభ స్థానం వేదిక కానుంది.
సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో
ఎక్కువ లబ్ధి పొందింది బీసీ వర్గాల వారే.
గతంలో బీసీల ఓట్లు టీడీపీకి పడేవని
ఈ ఎన్నికల్లో బీసీల మెజార్టీ ఓట్లు
వైఎస్ఆర్‌ సీపీ వైపు వచ్చే అవకాశముంది.
నరసరావుపేట లోక్ సభ స్థానంలో
అనిల్ కుమార్ యాదవ్
మంచి మెజార్టీతో గెలుస్తారనడంలో
ఏమాత్రం సందేహం లేదని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…