మోడీతో జగన్ ..అమిత్ షా తో చంద్రబాబు..మధ్యలో పవన్

మలుపులు తిరుగుతున్న ఏపీ రాజకీయం

ఏపీ రాజకీయాలు ఓవర్ టూ ఢిల్లీ అన్నట్లుగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ రాజకీయాలు ఓవర్ టూ ఢిల్లీ అన్నట్లుగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఇపుడు సడెన్ గా జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. గురువారం రాత్రి జగన్ ఢిల్లీలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో పోలవరం ప్రాజెక్ట్ కి రావల్సిన నిధులు, విభజన హామీల గురించి తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన నిధుల బకాయిల గురించి ముఖ్యమంత్రి చర్చిస్తారు అని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సవరించిన అంచనాల నిధులు కూడా రావాల్సిన అవసరం గురించి కూడా ప్రధానిని ముఖ్యమంత్రి కోరనున్నారు అని చెబుతున్నారు. ఇక షెడ్యూల్ 9 లో ఉన్న విభజన ఆస్తులు నిధుల పంపకాలు కూడా జరగక గత పదేళ్ళుగా అలాగే ఉన్నాయని అంటున్నారు. వీటి మీద కూడా ప్రధానితో చర్చిస్తారు అని అంటున్నారు. సరే ఇవన్నీ సర్వ సాధారణమైన విషయాలు మామూలే అనుకున్నా జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీ వెళ్ళడమే రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేనల మధ్యకొత్త పొత్తులు పొడుస్తున్న వేళ జగన్ ఢిల్లీ వెళ్ళడంతో రాజకీయంగా దీనిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. చూడబోతే గడచిన అయిదేళ్ళుగా ఢిల్లీలోని మోడీ ప్రభుత్వంతో జగన్ సఖ్యత నెరిపారు. వైసీపీ బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో అయితే అంతా సాఫీగా సాగుతున్న వ్యవహారంగా ఉంది… బయటకు చెప్పకపోయినా ఎన్డీయేకి తెర వెనక మిత్రుడిగా జగన్ ఉన్నారని అంటారు. అలా సాగిన జగన్ బీజేపీ బంధం ఈ పొత్తులతో బీటలు వారుతుందా అలా జరిగే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి అన్నది ఆసక్తికరంగా ఉంది. అంతే కాదు ఏపీలో బీజేపీ టీడీపీతో జత కట్టడం వల్ల జగన్ కి రాజకీయంగా కలిగే లాభాలు నష్టాలు ఎంతవరకూ ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. వీటిని బేరీజు వేసుకుంటూనే జగన్ బీజేపీ పెద్దలతో వీటి మీద కూడా మాట్లాడుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఇపుడు జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీకి సంబంధించిన విభజన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చిస్తారని కూడా అంటున్నారు.మోడీతో పాటుగా అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పొత్తుల విషయంలో బీజేపీ కీలక దశలో చర్చలు ఉన్న నేపధ్యంలో జగన్ ఢిల్లీకి సడెన్ గా టూర్ పెట్టుకోవడం మాత్రం సంచలనంగా ఉంది. ఏది ఏమైనా జగన్ తనదైన రాజకీయాన్ని ఢిల్లీలో ఈ విధంగా చూపిస్తారు అని అంటున్నారు. ఢిల్లీ తెర పైన ఏ రాజకీయం ఆవిష్కృతం కానుందో వేచి చూడాల్సిందే!!!

 

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…