వైసిపి టిడిపి బిజెపి బానిసలు.. షర్మిల.. సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే అన్నా.. ఘనంగా అన్నా చైతన్య జన్మదిన వేడుకలు.. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..డిఆర్ఓ వంశీకృష్ణ

👉వైసీపీ ,టీడీపీలు బీజేపీకి బానిసలని,బిజెపి రామ భక్తులమని చెప్పుకుంటే సరిపోతుందా అని వై ఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వైసీపీ టీడీపి బిజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారన్నారు.ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అని,ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామని,కలిసి పోరాడే అంశంపై చర్చలు చేశామని,కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం అని,కలిసి కట్టుగా లేక పోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యం అన్నారు.అనంతపురం సభకు సిపిఐ ,సిపిఎం లను ఆహ్వానించామన్నారు.ఎన్నికల్లో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుందన్నారు.కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.హోదా విషయంలో జగన్,బాబు ఇద్దరు విఫలం అయ్యారని, కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు.మోడీ తిరుపతి లో మాట ఇచ్చి హోదా పై మాట మార్చారని రామభక్తులమని చెప్పుకుంటే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి*..   బీజేపీ మతతత్వ రాజకీయం బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తె రాజ్యాంగాన్ని మారుస్తారని ..దేశం అత్యంత ప్రమాదంలో ఉందన్నారు..ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బీజేపీ కి భయపడుతున్నారని జగన్,బాబు,పవన్ మోడీకి దాసోహం అంటున్నారు.తెలుగు ప్రజల ఆత్మ గౌరవం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఇతర ప్రజా తంత్ర పార్టీలను కూడా కూడ గడతామని..దేశంలో బీజేపీ మళ్ళీ అధికారం రాకూడదని జగన్ 5 ఏళ్లు పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు.ప్రజలను బిచ్చగాళ్ల ను చేశారు..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.ఈ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.

👉పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేయడం దారుణం..వి.శ్రీనివాసరావు( సిపిఎం రాష్ట్ర కార్యదర్శి)..

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేయడం దారుణం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు.బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని,బీజేపీ,వైసీపీ ,టీడీపీ మీదనే మా పోరాటం అన్నారు.ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని,రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు లేని బీజేపీ శాసిస్తుందని బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన బాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారన్నారు.బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు డిల్లీ చుట్టూ తిరగడం లేదని ఎద్దేవా చేశారు. ఇన్ని సార్లు తిరిగిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని,రాజధానికి నిధులు లేవని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహకారం తీసుకుంటామని,కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామని,ఈ దుష్ట కూటమిలను ఓడగొడతామని బీజేపీనీ,వారికి కాపు గాసేవారిని సాగనంపుతామన్నారు.

👉ముఖ్యమంత్రి జగనన్నను మర్యాదపూర్వకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్హులైన 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని గిద్దలూరు ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబుమర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

👉ఘనంగా ఎమ్మెల్యే అన్నా తనయుడు చైతన్య జన్మదిన వేడుకలు 

గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు అన్నా కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు శుక్రవారం మార్కాపురంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మార్కాపురం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, పలువురు నాయకుల తో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్ ను కృష్ణ చైతన్య కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పలువురు నాయకులు చైతన్యని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మార్కాపురం లోని కిట్స్ కళాశాలలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

👉 నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.డిప్యూటీ రేంజి అధికారి డీ.వంశీకృష్ణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ..

ప్రకాశం జిల్లా..గిద్దలూరు:నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమ రవాణా దారులను దిగువ మెట్ట అటవీశాఖ డిప్యూటీరేంజి అధికారి డీ.వంశీకృష్ణ హెచ్చరించారు.. డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూరు వారి ఆదేశాల మేరకు, గుండ్లకమ్మ అటవీ రేంజి అధికారి సూచనల మేరకు వాహనాలు తనిఖీ చేయుటలో భాగంగా అటవీశాఖలో మెటల్ డిటెక్టర్ ను ఉపయోగించి వాహనాలు తనిఖీ చేపట్టామని డిప్యూటీ రేంజి అధికారి డీ.వంశీకృష్ణ తెలిపారు.దిగువ మెట్ట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు..అటవీశాఖ సంబంధించిన ఎర్రచందనం, గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు..డబ్బులు తరలించే వారు తగిన రసీదులు పెట్టుకోవలన్నారు..అలా కాకుండా పెద్ద ఎత్తున నగదు తరలిస్తూ పట్టుబడితే ఆ నగదును సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త