గిద్దలూరులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేది నేనే..టీడీపి ఇంచార్జ్ ముత్తుముల.. గిద్దలూరు జనసేన టికెట్ “ఆమంచికే”.. ఫేక్ లెటర్ అని ఖండిస్తున్న టిడిపి నాయకులు..

  • తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని గిద్దలూరు టీడీపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశించిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేయాలని, మరో 50 రోజుల్లో ఎన్నికలు పూర్తి అవుతాయని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన, అవాకులు చవాకులు పేలిన టీడీపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానన్నారు. 👉మంగళవారం గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం జరగనుందని ఈ సమావేశానికి మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

👉వచ్చే నెల 2. 3 తేదీల్లో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గిద్దలూరు రానున్నారని నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులతో సమావేశం అవుతారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ తెలుగుదేశం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియచేయాలనీ టీడీపి జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను క్లుప్తంగా ప్రజలకు తెలియచేయాలని, వైసీపీ పాలనలో జరిగిన అరాచక పాలనను, దోపిడీని వివరించాలని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపి జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియచేశారు..ఈకార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ మరియు గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, కాపు నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య, టీడీపి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మైనార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, టీడీపి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గోన్నారు.

  • 👉

జనసేన అభ్యర్థుల లిస్టుతో తిక మక..ఫేక్ లెటర్  పెట్టి సంబరాలు చేసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు.. గత రెండు రోజులుగా  అభ్యర్థులుగా టిడిపి జనసేన లో కలిసి లిస్టు ప్రకటించినట్లు జనసేన విడుదల చేసిన ఒక లిస్టు పేర వచ్చిన ఒక పోస్టు ప్రస్తుతం టిడిపి నాయకులను తికమక కు గురిచేస్తుంది.  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కు కేటాయించిన విషయం విధితమే.అయితే ఈ లెటర్ లో ఒంగోలు జనసేన అభ్యర్థి రియాజ్ అని వుంది,గిద్దలూరు అభ్యర్థిని మొదటి లిస్టులో ప్రకటించలేదు.కాగా జనసేన లిస్టులో గిద్దలూరు అభ్యర్థిగా ఆమంచి స్వాములు పేరు ఉంది.ఇది జనసేన పార్టీ వారే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత ఐదేళ్లుగా టిడిపిని బలోపేతం చేసేందుకు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అహర్నిశలు కృషిచేశారు.ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ఎంతోమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారరంటే అశోక్ రెడ్డి ఎంతగా కృషి చేశారో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘంటాపదంగా చెప్తున్నారు. అలాంటిది ఎక్కడి నుండి ఈ నియోజకవర్గంలో అసలు సంబంధమే లేని వారికి టికెట్ ఇచ్చి  ఆయన గెలుపు కోసం పనిచేయమంటే ఎలా చేస్తామని బహిరంగంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి టిడిపి అధిష్టానం గిద్దలూరు టికెట్టు కేటాయింపు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడక తప్పదు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..