లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ కు సన్మానం.. గిద్దలూరు వైకాపాలో చేరికలు..ముత్తుములకు సన్మానం.. తర్లుపాడులో రాజకీయ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం ..

  • సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ఉద్యోగుల సంఘం..

జర్మనీకి చెందిన ప్రపంచ సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ తన పరిశోధనలో భాగంగా దక్షిణ భారతదేశాన్ని సందర్శించారు. మనదేశంలో యుద్ధాలలో వాడే ఆయుధాల గురించి ఫిరంగుల గురించి, వారసత్వ సంపద, ఆయుధాలు ఫిరంగులలో తయారీలో వినియోగించిన లోహాల గురించి అద్వయనంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు పద్మాచారి ఆధ్వర్యంలో ఆయనకు గ్రీన్ ల్యాండ్ లోని టూరిజం ప్లాజా లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వృత్తి రీత్యా విశ్వబ్రాహ్మణుడు అయిన ఆయన ఇటీవల భారతదేశం నిర్వహించిన సూర్యయాన్ చంద్రయాన్ యాత్రలలో రాకెట్లలో వెళ్లి అక్కడి వాతావరణ పరిస్థితులను, అక్కడి ఉష్ణోగ్రతను తట్టుకునే లోహాలను గురించి అనేక పరిశోధనలు నిర్వహించారు. అనేక దేవి దేవత విగ్రహాలను తయారు చేయడంతో పాటు విగ్రహాల తయారీలో ఎటువంటి లోహాలను వినియోగించాలన్న అంశాలపై పరిశోధన సాగిస్తుంటారు.తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన లోహ శాస్త్రవేత్త ప్రముఖ చరిత్రకారుడైన డాక్టర్ జై కిషన్ ఆహ్వానం మేరకు రేరెన్ తెలంగాణ సందర్శించారు.లోహ పరిశోధనలో ఆయన వద్ద 35 మంది డాక్టరేట్ పట్టాలు పొందారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తీలో రైరన్ ముంబైలోని తన శిష్యురాలైన డాక్టర్ మేఘనను కూడా కలిసి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆర్థిక నేరాల విభాగం ఏసిపి కే కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిలోరెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తాను గతంలో పోలీసు డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వివిధ దేశాలలో పోలీసుల పనితీరు గురించి చేసిన సందర్భంగా జర్మనీలో సైతం పర్యటించానని ఆ దేశం గురించి మంచి అవగాహన ఉందని, ప్రజల జీవనశైలి కర్తవ దీక్షలో పోలీసులు అధికారుల తీరు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి బ్రహ్మశ్రీ వెంకటాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు వడ్రంగి కమ్మరి శిల్పి, లోహ కారులు, స్వర్ణకారులు తమ సంప్రదాయ వృత్తులలో కొనసాగుతూనే సమాజానికి ఉపయోగపడే వారి వారి కులవృత్తులలో అత్యంత ప్రతిభను కనబరుస్తూ విశ్వకర్మజాతికి తలమానికంగా నిలుస్తున్నారని ఆయనను ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బ్రహ్మశ్రీ ఎల్ ఎన్ చారి, దుబ్బాక కిషన్ చారి, డాక్టర్ రవీంద్ర చారి, శ్రీరామోజు ప్రదీప్ సురేందర్ డాక్టర్ సుధాకర్, దేవరకొండ నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

*అర్దవీడు మండలంలో పట్టపగలే రెండు గృహాల్లో చోరీ*  పట్టపగలే రెండు గృహాల్లో చోరీ జరిగిన సంఘటన అర్దవీడు మండలం మోహిద్దీన్ పురం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద కాశయ్య, చిన్న కుమారుడు రంజాన్ గృహాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దకాశయ్య దంపతులతో పాటు చిన్న కోడలు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లారు. పదింటి సమయంలో దొంగలు రెండు ఇళ్ల తలు పులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గ్రామం శివారు వరి మాగాణులకు సమీపంలో ఇళ్లు ఉండటంతో గమనించే వారు లేకపోయారు. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రెండు బీరువాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్టు సమాచారం. రెండు గృహాల్లో సుమారు 10 తులాల బంగారు రూ.50 వేల నగదు అపహరించినట్లు సమాచారం. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి రావడంతో తలుపులు తెరచి ఉండటం పై దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై అనిత తమ సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి వేలి ముద్రలు సేకరించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…_

* 👉ఆంధ్రా మిర్రర్ ప్రకాశం జిల్లా ..తర్లుపాడు.. వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యా యత్నం…వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి ఆరోపణ.. తర్లుపాడు మండలం కందల్లపల్లిలో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..పురుగుమందు తాగిన తెదేపా కార్యకర్త బ్రహ్మతేజ కుమార్.మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు .వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి వెల్లడి.తనకున్న చిన్నపాటి ఉద్యోగం తీసేయడంతో పాటు తన కుటుంబ సభ్యులను, కులాన్ని దూషించాడని బాధితుడి ఆవేదన.

👉 వైకాపాల్లో చేరికలు..ఆంధ్ర మిర్రర్ ప్రకాశం జిల్లా..

గిద్దలూరు .. మండలంలోని ముల్లపాడు పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు టిడిపి నుండి వైసీపీలో చేరడం జరిగింది.వీరందరికీ గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

👉టిడిపి ఇన్చార్జి ముత్తుములను సన్మానించిన కంభం టిడిపి నాయకులు

గిద్దలూరు టిడిపి టికెట్  గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి కేటాయించడంతో శుక్రవారం రాత్రి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అనీష్ అహ్మద్, తోట శ్రీనివాసులు, గౌస్ బాషా, జీలాని, అల్లాబకాష్ తది తరులు పాల్గొన్నారు.

 

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..