ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం..మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్.. ఇంటింటికి ప్రచారంలో తెలుగు తమ్ముళ్లు.. భాష్యం స్కూల్ బిల్డింగ్ పై నుండి పడి విద్యార్థిని మృతి..ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన..కంభం


రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ శాసన మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఆయనతోపాటు గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్నీ విధాలుగా అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మైనార్టీల సంక్షేమాన్ని మరిచి వారి పై దాడులు చేయటమే పనిగా పెట్టుకున్నారని, ముస్లిం సోదరుల పై వైసీపీ మూకలు దౌర్జన్యం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనను తరిమికొట్టటానికి ముస్లిం సోదరులంతా సిద్ధంగా ఉండాలని, గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలుపించేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తుందని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవటమే పనిగా పెట్టుకున్న జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు.
కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు, రాష్ట్ర, పార్లమెంట్ కమిటీ మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
👉 *అశోక్ రెడ్డి గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లు…

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కంభం మండలం లోని లింగోజిపల్లి లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్6 పథకాల గురించి వివరించడం జరుగుతుంది.మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ముత్తుముల అశోక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో ని ప్రతి ఇంటికి తిరిగి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచి తాటికొండ వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తాటికొండ కాశయ్య, ఆవులపాటి వెంకటసుబ్బయ్య, , నాగేళ్ల రామయ్య , కరణం ప్రసాదు , ఇ. లక్ష్మణరావు ,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు , పార్లమెంట్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ ఖాదర్ హుస్సేన్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిరివెళ్ల రవికుమార్ జిలాని, తదితరులు పాల్గొన్నారు.
👉గిద్దలూరు నియోజకవర్గ టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు నడుం బిగించారు.
బుధవారం ఉదయం పట్టణంలోని 1వ వార్డు, 8వ వార్డు, మరియు 19వ వార్డులలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రతీ ఇంటికి తిరిగి టీడీపి – జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. నాడు తెలుగుదేశం హయాంలో ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించారని, పేదలకు 1404 ఎన్టీఆర్ టిడ్కొ గృహాలను మంజూరు చేశారని, సిమెంట్ రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేశారని గుర్తు చేశారు..

👉బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.తోలుత సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈఓ బి.మాల్యాద్రి మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడి వుందనీ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి దేశ నిర్మాణ పటిష్టతకు సూచికగా,ఆర్థిక అభివృద్ధికి బాసటగా నిలుస్తాయనీ,విభిన్న రంగాలలో శాస్త్ర విజ్ఞాన సేవలు అద్భుతాలను చేస్తాయన్నారు.

ప్రజల జీవన ప్రమాణ పురోగతిలో శాస్త్రం సాంకేతిక విజ్ఞాన పాత్ర అద్వితీయమైనదనీ,పాఠశాల స్థాయిలోనే వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ఆవిష్కరణలను తిలకించి ప్రశంసల జల్లు కురిపించారు.కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు వై. వీరనారాయణ, మొయినుద్దీన్, కొమ్మునూరి.కిరణ్ కుమార్, ఏ.వి.శ్రీకృష్ణ, పాండురంగ బాబు పాల్గొన్నారు

👉 భాష్యం స్కూల్ 4 వ అంతస్తు మీద నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి క్రింద పడి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.వివరాల్లో కెళితే కొనకండ్ల రిషిత అనే బాలిక పదవ తరగతి భాష్యం స్కూల్లో చదువుతుంది. స్కూల్ బిల్డింగ్ నాలుగవ అంతస్తులో పదవ తరగతి క్లాసులు నిర్వహిస్తుంది.స్కూల్ మీద నుండి కింద పడ్డ రిషితను హుటాహుటిన పట్టణ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చటం జరిగింది.పై నుండి కింద పడ్డ రిషిత వెంటనే చనిపోవడం జరిగిందని తెలిపారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి