రాహుల్ గాంధీ ఇంక పాదయాత్రతో లాభం లేదు…!!!

కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అయితే ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ ఆయన పాదయాత్ర చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా అన్న చర్చ వస్తోంది. నిజానికి పాదయాత్రలైనా మరేమైనా ఎన్నికలకు మూడు నెలల ముందు పూర్తి చేసుకోవాలి.

ఆ మీదట ఎన్నికల వ్యూహాలు రచిస్తూ వార్ రూం లో ఫుల్ బిజీగా ఉండాలి. కానీ రాహుల్ 2022 సెప్టెంబర్ 7 నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టారు. అది నాలుగు వేల కిలోమీటర్ల ద్వారా సాగింది. బాగా రెస్పాన్స్ వచింది. దాని వల్ల కర్నాటక తెలంగాణాలో పార్టీ గెలిచింది. అయితే రాజస్థాన్ లో అధికారం పోయింది మధ్యప్రదేశ్ దక్కించుకోలేకపోయింది. అయితే ఆ తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ ఈ ఏడాది జనవరి రెండవ వారం నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రెండవ విడత యాత్ర చేపట్టారు. ఈ యాత్ర మార్చి నెలాఖరుకు పూర్తి అవుతుంది. అయితే అప్పటికే ఎన్నికలు ఏకంగా ముంచుకునే వస్తాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ యాత్ర చేసినా ప్రయోజనం ఏమి ఉంటుందని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు అలవాటు పడ్డారని అంటున్నారు. కానీ ఇది ఈ టైం లో రాంగ్ డెసిషన్ అని అంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి అగ్ర నేతలు రాష్ట్రాల వారీగా కీలక ప్రాంతాలను చూసి భారీ బహిరంగ సభలు పెట్టుకోవాలి. అదే విధంగా ఎక్కడికక్కడ యువతతో భేటీ కావడం వారిని పార్టీ వైపుగా ఆకర్షించడం చేయాల్సి ఉంది అంటున్నారు. ఇపుడు వ్యూహాలు అవసరం అని అంటున్నారు. పాదయాత్రలకు ఇది అసలు టైం కానే కాదు అని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవాలి. ఎవరేమిటి అన్నది అంచనాలకు రావాలి. తమ బలాలు ఏమిటి ఎదుటి వారి బలహీనతలు ఏమిటి అన్నది కూడా మధింపు చేసుకోవాలి. సరైన ప్రణాళిక ప్రకారం సాగాలి. ఇండియా కూటమి చూస్తే రోజు రోజుకీ చిక్కిపోతోంది. రాహుల్ పాదయాత్రలో ఉంటే మరో వైపు నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆప్ సొంతంగా ఎంపీలను ప్రకటించేస్తోంది. మమతా బెనర్జీ గుర్రు మీద ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిని పటిష్టం చేసుకుంటూ ఎన్డీయే కూటమితో ఢీ కొట్టాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం అలా తనకు అలవాటు అయిన పాదయాత్రను చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలకు అసలు టైం లేదు. కచ్చితంగా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ టైం లో దేశంలోని 543 ఎంపీ సీట్లలో పరిస్థితి ఏమిటి అన్నది కూడా అంచనా వేసుకోవాలి. ప్రతీ ఎంపీ నియోజకవర్గంలో ఏ కులం బలం ఎంత అలాగే రాష్ట్రాల వారీగా అంశాలు తీసుకోవాలి. అక్కడ ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు కూడా బేరీజు వేసుకోవాలి. ఒక విధంగా చూస్తే ప్రతీ రోజూ యుద్ధమే చేయాలి. కానీ ఈ కీలకమైన టైం లో రాహుల్ గాంధీ మాత్రం కాళ్ళకు పని చెబుతున్నారు. పాదయాత్ర ఏమి లాభం చేకూరుస్తుందో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. రాజకీయాలలో ఎపుడూ వ్యూహాలే గెలిపిస్తాయి. దానికి తోడు ప్రజాభిమానం ఉండాలి. కానీ కేవలం యాత్రలు చేసినంత మాత్రాన గెలుపు సాధ్యం అవుతుంది అనుకుంటే మాత్రం అది ఇబ్బంది అవుతుందని అంటున్నారు. మరి మార్చి దాకా పాదయాత్రే అంటూ ముందుకు పోతున్న రాహుల్ గాంధీకు ఎవరు చెబుతారో తెలియదు కానీ ఆయన పాదాలు ముందుకు కదులుతూంటే కాంగ్రెస్ కి సరైన దిశా నిర్దేశం లేక వెనకబడిపోతోంది. 2024 ఎన్నికల యుద్ధంలో బీజేపీ ముందుకు పోతోంది. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాజకీయ ముఖ చిత్రం. మరి కాంగ్రెస్ కానీ రాహుల్ కానీ తమ యాక్షన్ ప్లాన్ మార్చుకుని ఎన్నికలకు రెడీ అవుతారా అంటే చూడాల్సిందే???

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..