పదునైన ఈడీ చక్రం బీజేపీ మీద దూసుకెళ్లదేం…???

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు .

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ మాటకు వస్తే సీబీఐ గురించి కూడా తెలియదు. జగన్ కేసుల పుణ్యమాని సీబీఐ ఈడీ అంటే ఏంటో అందరికీ తెలిసాయి. బహుశా అప్పటి నుంచే రాజకీయ ప్రత్యర్ధుల మీద ఈడీ సీబీఐ వాడకం కూడా బాగా పెరిగింది అని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రెండూ కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఎవరు కేంద్రంలో పాలిస్తూంటే వారి ప్రత్యర్ధుల పాపాలు పండినట్లే. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంటే గుజరాత్ లో హోం మంత్రిగా ఉన్న అమిత్ షా సీబీఐ ద్వారా అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. అదే అమిత్ షా కేంద్రంలో హోం మంత్రి కాగానే నాటి హోం మంత్రి చిదంబరం అచ్చంగా 105 రోజుల పాటు జైలులో మగ్గాల్సి వచ్చింది. ఇక ఈడీ చక్రం పదునుగా ఉంటుంది. అది దూసుకుని వస్తే ఇంతే సంగతులు. ఈడీ దాడులు అంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. ఈడీ సీఎంలను వదలడంలేదు. ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ బాధితుడిగా మారి అరెస్ట్ అయి తన సీఎం పదవిని కోల్పోయారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ పిలుపులు పదే పదే వస్తున్నాయి. ఈడీ కేవలం విపక్షాల మీదనే పనిచేస్తోందని, దాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపలా బయటా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికి పార్లమెంట్ లోనే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ జవాబు పవర్ ఫుల్ గా ఇచ్చేశారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదు అని ప్రధాని అన్నారు. గొట్టిపాటి బుజ్జి’ మెజార్టీ మీదే లెక్క‌లు..! అంతే కాదు, కాంగ్రెస్‌ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు అని ఆరోపించారు. దేశంలో అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్‌ చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చెశారు. ఇక మరో పోలిక కూడా చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ కేవలం 5 వేల కోట్ల రూపాయలే సీజ్‌ చేసిందని ఇక తమ హయాంలో లక్ష కోట్ల రూపాయల అక్రమ నగదు సీజ్‌ చేశామని ప్రధాని చెప్పుకున్నారు. అంతే కాదు విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. వాటిపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలా ఈడీ పనితీరు మీద మోడీ సభలో గొప్పగా చెప్పారు అని అంటున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగా అక్రమ నగదు లక్షల కోట్లలో ఈడీ సీజ్ చేయడం మంచి పరిణామమే. కానీ ఈడీ చక్రం ఎపుడూ విపక్షాల వైపే దూసుకుని వెళ్తోంది అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంది. బీజేపీ నేతలలో అంతా మంచివారే ఉండరు కదా. రాజకీయం అన్న తరువాత నూరు శాతం పునీతులు ఉండే చాన్స్ లేదు కదా అని అంటున్నారు. అలా చూసుకుంటే బీజేపీ నేతల మీద ఈడీ దాడులు ఎందుకు లేవు అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా మంది గతంలో ఒక పార్టీలో ఉన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడాక బీజేపీ పంచన చేరారు. వారి మీద ఈడీ కేసులే లేవు. మరి ఇదేమిటి అన్న ప్రశ్న వస్తోంది. ఇది సగటు జనాల సందేహాలు. మరి వీటిని కూడా బీజేపీ పెద్దలు తీర్చాలి కదా. ఏది ఏమైనా ఈడీ సీబీఐ వంటి సంస్థలకు స్వంత్రంత్ర ప్రతిపత్తిని కల్పిస్తేనే తప్ప పూర్తి న్యాయం జరగదు అన్న వాదనలు ఉన్నాయి.

 

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…