రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం!

  1. రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం

అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది.
కలిసి రావడం మొదలవ్వాలి కానీ… రావడం మొదలుపెడితే రియల్ ఎస్టేట్ ఇచ్చినంతగా మరో వ్యాపారం ఇవ్వదని అంటుంటారు ఆ రంగంలో ఎదిగినవారు! “బిజినెస్ మేన్” సినిమాలో మహేష్ బాబు ముంబై గురించి చెప్పినట్లు.. ఇవ్వడం మొదలుపెడితే ఇస్తూనే ఉంటుంది! ఈ క్రమంలో ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌ గా పేరొందిన ఓ మహిళ ఏకంగా ఒక బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. దీంతో ఆ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. అప్పులు తీసుకోవడం తిరిగి వాటిని చెల్లించకపోవడం ఈమె నిత్యకృత్యాల్లో ఒకటి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆమె సంపద విలువ 2022 నాటికి దేశ జీడీపీలో 3 శాతం ఉంటుందని అంచనా!! వివరాళ్లోకి వెళ్తే… వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ కంపెనీ “వాన్‌ తిన్హ్‌ పాట్‌” ఛైర్‌ పర్సన్‌ గా ఒక మహిళ మాగ్నెట్ ట్రూంగ్ మై లాన్‌ ఉన్నారు! ఈమెకు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎస్.సీ.బీ.)లో సుమారు 90 శాతం వాటా ఉంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఆమె ఈ బ్యాంకులోనే మోసాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఫేక్ లోన్‌ అప్లికేషన్లు పెట్టి కోట్ల మేర డబ్బులు తీసుకున్నారు. తీరా లోన్ తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ఆలోచనకు చెల్లుచీటీ ఇచ్చేశారు! దీంతో… ఏకంగా ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి. దీంతో అందులో డబ్బులు దాచుకున్న దాదాపు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. ఫలితంగా ఆమెతో పాటు ఆ బ్యాంక్ లో ఖాతాదారులైన సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. వాస్తవానికి 2018 నుంచే ఆమె ఈ దందా మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… 2018 నుంచి 2022 మధ్య మై లాన్‌.. ఇలా సుమారు 916 ఫేక్ లోన్ అప్లికేషన్లు తయారు చేసి బ్యాంకులో సమర్పించిందని, ఫలితంగా బ్యాంకు నుంచి వియత్నాం కరెన్సీలో 304 ట్రిలియన్‌ డాంగ్‌.. అంటే 12.5 బిలియన్ డాలర్లు.. ఇక మన రూపాయిల్లో చూసుకుంటే ఏకంగా లక్షకోట్లు దాటి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 2019 నుంచి 2022 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సుమారు 4.4 బిలియన్‌ డాలర్ల (రూ.36.5 కోట్లు) నగదును ఆమె ఇంటికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అదే ఏడాది అక్టోబరు నెలలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి సదరు బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము దాచుకున్న డబ్బులను విత్‌ డ్రా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి వారి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే… అసలు సొమ్ము సంగతి అటుంచితే కనీసం దాచుకున్న సొమ్ముపై వడ్డీ అయినా ఇవ్వండి అంటూ విన్నవించుకుంటున్నారు.. అదికూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌ తో పాటు 85 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…