చంద్రబాబు హెలిప్యాడ్‌ వద్ద బాంబు!

తాజాగా ఆయన అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ నిర్వహించారు. దీంతోపాటు ఏలూరు జిల్లా చింతలపూడిలోనూ సభ నిర్వహించాల్సి ఉంది. ఆయన ‘రా.. కదిలి రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 17 లోక్‌ సభా నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు సభలు నిర్వహించారు. తాజాగా ఆయన అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ నిర్వహించారు. దీంతోపాటు ఏలూరు జిల్లా చింతలపూడిలోనూ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే చింతలపూడిలో చంద్రబాబు హెలికాప్టర్‌ దిగాల్సిన హెలిప్యాడ్‌ వద్ద కలకలం చోటు చేసుకుంది. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్‌ బజర్‌ మోగింది. దీంతో అధికారుల్లో, టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. దీంతో అధికారులు వెంటనే హెలిప్యాడ్‌ మధ్యలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో ఇనుప రాడ్‌ మాత్రమే బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ హెలిప్యాడ్‌ సభా స్థలికి సమీపంలోనే ఉండటం గమనార్హం. మరోవైపు చింతలపూడి సభ వద్ద హెలిప్యాడ్‌ వద్ద తవ్వకాలు చేపట్టడంతో చంద్రబాబు రావాల్సిన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవడానికి తొలుత అధికారులు అనుమతులు నిరాకరించారు. మాడుగులలో రా కదలిరా సభను పూర్తిచేసుకొని వచ్చే సమయానికి హెలిప్యాడ్‌ ను సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా మాడుగులలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 64 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమని వెల్లడించారు. ఎన్నికల్లో రాష్ట్రం .. ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. బటన్‌ నొక్కుతున్నానని జగన్‌ గొప్పలు చెబుతున్నారని.. బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి అని ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌ అని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ.64 వేల కోట్ల భారం వేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందన్నారు. రోడ్లు, మద్యనిషేధం, జాబ్‌ కాలెండర్, సీపీఎస్‌ రద్దు తదితరాలపై బటన్‌ ఎందుకు నొక్కలేదని నిలదీశారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…