కారు,ఆటో ఢీ. ముగ్గురు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల.. ఏజీపీగా సంగీతరావు.. కోనసీమ జిల్లాలో చర్చికి నిప్పు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురుదురుగా వస్తున్న కారు ఆటో ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా , ఇద్దరు ఆటోలో సజీవ దహనం అయ్యారు.కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా వీరిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు .మృతులు బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు,చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు.ఈఘటనపై ఎస్త్సె నరసింహరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర రావు కంభం సీఐ కే రామకోటయ్య సంఘటన స్థలానికి విచారణ చేపట్టారు  .

*బాధిత కుటుంబాలను పరామర్శించిన వైసీపీ ఇన్చార్జ్*..రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*బాధిత కుటుంబాలను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల..ఈ సంఘటన గురించి తెలుసుకున్న  గిద్దలూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ఏ.జీ.పీగా  దాసరి సంగీతరావు ..   

గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోనూతన అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది (ఏ. జి.పి ) గా ప్రముఖ సీనియర్ న్యాయవాది దాసరి సంగీతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మండలం ఆదిముర్తిపల్లే పంచాయతి జమ్ముల్లపల్లే గ్రామానికి చెందిన సంగీతరావు సంజీవరాయునిపేటలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. గిద్దలూరులోని ఎస్. వి డిగ్రీ, పి. జి కళాశాలలో బి. ఏ, ఎం. ఏ అభ్యసించారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర విద్య ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం పూర్తి చేసి పట్టా అందుకున్నారు. 21 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఏజీపీగా వ్యవహరించిన వల్లెల వెంకటరామిరెడ్డి నుండి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కోర్టులోని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన సీ.ఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు లు సజ్జల రామకృష్ణారెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

👉 చర్చి కి నిప్పు .. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  దళితసంఘాలు..

డా.బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దుపర్రు గ్రామంలో కాలువ రేవు ప్రక్కన గత 12 సంవత్సరాలుగా పాస్టర్ రెవరెండ్ దాసరి మోజేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బైబిల్ మిషన్ భేతెస్తే స్వస్థత శాలపై కొంతమంది దుండగులు ఆదివారం అర్ధరాత్రి తెల్లవారితే సోమవారం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మందిరములోనికి ప్రవేశించి, విలువైన వస్తు సామాగ్రిని ధ్వంసం చేసి సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలు విలువగల ఎలక్ట్రానిక్స్ పరికరాలను ధ్వంసం చేసి మందిరంలోపల పాత ఎక్సెల్ బండిని ఉంచి నిప్పంటించడం జరిగింది.దీంతోమందిరం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమై బూడిద పాలయింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్రేయపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులందరూ అక్కడకు చేరుకుని ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని, ఈ దాడిలో నష్టపోయిన పాస్టర్ మోజేష్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని నినాదాలు చేస్తూ, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పత్రాన్ని అందజేశారు.విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలన్నీ అక్కడకు చేరుకుని పాస్టర్లకు మద్దతు తెలియజేశారు.ఈవిషయంలో ఎవరి పాత్ర ఉన్నా ఎంతటి వారైనా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనియెడల పాస్టర్ కి న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త