నన్ను చంపేస్తామంటున్నారు.. సునీత ఫిర్యాదు!


తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. సీబీఐ విచారణ కావాలని.. ఏపీ పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని కూడా అరెస్టు చేసి విడుదల చేశామని సీబీఐ తెలిపింది. ప్రస్తుతం అవినాష్‌ బెయిల్‌ పై ఉన్నారు. ఇటీవల తన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఇడుపులపాయలో సునీత కలవడం, ఆమెతో పాటు ఇడుపులపాయకు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత తాజాగా ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఫేస్‌ బుక్‌ లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సైబర్‌ క్రై మ్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఫేస్‌ బుక్‌ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన సోదరి వైఎస్‌ షర్మిలను ”లేపేస్తాం” అనే విధంగా బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది.. ” నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో నా పైన, నా సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి ఫేస్‌ బుక్‌ పేజీలో మొత్తం షర్మిల, నాపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయి. వర్రా రవీంద్ర రెడ్డి పరిధి దాటి పోస్టులు పెడుతున్నాడు. అతడు పెట్టే పోస్టులు మా ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి’ అని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ”జనవరి 29న నా సోదరి షర్మిలతో పాటు నేను ఇడుపులపాయ వెళ్లాను. అనంతరం వర్రా రవీంద్రా రెడ్డి తన పేజీలో నన్ను చంపేయాలి అని అర్థం వచ్చేట్టు ఒక పోస్ట్‌ పెట్టాడు. ”అందుకే పెద్దలు అన్నారు.. శత్రు శేషం ఉండకూడదు లేపేయ్‌ అన్నాయ్‌.. ఇద్దరినీ ఈ ఎన్నికలకు పనికి వస్తారు” అని ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ పెట్టాడని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన స్నేహితులు వర్రా రవీంద్రరెడ్డికి చెందిన ఫేస్‌ బుక్‌ లింక్‌ పంపారని తెలిపారు. అతడి ఫేస్‌బుక్‌ పోస్టులు తనను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నానన్నారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐకి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశానని సునీత గుర్తు చేశారు. ”రవీంద్రారెడ్డి ఫేస్‌ బుక్‌ పేజీలో మొత్తం నన్ను, షర్మిలను, వైఎస్‌ విజయమ్మను కించపరుస్తూ పోస్టులు ఉన్నాయి” చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్న రవీంద్రారెడ్డితోపాటు తదితరులపైన తగిన చర్యలు తీసుకోవాలని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా డాక్టర్‌ వైఎస్‌ సునీత సైబర్‌ క్రై మ్‌లో ఫిర్యాదు చేశారని సైబర్‌ క్రై మ్‌ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారన్నారు. ఈ మధ్యకాలంలో కొందరు ఫేస్‌ బుక్‌ లో చంపుతామని పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారని తెలిపారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..