గిద్దలూరులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేది నేనే..టీడీపి ఇంచార్జ్ ముత్తుముల.. గిద్దలూరు జనసేన టికెట్ “ఆమంచికే”.. ఫేక్ లెటర్ అని ఖండిస్తున్న టిడిపి నాయకులు..

  • తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని గిద్దలూరు టీడీపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశించిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేయాలని, మరో 50 రోజుల్లో ఎన్నికలు పూర్తి అవుతాయని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన, అవాకులు చవాకులు పేలిన టీడీపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానన్నారు. 👉మంగళవారం గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం జరగనుందని ఈ సమావేశానికి మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

👉వచ్చే నెల 2. 3 తేదీల్లో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గిద్దలూరు రానున్నారని నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులతో సమావేశం అవుతారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ తెలుగుదేశం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియచేయాలనీ టీడీపి జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను క్లుప్తంగా ప్రజలకు తెలియచేయాలని, వైసీపీ పాలనలో జరిగిన అరాచక పాలనను, దోపిడీని వివరించాలని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపి జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియచేశారు..ఈకార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ మరియు గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, కాపు నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య, టీడీపి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మైనార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, టీడీపి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గోన్నారు.

  • 👉

జనసేన అభ్యర్థుల లిస్టుతో తిక మక..ఫేక్ లెటర్  పెట్టి సంబరాలు చేసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు.. గత రెండు రోజులుగా  అభ్యర్థులుగా టిడిపి జనసేన లో కలిసి లిస్టు ప్రకటించినట్లు జనసేన విడుదల చేసిన ఒక లిస్టు పేర వచ్చిన ఒక పోస్టు ప్రస్తుతం టిడిపి నాయకులను తికమక కు గురిచేస్తుంది.  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కు కేటాయించిన విషయం విధితమే.అయితే ఈ లెటర్ లో ఒంగోలు జనసేన అభ్యర్థి రియాజ్ అని వుంది,గిద్దలూరు అభ్యర్థిని మొదటి లిస్టులో ప్రకటించలేదు.కాగా జనసేన లిస్టులో గిద్దలూరు అభ్యర్థిగా ఆమంచి స్వాములు పేరు ఉంది.ఇది జనసేన పార్టీ వారే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత ఐదేళ్లుగా టిడిపిని బలోపేతం చేసేందుకు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అహర్నిశలు కృషిచేశారు.ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ఎంతోమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారరంటే అశోక్ రెడ్డి ఎంతగా కృషి చేశారో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘంటాపదంగా చెప్తున్నారు. అలాంటిది ఎక్కడి నుండి ఈ నియోజకవర్గంలో అసలు సంబంధమే లేని వారికి టికెట్ ఇచ్చి  ఆయన గెలుపు కోసం పనిచేయమంటే ఎలా చేస్తామని బహిరంగంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి టిడిపి అధిష్టానం గిద్దలూరు టికెట్టు కేటాయింపు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడక తప్పదు.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు