👉ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే: నాగార్జున రెడ్డి
ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని గిద్దలూరు ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తన నివాసం గిద్దలూరు లోనే అని నాన్లో లోకల్ అనే మాటకు ఇక తావులేదని గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. సీఎం జగన్ మాట ప్రకారం తాను గిద్దలూరు నియోజకవర్గానికి వచ్చినట్లుగా తెలిపారు.తాను గిద్దలూరు వైసిపి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనపై సోషల్ మీడియాలో అధికంగా విమర్శలు వస్తున్నాయని కావాలంటే తమ కుటుంబం అక్రమాలకు పాల్పడి ఉంటే ఆర్టిఐ ఆక్ట్ ద్వారా నిరూపించాలని అన్నారు.👉
ఇక గిద్దలూరు నియోజకవర్గంలో 40 వేలకు పైగా ఆర్మీ ఉద్యోగులు ఉన్నారని వారందరూ దేశ సేవకై అంకితమై ఉన్నారని వారికోసం సీఎం జగన్ తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు వారికి సదుపాయాలు కల్పించేందుకు ముందు ఉంటానని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గ మొత్తం పర్యటించి కార్యకర్తలతో కలుస్తానని ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తానని అన్నారు. ఎమ్మెల్యే అన్నారాంబాబుతోపాటు తనతో సీఎం జగన్ మాట్లాడి నియోజకవర్గలా మార్పిడి చేశారని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను పాటించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
- APIIC చైర్మన్ ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే జంకె.వెంకటరెడ్డిని కంభం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంగటి చెన్నారెడ్డి,అర్ధవీడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చేగిరెడ్డి పోతిరెడ్డి, మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
- 👉 గుండెపోటుతో మరణించిన ఆర్మీ జవాన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కుందురు
రాచర్ల మండలం సోమిదేవిపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బత్తుల వెంకటరాజు (40)గురువారం రాత్రి కోలుకొతా లో గుండెపోటుతో మృతి చెందడంతో శనివారం ఆయన భౌతికకాయాన్ని సోమిదేవిపల్లె గ్రామానికి తీసుకోనిరాగా విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు.కార్యక్రమంలో ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.