టీడీపీ జనసేన : సీట్ల విషయంలో క్లారిటీ వచ్చినట్లేనా…???

టీడీపీ జనసేన : సీట్ల విషయంలో క్లారిటీ వచ్చినట్లేనా…???

తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల పంచాయతీ ఆదివారం పూట శుభం కార్డు పడిందా లేక ఇంకా మరిన్ని భేటీలు వేయాలా ? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల పంచాయతీ ఆదివారం పూట శుభం కార్డు పడిందా లేక ఇంకా మరిన్ని భేటీలు వేయాలా అంటే మూడు గంటల పాటు జరిగిన చర్చలో అన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయని అంటున్నారు. రెండు పార్టీలూ ఆశిస్తున్న సీట్లు ఆశావహుల డిమాండ్లు వంటివి ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు అని అంటున్నారు. ఇక పొత్తు మూలంగా రెండు పార్టీలలోనూ ఆశావహులు పెద్ద సంఖ్యలో త్యాగరాజులు కావాల్సిందే అన్నది కూడా కీలక పాయింట్. వీరికి ఏదో విధంగా నచ్చచెప్పి రెండు పార్టీల విజయం కోసం కృషి చేయాలన్నది కూడా చర్చించారని అంటున్నారు. అదే విధంగా కూటమి విజయమే ముఖ్యమని ఎవరు ఎన్ని సీట్లు అన్నది కాకుండా వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలన్నది ప్రధాన లక్ష్యం కావాలని కూడా భావించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఆయన ఏపీలో కొత్త రాజకీయం రావాలని కొత్త ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జనసేన అండతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఏపీలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రెండు పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే అరకు, మండపేట సీట్లను టీడీపీ ప్రకటించింది, అలాగే జనసేన కూడా రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించింది. అలా ఇద్దరూ సమానంగానే ఉన్నారు. అయితే అసలు కధ ఇపుడే ఉంది. ఎన్ని సీట్లు జనసేనకు టీడీపీ ఇస్తుందని. దానికి కూడా బయట జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ 140 కి తగ్గకుండా పోటీ చేస్తూ ఆ మిగిలినవే ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇక జనసేన గత ఎన్నికల్లో ఆరు శాతం ఓటు షేర్ ని సాధించింది. టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా నలభై శాతం ఓట్ల షేర్ ని సాధించింది. ఈ రెండు పార్టీలు గత ఓట్ల షేర్ నిష్పత్తిలో సీట్ల పంపిణీ చేసుకంటే 6:1 అన్నట్లుగా ఉంటుంది. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా టీడీపీకి 145 సీట్ల దాకా వస్తాయని అంటున్నారు. జనసేనకు 30 సీట్లు దక్కుతాయని అంటున్నారు. అయితే జనసేన ఓటు షేర్ ఈ ఎన్నికల నాటికి పది శాతం నుంచి ఇంకా పెరిగింది కాబట్టి ఆ లెక్క తీసుకోవాలని మరో వాదన ఉంది. అదే టైం లో టీడీపీ ఓటు బ్యాంక్ కూడా 42 శాతం దాకా పెరిగింది అని అంటున్నారు. మరి ఈ లెక్క చూసుకుంటే 4:1 అన్నట్లుగా కొత్త నిష్పత్తి వస్తుంది. అలా చూసుకుంటే కనుక జనసేనకు 40 దాకా సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ 135 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఫైర్‌ ఇదే సరైనది అని ఇలా చేస్తేనె గ్రౌండ్ లెవెల్ లో ఓట్ల బదిలీ అన్నది సాధ్యపడుతుంది అని అంటున్నారు. అయితే పాతిక తో మొదలెట్టి ముప్పయి సీట్లు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా జనసేనకు ముప్పయి సీట్లు ఇవ్వడం అన్నది కూడా టీడీపీ పరంగా చూస్తే అది పెద్ద పొత్తు గానే చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు పవన్ సీట్ల పంపిణీ పొత్తుల విషయంలో పూర్తి అవగాహనతో ఉన్నారని అంటున్నారు. అందుకే సుదీర్ఘంగా మూడుగంటల పాటు ఈ రెండు పార్టీల అధినేతలు చర్చించారు. అని తెలుస్తోంది. దానికి సంబంధించే ముందుగా పార్టీ ఆశావహులకు నచ్చ చెప్పిన మీదటనే జాబితాను విడుదల చేస్తారు అని అంటున్నారు. అదే సమయంలో ఈ రెండు బలమైన పార్టీల వెనక ఉన్న రెండు బలమైన సామాజిక వర్గాల వారికి కూడా నచ్చ చెప్పుకోవాల్సి ఉంది. మొత్తానికి ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది అన్నది ప్రకటించడానికి మరో ముహూర్తం ఉందని అంటున్నారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…