కారు,ఆటో ఢీ. ముగ్గురు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల.. ఏజీపీగా సంగీతరావు.. కోనసీమ జిల్లాలో చర్చికి నిప్పు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురుదురుగా వస్తున్న కారు ఆటో ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా , ఇద్దరు ఆటోలో సజీవ దహనం అయ్యారు.కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా వీరిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు .మృతులు బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు,చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు.ఈఘటనపై ఎస్త్సె నరసింహరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర రావు కంభం సీఐ కే రామకోటయ్య సంఘటన స్థలానికి విచారణ చేపట్టారు  .

*బాధిత కుటుంబాలను పరామర్శించిన వైసీపీ ఇన్చార్జ్*..రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*బాధిత కుటుంబాలను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల..ఈ సంఘటన గురించి తెలుసుకున్న  గిద్దలూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ఏ.జీ.పీగా  దాసరి సంగీతరావు ..   

గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోనూతన అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది (ఏ. జి.పి ) గా ప్రముఖ సీనియర్ న్యాయవాది దాసరి సంగీతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మండలం ఆదిముర్తిపల్లే పంచాయతి జమ్ముల్లపల్లే గ్రామానికి చెందిన సంగీతరావు సంజీవరాయునిపేటలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. గిద్దలూరులోని ఎస్. వి డిగ్రీ, పి. జి కళాశాలలో బి. ఏ, ఎం. ఏ అభ్యసించారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర విద్య ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం పూర్తి చేసి పట్టా అందుకున్నారు. 21 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఏజీపీగా వ్యవహరించిన వల్లెల వెంకటరామిరెడ్డి నుండి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కోర్టులోని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన సీ.ఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు లు సజ్జల రామకృష్ణారెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

👉 చర్చి కి నిప్పు .. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  దళితసంఘాలు..

డా.బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దుపర్రు గ్రామంలో కాలువ రేవు ప్రక్కన గత 12 సంవత్సరాలుగా పాస్టర్ రెవరెండ్ దాసరి మోజేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బైబిల్ మిషన్ భేతెస్తే స్వస్థత శాలపై కొంతమంది దుండగులు ఆదివారం అర్ధరాత్రి తెల్లవారితే సోమవారం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మందిరములోనికి ప్రవేశించి, విలువైన వస్తు సామాగ్రిని ధ్వంసం చేసి సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలు విలువగల ఎలక్ట్రానిక్స్ పరికరాలను ధ్వంసం చేసి మందిరంలోపల పాత ఎక్సెల్ బండిని ఉంచి నిప్పంటించడం జరిగింది.దీంతోమందిరం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమై బూడిద పాలయింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్రేయపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులందరూ అక్కడకు చేరుకుని ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని, ఈ దాడిలో నష్టపోయిన పాస్టర్ మోజేష్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని నినాదాలు చేస్తూ, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పత్రాన్ని అందజేశారు.విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలన్నీ అక్కడకు చేరుకుని పాస్టర్లకు మద్దతు తెలియజేశారు.ఈవిషయంలో ఎవరి పాత్ర ఉన్నా ఎంతటి వారైనా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనియెడల పాస్టర్ కి న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…