పదునైన ఈడీ చక్రం బీజేపీ మీద దూసుకెళ్లదేం…???

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు .

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ మాటకు వస్తే సీబీఐ గురించి కూడా తెలియదు. జగన్ కేసుల పుణ్యమాని సీబీఐ ఈడీ అంటే ఏంటో అందరికీ తెలిసాయి. బహుశా అప్పటి నుంచే రాజకీయ ప్రత్యర్ధుల మీద ఈడీ సీబీఐ వాడకం కూడా బాగా పెరిగింది అని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రెండూ కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఎవరు కేంద్రంలో పాలిస్తూంటే వారి ప్రత్యర్ధుల పాపాలు పండినట్లే. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంటే గుజరాత్ లో హోం మంత్రిగా ఉన్న అమిత్ షా సీబీఐ ద్వారా అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. అదే అమిత్ షా కేంద్రంలో హోం మంత్రి కాగానే నాటి హోం మంత్రి చిదంబరం అచ్చంగా 105 రోజుల పాటు జైలులో మగ్గాల్సి వచ్చింది. ఇక ఈడీ చక్రం పదునుగా ఉంటుంది. అది దూసుకుని వస్తే ఇంతే సంగతులు. ఈడీ దాడులు అంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. ఈడీ సీఎంలను వదలడంలేదు. ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ బాధితుడిగా మారి అరెస్ట్ అయి తన సీఎం పదవిని కోల్పోయారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ పిలుపులు పదే పదే వస్తున్నాయి. ఈడీ కేవలం విపక్షాల మీదనే పనిచేస్తోందని, దాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపలా బయటా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికి పార్లమెంట్ లోనే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ జవాబు పవర్ ఫుల్ గా ఇచ్చేశారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదు అని ప్రధాని అన్నారు. గొట్టిపాటి బుజ్జి’ మెజార్టీ మీదే లెక్క‌లు..! అంతే కాదు, కాంగ్రెస్‌ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు అని ఆరోపించారు. దేశంలో అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్‌ చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చెశారు. ఇక మరో పోలిక కూడా చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ కేవలం 5 వేల కోట్ల రూపాయలే సీజ్‌ చేసిందని ఇక తమ హయాంలో లక్ష కోట్ల రూపాయల అక్రమ నగదు సీజ్‌ చేశామని ప్రధాని చెప్పుకున్నారు. అంతే కాదు విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. వాటిపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలా ఈడీ పనితీరు మీద మోడీ సభలో గొప్పగా చెప్పారు అని అంటున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగా అక్రమ నగదు లక్షల కోట్లలో ఈడీ సీజ్ చేయడం మంచి పరిణామమే. కానీ ఈడీ చక్రం ఎపుడూ విపక్షాల వైపే దూసుకుని వెళ్తోంది అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంది. బీజేపీ నేతలలో అంతా మంచివారే ఉండరు కదా. రాజకీయం అన్న తరువాత నూరు శాతం పునీతులు ఉండే చాన్స్ లేదు కదా అని అంటున్నారు. అలా చూసుకుంటే బీజేపీ నేతల మీద ఈడీ దాడులు ఎందుకు లేవు అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా మంది గతంలో ఒక పార్టీలో ఉన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడాక బీజేపీ పంచన చేరారు. వారి మీద ఈడీ కేసులే లేవు. మరి ఇదేమిటి అన్న ప్రశ్న వస్తోంది. ఇది సగటు జనాల సందేహాలు. మరి వీటిని కూడా బీజేపీ పెద్దలు తీర్చాలి కదా. ఏది ఏమైనా ఈడీ సీబీఐ వంటి సంస్థలకు స్వంత్రంత్ర ప్రతిపత్తిని కల్పిస్తేనే తప్ప పూర్తి న్యాయం జరగదు అన్న వాదనలు ఉన్నాయి.

 

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..