టీడీపీ – జనసెన..కూటమి ఓటమికి దారితీయదు కదా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్నగిద్దలూరు వైకాపా ఇంచార్జి నాగార్జున రెడ్డి.. వాలంటీర్లను సన్మానించిన ఎమ్మెల్యే అన్నా

టీడీపీ – జనసెన..కూటమి
పొత్తు పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది లీడర్లకు సైతం చాలా తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేతలు కొత్త పదవులు వస్తాయని ఆశిస్తే ఉన్న పదవులను కూడా ఉడగొట్టుకొని పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటి వరకు టిడిపి నేతలు చాలామంది పదవులు త్యాగాలు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులకు సైతం ఆదేశాలు జారీ చేశారు.. ఈ విషయం విన్న చాలా మంది నాయకులు సైతం ఎంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.బడా నేతలకు టికెట్లు పెట్టేలా చేస్తున్నారు ముఖ్యంగా టిడిపి జనసేన కూటమిలో సీట్ల పంచాయితీతో రెండు పార్టీలలోని చాలా టెన్షన్ మొదలయింది.
పొత్తులు ఎత్తులు ఏపీ టీడీపీ లీడర్లకు ఏమాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయం పైన ఒక అవగాహన వస్తే ఎవరు ఎక్కడెక్కడ ఉంటారనే విషయంపై క్లారిటీ వస్తుందంటూ పలువురు కార్యకర్తలు నాయకులు సైతం తెలుపుతున్నారు. చాలామంది సీనియర్ నేతలు సైతం కొన్ని సీట్ల పైన బాగా వేయాలని చూస్తున్నారు దీంతో జనసేన నేతలకు సైతం టెన్షన్కు గురయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీలలో సీట్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో వీరు బహిరంగ సభలో పెట్టినప్పటికీ ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో టీడీపీ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది.. ఇక జనసేన పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉన్నది.. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తర్వాత బయట కనిపించలేదు.టిడిపి జనసేన మధ్య పొత్తు వచ్చి ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్న నియోజకవర్గస్థాయిలో సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య సరైన అవగాహన రాలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏడు లిస్టులను నియోజకవర్గం విడుదల చేశారు.. అయితే అన్ని నియోజవర్గాలలో సీట్లను విడుదల చేసిన తర్వాతే టిడిపి జనసేన నియోజవర్గ పేర్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది.. ఎందుకంటే టిడిపి పార్టీలో సీటు ఇవ్వకపోతే వైసీపీ పార్టీలో చేరిన అక్కడ కూడా సీటు ఇవ్వాలని తమ పార్టీలోనే ఉంటారని చంద్రబాబు భావనగా అనిపిస్తోంది. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నియోజవర్గ స్థాయిలో సీట్ల విషయం పైన క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.

  • 👉వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు వైకాపా  ఇన్చార్జ్ కేపి.నాగార్జున రెడ్డి..

గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ సీపీ ఇన్చార్జ్ కేపి.నాగార్జున రెడ్డి బుధవారం బేస్తవారిపేట మండలం మోక్షగుండం వైయస్సార్ సీపీ నాయకులు కర్నాటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రసాద్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కార్యక్రమంలో బేస్తవారిపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండా రఘునాథ రెడ్డి,గిద్దలూరు వైయస్సార్ సీపీ నాయకులు మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి,సర్పంచ్ ఆవుల శ్రీధర్ రెడ్డి,
బారెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితర వైయస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

👉 వాలంటీర్లను, సేవా రత్న, సేవా వజ్ర, సేవా మిత్ర, అవార్డులతో సన్మానించిన ఎమ్మెల్యే అన్నా*

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేసిన ఘనత వాలంటీర్లదే అని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం మార్కాపురం లోని ఎస్సీ, బీసీ కాలనీ లో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన వాలంటీర్లకు సన్మానం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి అయితేనే సాధ్యమవుతుందన్నారు. వాలంటీర్ లు తమ తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న అందించిన ప్రభుత్వ పధకాలను ప్రజలకు వివరించి జగనన్న కు అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరాలని సూచించారు. వాలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాల సమస్యలు ఎల్లప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం మార్కాపురం మండల పరిధిలోని వాలంటీర్ లకు సేవావజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులకు ఎంపికైన వాలంటీర్ లను ఎమ్మెల్యే అన్నా శాలువాతో, బ్యాడ్జ్, ప్రశంసాపత్రాలతో ఎమ్మెల్యే అన్నా సన్మానించి అభినందనలు తెలిపారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…