ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని శ్రీశైలం రహదారి లో వాసవి లాడ్జ్ తెల్లవారు జామున 4 గంటలకు కుప్పకూలింది . పరుచూరి సుబ్బారావు కి చెందిన మూడంతస్తుల లాడ్జి కుప్పకూలింది.
దాని పక్కన అతని సోదరుడైన రామారావు అనే వ్యక్తి
బిల్డింగ్ నిర్మించడం కోసం10 రోజుల క్రితం దాదాపు 15 అడుగుల వరకు పునాది కొరకు మట్టి తీసి బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. లాడ్జి అద్దెకు తీసుకున్న వ్యక్తికి రెండు రోజుల నుంచి బిల్డింగ్ పై అనుమానం వచ్చి యజమానికి చెప్పి లాడ్జిని అద్దెకు జనాలకు ఇవ్వకుండా కాలిగా ఉంచి కావలి ఉంచాడు . అదృష్టవశాతు కావలి ఉండడంతో జనాలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు .