రాయచోటి ఎమ్మార్వో కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితుడు..

తన తండ్రి పేరు ఉన్న స్థలాన్ని ఇతరుల పేర రికార్డులలో ఎక్కించారని ఆరోపణ..అడ్డుకున్న స్థానికులు, పోలీసులు..

రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో విసుగు చెందిన ఓ యువకుడు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి రెవెన్యూ లో చోటు చేసుకుంది.తన తండ్రి పేరు మీద ఉన్న 75 సెంట్ల స్థలాన్ని ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా రెవిన్యూ అధికారులు అక్రమంగా అబుబకర్, ఖాదర్ బాషా అనే వ్యక్తుల పేర్ల మీద ఎక్కించారని ఆరోపించాడు.

రాయచోటి మండల పరిధిలోని గునిగుంట్ల రోడ్డు సర్వే నెంబర్ 800 లో గతం 30 సంవత్సరాల నుంచి తన తండ్రి అయిన సులేమాన్ పేరు మీద 75 సెంట్ల స్థలం ఉందని,రెవిన్యూ రికార్డు ప్రకారం గత 30 సంవత్సరాల నుంచి 1బి, అడంగల్, అర్ఎస్అర్,10 వన్లు తన తండ్రి సులేమాన్ పేరు మీద ఉందని బాధితుడు ఆర్షధ్ అహ్మద్ తెలిపాడు.తన తండ్రి సులేమాన్ న్యాయం చేయాలని రెవిన్యూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి మరణించాడని తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు అర్షధ్ అహ్మద్ ఆవేదన చేశాడు.

గతంలో విచారణ చేసి 75 సెంట్ల స్థలం సులేమాన్ దేనని ఇచ్చిన ఎమ్మార్వో సుబ్రమణ్య రెడ్డి విచారణ చేసి ఎండాస్మెంట్ ఇచ్చినప్పటికీ,జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కు స్పందనలో అర్జీ ఇచ్చి వచ్చి10 రోజుల అవుతున్న న్యాయం జరగడం లేదని అవేదన వ్యక్తం చేశాడు.జిల్లా కలెక్టర్ ఎండార్స్ చేసి ఇచ్చిన స్పందన అర్జీని గునిగుంట్ల ఆర్ఐ, వీఆర్వో కు ఇచ్చినప్పటికీ రేపు,ఎల్లుండి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిప్పి, ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు రాసి ఇస్తాం అని అర్ఐ, వీఆర్వోలు అంటున్నారని,ఎన్ని సార్లు స్పందన అర్జీలు పెట్టిన అర్ఐ, వీఆర్వో, డిప్యూటీ ఎమ్మార్వో న్యాయం జరిగేలా కృషి చేయడం లేదని ఆవేదన చేశాడు.

సీఎం జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్,ఎమ్మేల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు అర్షధ్ అహ్మద్ కోరాడు.

👉ఎన్నికల నిర్వహణపై పోలీస్ అధికారులకు  ట్రైనింగ్  ప్రోగ్రాం

ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ ఆదేశాలపై బుధవారం నూజివీడు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులకు ఏలూరు సి.సి.యస్ ఇన్స్పెక్టర్ సి. హెచ్ మురళి కృష్ణ పోలీసు అదికారులతో ఒక్క రోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ను హెలపురి ఇంజినీరింగ్ కళాశాలలో లో నిర్వహించారు జిల్లాలోని నూజివీడు సబ్-డివిజన్ లలో ఒక్క రోజు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా పోలీసు అదికారులు మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పాటించాలని, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు నీతి నిజాయితీగా, నిస్వార్ధముగా కష్టపడి పనిచేయాలని, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి బాధ్యతగా ఉద్యోగ విధులు నిర్వహించాలని,

ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర సురక్షితమైన మరియు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడమేనని ఇక్కడ పౌరులు భయం లేకుండా వారి ఓటు వేసే ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేలా చూడటం, ఓటరు అణచివేత వ్యూహాలను (ఓటర్ బెదిరింపు, బలవంతం లేదా ఏవైనా ప్రయత్నాలు వంటివి) నిరోధించడం,సున్నితమైన ఎన్నికల సామగ్రి మరియు మౌలిక సదుపాయాలను భద్రపరచడం. ట్రాఫిక్‌ను నిర్వహించడం మరియు బ్యాలెట్ పేపర్లు,ఇవి ఎం,మరియు వి వి ఏ టి ఇతర పోల్ మెటీరియల్‌ల సురక్షితమైన రవాణా మరియు నిల్వ ఉండేలా చూసుకోవడం,

ర్యాలీలు మరియు నిరసనల సమయంలో, ఆటంకాలు మరియు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం,హిస్టరీ షీటర్‌లు, అసాంఘికశక్తులపై నిరంతర పర్యవేక్షణ చెయ్యాలని,గత ఎన్నికల నేరాల చరిత్ర కలిగిన వ్యక్తుల పై నిఘా ఉంచి చెక్ పోస్ట్ ల వద్ద నగదు మద్యం,నాటు సారాయి,గంజాయి ఇతర అక్రమ రవాణాను అరికట్టుటకు వాహన తనిఖీ చేపట్టాలన్నారు .పై నిబంధనలు పాటిస్తూ అందరూ ఐక్యమత్యంగా కష్టపడి పనిచేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుందని,అలాగే జిల్లాకు కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు.

 

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..