👉డీఎస్సీ 2024 లో ఉర్దూ పోస్టులకు నోచుకోని ప్రకాశం జిల్లా!!!.. ఖాళీల లిస్టు పంపడంలో అక్రమాలు???

  • .

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన జారీ చేసిన డిఎస్సి 2024 నోటిఫికేషన్ లో ప్రకాశం జిల్లా ఉర్దూ మాధ్యమం పోస్టులు చూపించక పోవడం చాలా అన్యాయమని ముస్లిం మైనార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండల విద్యాశాఖ వారు ఖాళీలు ఉన్నట్లు లిస్టు పంపించినప్పటికీ జిల్లా విద్యాశాఖ నుండి కమిషనర్ కు పంపిన లిస్టులో ఖాళీలు చూపకపోవడం వల్ల ఇటువంటి దారుణం చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లా లో ఉర్దూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు 25 ఉర్దూ మధ్యమంలో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 5 , పిఎస్ 1, సోషల్ 2 ,‬ గణితం 2‎ ఖాళీగా ఉన్నప్పటికీ డీఎస్సీ -2024 లో ఖాళీలు చూపించక పోవడం చాలా అన్యాయం అని , దీంతో పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల విద్యార్థుల చదువులు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల ఎన్నో ఏళ్లుగా టీచర్ ట్రైనింగ్ చేసి ఏళ్ల తరబడిగా కళ్ళు కాయలు కాసేలా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూపులు చూస్తున్న వారు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని టీచర్ ట్రైనింగ్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని, జరిగిన తప్పులను సరిదిద్ది అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉర్దు మాధ్యమం విద్యార్ధులకు అన్యాయం జరగకుండా ఈ మొత్తం పోస్టులను 2024 డీఎస్సీ చూపించ వలసిందిగా ముస్లిం మైనార్టీ నాయకులు కోరుతున్నారు.

👉మహిళపై భర్త కత్తితో దాడి !!!

గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదర బజార్లో మహిళపై ఆమె భర్త కత్తితో దాడి చేసిన సంఘటన..  భర్త కృష్ణ అతని భార్య ద్రాక్షాయని మధ్య గొడవల వల్ల సంవత్సర కాలంగా వేరువేరుగా జీవనం కొనసాగిస్తున్నారు.భర్తపై ద్రాక్షాయని తనని వేధిస్తున్నాడంటూ సంవత్సరం క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది .ఈ క్రమంలో భర్త కృష్ణ భార్య పనిచేసే దగ్గరకు వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలని మూడు నెలలుగా ద్రాక్షాయిని చుట్టూ తిరుగుతున్నట్లు,కేసు వెనక తీసుకోకపోతే చంపేస్తానంటూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.పనిచేసే చోట నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో భార్యపై భర్త కత్తితో దాడి చేయగా,బాధితురాలు ద్రాక్షాయని పెద్దగా అరవడంతో భర్త కృష్ణ పరారీ అయినాడు.బాదితారాలికి బలమైన గాయాలు కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న లాలాపేట సీఐ పి.దేవప్రభాకర్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు .

👉గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో వివాహిత దారుణ హత్య..!!!

భవనం వారి వీదిలో నివాసం ఉంటున్న రామిశెట్టి అలేక్య (35) ను గొంతు కోసి హత్య చేసిన దుండగులు..గదిలో గొంతు కోసి హత్యకు గురై నగ్నంగా పడి ఉన్న అలేఖ్య మృతదేహం..అన్నం శ్రీనివాస్ అనే వ్యక్తితో అలేక్యకి గత ఏడు సంవ్సరాలుగా వివాహేతర సంబంధం ఉందంటున్న భర్త రమేష్ ..ఇరువురి మధ్య కోర్టులో కేసు నడుస్తున్న ట్లు సమాచారం.భవనంలోని కింద గదిలో ఉన్న తన భార్య అలేఖ్యని గత రాత్రి అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీనివాస్ హత్య చేసినట్టు భర్త రమేష్ ఆరోపిస్తున్నాడు..2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

👉*వివాహిత దారుణ హత్య.*

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు సావరంలో దూళ్ళ సత్య శ్రీ (35) వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. సత్యశ్రీ భర్త సూర్యప్రకాష్ (సూరిబాబు) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇరువురి దంపతుల మధ్య గత మూడు నెలలుగా ఏర్పడిన వివాదమే హత్యకు దారితీసి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. కాగా ఇరువురు దంపతులకు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరించారు. వీరికి 16 ఏళ్లు క్రితం ప్రేమ వివాహం జరిగిందని, ఒక పాప, బాబు సంతానం ఉండగా, పాప ఐదవ తరగతి, బాబు ఎనిమిదవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని సౌత్ జోన్ డిఎస్పి అంబికా ప్రసాద్, కడియం సీఐ బి తులసీదర్ పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం భర్త పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

👉ముత్తుముల సమక్షంలో టీడీపిలో చేరిన గ్రామ వాలంటీర్!!!

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం, మండలం, లింగాపురం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ మిట్టా విద్యాసాగర్ తన వాలంటీర్ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి