నరసారావుపేట లోక్ సభ స్థానం వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్..!

నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్‌ యాదవ్‌ను
వైఎస్‌ఆర్‌ సీపీ అధిష్టానం
నరసరావుపేట లోక్ సభ స్థానానికి ఎందుకు పంపింది..?!

చాలా మంది మెదళ్లను..
తొలుస్తున్న ప్రశ్న ఇది.

సీఎం వైఎస్‌ జగన్‌కు
అనిల్ కుమార్‌ యాదవ్ అత్యంత విశ్వాసపాత్రుడు

అనిల్ కుమార్‌ యాదవ్‌కు
స్టేట్‌ వైడ్ ఫేమ్ ఉంది
మంచి స్పీకర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

చంద్రబాబు మీద, పవన్‌ మీద..
లోకేష్‌పై దూకుడుగా విమర్శలు చేయడం..
చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్పడం
అనిల్ కుమార్‌ యాదవ్‌ అలవాటు.

సీఎం జగన్ మొదటి కేబినెట్‌లో
నీటి పారుదల శాఖ మంత్రిగా అనిల్ పని చేసి
తానేంటో నిరూపించుకున్నారు,
మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలో..
పలు నియోజకవర్గాల్లో పాల్గొన్న అనిల్ యాదవ్..
తన ప్రసంగాలతో ప్రతిపక్షంపై
పిడుగుల్లాంటి విమర్శలు చేశారు.

నెల్లూరు జిల్లాకు నరసరావు పేట
నియోజకవర్గానికి మంచి సంబంధం ఉంది

1999లో నెల్లూరు జిల్లాకు చెందిన
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
నరసరావు పేట ఎంపీగా పోటీ చేసి
టీడీపీ అభ్యర్ధి లాల్ జాన్ భాషపై
13,882 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2004లో నెల్లూరు జిల్లాకు చెందిన
మేకపాటి రాజమోహన్ రెడ్డి ..
నరసారావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి మద్ది లక్ష్మయ్యపై
86,255 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

20 ఏళ్ల తరువాత మళ్లీ నెల్లూరుకు చెందిన
అనిల్ కుమార్‌ యాదవ్‌కు ..
నరసరావు పేట లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం అవకాశం కల్పించింది.

👉బీసీ ఓటు బ్యాంక్‌..
వైఎస్ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకును
దృష్టిలో పెట్టుకునే
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం
అనిల్ ను నరసరావు పేట నుంచి రంగంలోకి
దించిందని అనుకోవాలి.

2019లో కూడా నరసారావు పేట లోక్ సభ
స్థానాన్ని వైఎస్ఆర్‌ సీపీనే గెల్చుకుంది.

వైఎస్ఆర్‌ సీపీ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి రాయపాటి సాంబశివ రావుపై
1,53,978 ఓట్లతో గెలిచారు.

కానీ
మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో
నరసారావుపేట లోక్ సభ స్థానం బీసీలకు
ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం భావించింది.
అందులో భాగంగానే
బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన
అనిల్‌ను బరిలోకి దించింది.

శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు లోక్ సభ స్థానానికి
మారితే బాగుండేది.
ఆయన కూడా
వైఎస్ఆర్ సీపీ తరపున ఈజీగా గెలిచేవారు.

కానీ తొందరపాటుతో
వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారని పలువురు భావిస్తున్నారు .
టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా
పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదు.

నరసారావుపేట లోక్ సభ స్థానంలో
బలమైన రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంక్‌
బీసీల ఓటు బ్యాంక్ వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్ధి
అనిల్‌కు అండగా ఉంటుంది
అనడంలో సందేహం లేదు.

వైఎస్ఆర్ సీపీ స్థాపించాక
అప్పటి నుంచి నరసరావు పేట ఎంపీ స్థానం
ఆ పార్టీకి కంచుకోటగా ఉంది.

గతంలో యాదవ సామాజిక వర్గ ఓట్లు
టీడీపీకి పడేవి.
ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రంగ ప్రవేశంతో
యాదవుల ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడతాయని
అనడంలో సందేహం లేదని వైకాపా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి .

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో
పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట..
సత్తెనపల్లి, వినుకొండ, గురజాల,
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
మొదటి నుంచి నరసరావు పేట లోక్ సభ
నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గ..
ఫైట్‌గా ఉండేది.
ఇప్పుడు బీసీ మరియు రెడ్డి వర్సెస్‌ కమ్మ సామాజికవర్గ ఫైట్‌కు
నరసరావుపేట లోక్ సభ స్థానం వేదిక కానుంది.
సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో
ఎక్కువ లబ్ధి పొందింది బీసీ వర్గాల వారే.
గతంలో బీసీల ఓట్లు టీడీపీకి పడేవని
ఈ ఎన్నికల్లో బీసీల మెజార్టీ ఓట్లు
వైఎస్ఆర్‌ సీపీ వైపు వచ్చే అవకాశముంది.
నరసరావుపేట లోక్ సభ స్థానంలో
అనిల్ కుమార్ యాదవ్
మంచి మెజార్టీతో గెలుస్తారనడంలో
ఏమాత్రం సందేహం లేదని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..