నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత???…బిజెపి మిత్ర పక్షాలను ఓడించాలి..సిపిఎం.. ప్రచారంలో ముత్తుముల కుటుంబం.. వివాహ వేడుకల్లో కుందూరు సోదరులు

👉నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..  ఎన్నికల్లో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై ఉన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే దీనికి కారణం.ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.అయితే జనసేనానిని ఓడించేందుకు వైఎస్సార్సీపీ సైతం ప్రయత్నాలు చేస్తోంది.దీంతో పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.పిఠాపురం గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నాయో.. అంతకు మించి బోలెడన్ని రెట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.తాజాగా సోషల్ మీడియాలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి.టీడీపీ నేత వర్మ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరతానేది ఒకటి కాగా.. వంగా గీత నామినేషన్ వెనక్కి తీసుకుంటారనేది రెండోది.పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు మంచి బలమున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఆయన ఓడారు. 2024లో టీడీపీ నుంచి వర్మనే పోటీ చేస్తారని భావించారంతా. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించడం,ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో వర్మ సైడ్ అయ్యారు. వర్మ అనుచరులు ఆందోళనలు జరిపినప్పటికీ.. చంద్రబాబు పిలిచి మాట్లాడటం,ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు.పవన్ కళ్యాణ్ తరఫున ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు.

👉గిద్దలూరు మండలం, ఉయ్యాలవాడ పంచాయతీలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి  ముత్తుముల అశోక్ రెడ్డి  సతీమణి  పుష్పలీల ఆదివారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

*బేస్తవారిపేట మండలం, JBK పురం, పిట్టకాయగుళ్ల పంచాయతీలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉కంభంలో ముత్తుముల సోదరుడు ఎన్నికల ప్రచారం

ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సోదరుడు ముత్తుముల జగన్నాద్ గారు పట్టణంలోని సాధుమియా స్ట్రీట్, చెన్న కృష్ణమ్మ వీధుల్లో ఇంటింటికి తిరిగి టీడీపీ, బీజేపీ, మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్దిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

👉 బిజెపి మిత్ర పక్షాలను ఓడించాలి ,సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హానీఫ్…అవినీతి బిజెపి ప్రభుత్వం దాని మిత్రపక్షాలైన టిడిపి,జనసేన పార్టీ అభ్యర్థులను వైసీపీ అభ్యర్థులను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ .ఆదివారం సుందరయ్య భవనంలో సిఎస్పురం పామూరు కార్యకర్తల సమావేశం ఊసా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ బిజెపి పది సంవత్సరాలు పరిపాలనలో దేశాన్ని అప్పులు పాలు చేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ గడ్డి దించితే గాని ఈ దేశం బాగుపడదని ఆరోపించారు.రాష్ట్రంలో వైసిపి పాలన ప్రతిపక్ష పార్టీ అయినా టిడిపి పార్టీ ప్రజలపై పన్నుల పేరుతో అధిక బారాలు మోపిందన్నారు.అధికారపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు వచ్చి ఓటు అడిగితే ఏం చేశారని నిలదీయాలని పిలుపునిచ్చారు.సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మౌలాలి సిపిఎం పామూరు మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యాద్రి కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

👉 200 మంది వైసీపీలో చేరిక..పొదిలి పట్టణంలోని శ్రావణి ఎస్టేట్ లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఎంపి అభ్యర్థిగా తనను, మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి,మార్కాపురం మార్కెట్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

👉కంభం టౌన్ ””రావులకొల్లు”” వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణమోహన్ రెడ్డి ఆయన వెంట బోరు శీను తదితరులు ఉన్నారు..👉చేగిరెడ్డి వారి నిశ్చితార్థ వేడుకకు హాజరైన గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి  తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి ఆయన వెంట బోర్ శ్రీను తదితరులు ఉన్నారు..*

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…