శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు!!!ఆందోళనకారుల పోస్టులు తీసేశాం, అకౌంట్లు రద్దు చేశాం’ అని అంగీకరించిన ట్విటర్!!!.. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సిబిఐ సోదాలు!!!

👉 పంజాబ్ – హరియాణా మధ్యనున్న శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.

కేంద్ర ప్రభుత్వం తమ ముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు శంభు బోర్డర్ వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రైతు సంఘాల నేతలు చెప్పారు.రైతులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఐదు పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని ప్రతిపాదించారు. కానీ, దీని కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఐదేళ్ల ఒప్పందంపై రైతులు సంతకం పెట్టాల్సి ఉంటుంది.అయితే, చర్చల తర్వాత ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు. 23 పంటలకు కనీస మద్దతు ధరను తాము కోరుతున్నట్లు తెలిపారు.

👉 ‘ఆందోళనకారుల పోస్టులు తీసేశాం, అకౌంట్లు రద్దు చేశాం’ అని అంగీకరించిన ట్విటర్ 😱… ప్రభుత్వం ఏమంటోంది?

ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఎక్స్ (గతంలో ట్విటర్) భారత్‌లో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లు, పోస్టులను తొలగించినట్లు అంగీకరించింది.భారత ప్రభుత్వం కంపెనీకి ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’ (కార్యనిర్వాహక ఆదేశాలు) పంపిన తర్వాత ఆ పేజీలను తీసివేసినట్లు ఎక్స్ పేర్కొంది.జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉందని ఆ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు ఎక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఆ సంస్థ ఏకీభవించలేదు.తన అధికారిక అకౌంట్ లో ఎక్స్ తన వివరణ ఇచ్చింది.ఎక్స్ నుంచి తమ పోస్టులను తొలగించినట్లు పలువురు గతంలో ఫిర్యాదు చేశారు.

భారత్‌లో రైతుల నిరసనను కవర్ చేస్తున్న రిపోర్టర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రముఖ రైతు నాయకుల ఎక్స్ అకౌంట్లు సస్పెండ్ అయినట్లు ఎక్స్ యూజర్, జర్నలిస్ట్ అయిన మహ్మద్ జుబైర్ సోమవారం రాశారు.తన ఎక్స్ అకౌంట్‌తో పాటు న్యూస్ ప్లాట్‌ఫాం ‘గావ్ సవేరా’ను కూడా నిలిపివేసినట్లు జర్నలిస్ట్ మన్‌దీప్ పూనియా బీబీసీతో చెప్పారు.”మేం గ్రామీణ భారతాన్ని కవర్ చేసే ప్రొఫెషనల్ జర్నలిస్టులం. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాం. కానీ, ప్రభుత్వానికి అది అనవసరం. ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది. ఇది మా జీవనోపాధిని కూడా దెబ్బతీస్తుంది” అని ఆయన అన్నారు.ప్రభుత్వ ఆదేశానుసారం” భారత్‌లో అకౌంట్లు, పోస్టులు నిలిపివేస్తున్నట్లు ఎక్స్ తన వివరణలో పేర్కొంది.

👉జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించింది.మరో 29 చోట్ల కూడా సీబీఐ సోదాలు చేసింది.సత్యపాల్ మాలిక్ బంధువు అనుమాలిక్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ- ఈ సోదాలు నిజమేనని ధ్రువీకరించారు.‘అసలు విషయం ఏమిటనేది నాకు తెలియదు. ఏడుగురు సభ్యులున్న సీబీఐ బృందం ఇక్కడకు వచ్చింది. దాదాపు 3, 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు’’ అని ఆయన చెప్పారు.సీబీఐ అధికారులు ఇల్లంతా వెదకడంతోపాటు సత్యపాల్ మాలిక్ గదిని కూడా శోధించారు’’ అని అనుమాలిక్ చెప్పారు.ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అనేక విమర్శలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై ‘ఎక్స్’లో స్పందించారు.‘‘మాజీ గవర్నర్ నిజాలు చెబితే ఆయనింటికి సీబీఐను పంపిస్తారు. ప్రధాన ప్రతిపక్షం బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యమంటే’’ అని ఆయన ప్రశ్నించారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…