వాళ్లకు పట్టిన గతే నీకు కూడా..రోజాపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!!!

 

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు చేసేవారిలో పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు.ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు చేసేవారిలో పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు. ఇప్పటివరకు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న రోజా ఇప్పుడు షర్మిలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజాకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో రోజాకు కూడా పడుతుందని షర్మిల హెచ్చరించారు.

నగరి నియోజకవర్గంలో రోజా దోపిడీని కూడా జబర్దస్త్‌ గా చేస్తున్నారని షర్మిల విమర్శించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని ఆరోపించారు. గ్రావెల్, మట్టి, ఇసుక, ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. హౌసింగ్‌ స్కీంలో రూ.కోట్ల స్కామ్‌ చేశారని ధ్వజమెత్తారు. వెంచర్లు వేయాలంటే రియల్టర్లు రోజాకు కప్పం చెల్లించాల్సిందేనని షర్మిల ఆరోపించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు అందుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే రోజాకు కూడా పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. నోరుంది కదా అని పారేసుకోవద్దని హెచ్చరించారు. గతంలో రోజాను ‘ఐరన్‌ లెగ్‌’ అని పిలిచేవారని ఎద్దేవా చేశారు. అప్పట్లో రోజా తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఎంతలా దూషించారో ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. నగరి నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తే రోజా, ఆమె అన్న, భర్తలకు ప్లాట్లయినా ఇవ్వాలి, లేదంటే కప్పమైనా కట్టాలని షర్మిల ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు, ఉద్యోగాల్లోనూ ఆమె కమీషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రోజాతో చెప్పించుకునే స్థితిలో తాను లేనన్నారు. మరమగ్గాలకు విద్యుత్తు ఛార్జీలు తగ్గించమని కార్మికులు గగ్గోలు పెడుతున్నా రోజా చెవికెక్కదా అంటూ నిలదీశారు. కిందటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగనన్న తప్పారని షర్మిల ఆరోపించారు. ఆ తప్పులు ఎత్తి చూపుతున్నానని, చెల్లెలన్న ఇంగితం లేకుండా రోజాలాంటి వారి చేత తనను తిట్టిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడ బిడ్డనైన తనను, తన కుటుంబాన్ని, తన వాళ్లను సామాజిక మాధ్యమాల్లో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లు, అమ్మలు లేరా అని వైసీపీ నేతలను నిలదీశారు. ఇలాంటి నియంతలు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదన్నారు. ఈ నేపథ్యంలో రోజాపై షర్మిల వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త