రాహుల్ గాంధీ ఇంక పాదయాత్రతో లాభం లేదు…!!!

కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అయితే ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ ఆయన పాదయాత్ర చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా అన్న చర్చ వస్తోంది. నిజానికి పాదయాత్రలైనా మరేమైనా ఎన్నికలకు మూడు నెలల ముందు పూర్తి చేసుకోవాలి.

ఆ మీదట ఎన్నికల వ్యూహాలు రచిస్తూ వార్ రూం లో ఫుల్ బిజీగా ఉండాలి. కానీ రాహుల్ 2022 సెప్టెంబర్ 7 నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టారు. అది నాలుగు వేల కిలోమీటర్ల ద్వారా సాగింది. బాగా రెస్పాన్స్ వచింది. దాని వల్ల కర్నాటక తెలంగాణాలో పార్టీ గెలిచింది. అయితే రాజస్థాన్ లో అధికారం పోయింది మధ్యప్రదేశ్ దక్కించుకోలేకపోయింది. అయితే ఆ తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ ఈ ఏడాది జనవరి రెండవ వారం నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రెండవ విడత యాత్ర చేపట్టారు. ఈ యాత్ర మార్చి నెలాఖరుకు పూర్తి అవుతుంది. అయితే అప్పటికే ఎన్నికలు ఏకంగా ముంచుకునే వస్తాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ యాత్ర చేసినా ప్రయోజనం ఏమి ఉంటుందని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు అలవాటు పడ్డారని అంటున్నారు. కానీ ఇది ఈ టైం లో రాంగ్ డెసిషన్ అని అంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి అగ్ర నేతలు రాష్ట్రాల వారీగా కీలక ప్రాంతాలను చూసి భారీ బహిరంగ సభలు పెట్టుకోవాలి. అదే విధంగా ఎక్కడికక్కడ యువతతో భేటీ కావడం వారిని పార్టీ వైపుగా ఆకర్షించడం చేయాల్సి ఉంది అంటున్నారు. ఇపుడు వ్యూహాలు అవసరం అని అంటున్నారు. పాదయాత్రలకు ఇది అసలు టైం కానే కాదు అని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవాలి. ఎవరేమిటి అన్నది అంచనాలకు రావాలి. తమ బలాలు ఏమిటి ఎదుటి వారి బలహీనతలు ఏమిటి అన్నది కూడా మధింపు చేసుకోవాలి. సరైన ప్రణాళిక ప్రకారం సాగాలి. ఇండియా కూటమి చూస్తే రోజు రోజుకీ చిక్కిపోతోంది. రాహుల్ పాదయాత్రలో ఉంటే మరో వైపు నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆప్ సొంతంగా ఎంపీలను ప్రకటించేస్తోంది. మమతా బెనర్జీ గుర్రు మీద ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిని పటిష్టం చేసుకుంటూ ఎన్డీయే కూటమితో ఢీ కొట్టాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం అలా తనకు అలవాటు అయిన పాదయాత్రను చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలకు అసలు టైం లేదు. కచ్చితంగా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ టైం లో దేశంలోని 543 ఎంపీ సీట్లలో పరిస్థితి ఏమిటి అన్నది కూడా అంచనా వేసుకోవాలి. ప్రతీ ఎంపీ నియోజకవర్గంలో ఏ కులం బలం ఎంత అలాగే రాష్ట్రాల వారీగా అంశాలు తీసుకోవాలి. అక్కడ ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు కూడా బేరీజు వేసుకోవాలి. ఒక విధంగా చూస్తే ప్రతీ రోజూ యుద్ధమే చేయాలి. కానీ ఈ కీలకమైన టైం లో రాహుల్ గాంధీ మాత్రం కాళ్ళకు పని చెబుతున్నారు. పాదయాత్ర ఏమి లాభం చేకూరుస్తుందో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. రాజకీయాలలో ఎపుడూ వ్యూహాలే గెలిపిస్తాయి. దానికి తోడు ప్రజాభిమానం ఉండాలి. కానీ కేవలం యాత్రలు చేసినంత మాత్రాన గెలుపు సాధ్యం అవుతుంది అనుకుంటే మాత్రం అది ఇబ్బంది అవుతుందని అంటున్నారు. మరి మార్చి దాకా పాదయాత్రే అంటూ ముందుకు పోతున్న రాహుల్ గాంధీకు ఎవరు చెబుతారో తెలియదు కానీ ఆయన పాదాలు ముందుకు కదులుతూంటే కాంగ్రెస్ కి సరైన దిశా నిర్దేశం లేక వెనకబడిపోతోంది. 2024 ఎన్నికల యుద్ధంలో బీజేపీ ముందుకు పోతోంది. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాజకీయ ముఖ చిత్రం. మరి కాంగ్రెస్ కానీ రాహుల్ కానీ తమ యాక్షన్ ప్లాన్ మార్చుకుని ఎన్నికలకు రెడీ అవుతారా అంటే చూడాల్సిందే???

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి