లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ కు సన్మానం.. గిద్దలూరు వైకాపాలో చేరికలు..ముత్తుములకు సన్మానం.. తర్లుపాడులో రాజకీయ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం ..

  • సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ఉద్యోగుల సంఘం..

జర్మనీకి చెందిన ప్రపంచ సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ తన పరిశోధనలో భాగంగా దక్షిణ భారతదేశాన్ని సందర్శించారు. మనదేశంలో యుద్ధాలలో వాడే ఆయుధాల గురించి ఫిరంగుల గురించి, వారసత్వ సంపద, ఆయుధాలు ఫిరంగులలో తయారీలో వినియోగించిన లోహాల గురించి అద్వయనంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు పద్మాచారి ఆధ్వర్యంలో ఆయనకు గ్రీన్ ల్యాండ్ లోని టూరిజం ప్లాజా లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వృత్తి రీత్యా విశ్వబ్రాహ్మణుడు అయిన ఆయన ఇటీవల భారతదేశం నిర్వహించిన సూర్యయాన్ చంద్రయాన్ యాత్రలలో రాకెట్లలో వెళ్లి అక్కడి వాతావరణ పరిస్థితులను, అక్కడి ఉష్ణోగ్రతను తట్టుకునే లోహాలను గురించి అనేక పరిశోధనలు నిర్వహించారు. అనేక దేవి దేవత విగ్రహాలను తయారు చేయడంతో పాటు విగ్రహాల తయారీలో ఎటువంటి లోహాలను వినియోగించాలన్న అంశాలపై పరిశోధన సాగిస్తుంటారు.తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన లోహ శాస్త్రవేత్త ప్రముఖ చరిత్రకారుడైన డాక్టర్ జై కిషన్ ఆహ్వానం మేరకు రేరెన్ తెలంగాణ సందర్శించారు.లోహ పరిశోధనలో ఆయన వద్ద 35 మంది డాక్టరేట్ పట్టాలు పొందారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తీలో రైరన్ ముంబైలోని తన శిష్యురాలైన డాక్టర్ మేఘనను కూడా కలిసి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆర్థిక నేరాల విభాగం ఏసిపి కే కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిలోరెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తాను గతంలో పోలీసు డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వివిధ దేశాలలో పోలీసుల పనితీరు గురించి చేసిన సందర్భంగా జర్మనీలో సైతం పర్యటించానని ఆ దేశం గురించి మంచి అవగాహన ఉందని, ప్రజల జీవనశైలి కర్తవ దీక్షలో పోలీసులు అధికారుల తీరు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి బ్రహ్మశ్రీ వెంకటాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు వడ్రంగి కమ్మరి శిల్పి, లోహ కారులు, స్వర్ణకారులు తమ సంప్రదాయ వృత్తులలో కొనసాగుతూనే సమాజానికి ఉపయోగపడే వారి వారి కులవృత్తులలో అత్యంత ప్రతిభను కనబరుస్తూ విశ్వకర్మజాతికి తలమానికంగా నిలుస్తున్నారని ఆయనను ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బ్రహ్మశ్రీ ఎల్ ఎన్ చారి, దుబ్బాక కిషన్ చారి, డాక్టర్ రవీంద్ర చారి, శ్రీరామోజు ప్రదీప్ సురేందర్ డాక్టర్ సుధాకర్, దేవరకొండ నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

*అర్దవీడు మండలంలో పట్టపగలే రెండు గృహాల్లో చోరీ*  పట్టపగలే రెండు గృహాల్లో చోరీ జరిగిన సంఘటన అర్దవీడు మండలం మోహిద్దీన్ పురం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద కాశయ్య, చిన్న కుమారుడు రంజాన్ గృహాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దకాశయ్య దంపతులతో పాటు చిన్న కోడలు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లారు. పదింటి సమయంలో దొంగలు రెండు ఇళ్ల తలు పులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గ్రామం శివారు వరి మాగాణులకు సమీపంలో ఇళ్లు ఉండటంతో గమనించే వారు లేకపోయారు. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రెండు బీరువాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్టు సమాచారం. రెండు గృహాల్లో సుమారు 10 తులాల బంగారు రూ.50 వేల నగదు అపహరించినట్లు సమాచారం. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి రావడంతో తలుపులు తెరచి ఉండటం పై దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై అనిత తమ సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి వేలి ముద్రలు సేకరించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…_

* 👉ఆంధ్రా మిర్రర్ ప్రకాశం జిల్లా ..తర్లుపాడు.. వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యా యత్నం…వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి ఆరోపణ.. తర్లుపాడు మండలం కందల్లపల్లిలో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..పురుగుమందు తాగిన తెదేపా కార్యకర్త బ్రహ్మతేజ కుమార్.మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు .వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి వెల్లడి.తనకున్న చిన్నపాటి ఉద్యోగం తీసేయడంతో పాటు తన కుటుంబ సభ్యులను, కులాన్ని దూషించాడని బాధితుడి ఆవేదన.

👉 వైకాపాల్లో చేరికలు..ఆంధ్ర మిర్రర్ ప్రకాశం జిల్లా..

గిద్దలూరు .. మండలంలోని ముల్లపాడు పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు టిడిపి నుండి వైసీపీలో చేరడం జరిగింది.వీరందరికీ గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

👉టిడిపి ఇన్చార్జి ముత్తుములను సన్మానించిన కంభం టిడిపి నాయకులు

గిద్దలూరు టిడిపి టికెట్  గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి కేటాయించడంతో శుక్రవారం రాత్రి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అనీష్ అహ్మద్, తోట శ్రీనివాసులు, గౌస్ బాషా, జీలాని, అల్లాబకాష్ తది తరులు పాల్గొన్నారు.

 

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త