ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం..మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్.. ఇంటింటికి ప్రచారంలో తెలుగు తమ్ముళ్లు.. భాష్యం స్కూల్ బిల్డింగ్ పై నుండి పడి విద్యార్థిని మృతి..ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన..కంభం


రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ శాసన మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సోదరుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఆయనతోపాటు గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్నీ విధాలుగా అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మైనార్టీల సంక్షేమాన్ని మరిచి వారి పై దాడులు చేయటమే పనిగా పెట్టుకున్నారని, ముస్లిం సోదరుల పై వైసీపీ మూకలు దౌర్జన్యం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనను తరిమికొట్టటానికి ముస్లిం సోదరులంతా సిద్ధంగా ఉండాలని, గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలుపించేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తుందని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోచుకోవటమే పనిగా పెట్టుకున్న జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు.
కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు, రాష్ట్ర, పార్లమెంట్ కమిటీ మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
👉 *అశోక్ రెడ్డి గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న తెలుగు తమ్ముళ్లు…

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కంభం మండలం లోని లింగోజిపల్లి లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్6 పథకాల గురించి వివరించడం జరుగుతుంది.మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ముత్తుముల అశోక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో ని ప్రతి ఇంటికి తిరిగి మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచి తాటికొండ వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తాటికొండ కాశయ్య, ఆవులపాటి వెంకటసుబ్బయ్య, , నాగేళ్ల రామయ్య , కరణం ప్రసాదు , ఇ. లక్ష్మణరావు ,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు , పార్లమెంట్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ ఖాదర్ హుస్సేన్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిరివెళ్ల రవికుమార్ జిలాని, తదితరులు పాల్గొన్నారు.
👉గిద్దలూరు నియోజకవర్గ టీడీపి జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు నడుం బిగించారు.
బుధవారం ఉదయం పట్టణంలోని 1వ వార్డు, 8వ వార్డు, మరియు 19వ వార్డులలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రతీ ఇంటికి తిరిగి టీడీపి – జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. నాడు తెలుగుదేశం హయాంలో ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించారని, పేదలకు 1404 ఎన్టీఆర్ టిడ్కొ గృహాలను మంజూరు చేశారని, సిమెంట్ రోడ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేశారని గుర్తు చేశారు..

👉బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.తోలుత సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈఓ బి.మాల్యాద్రి మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడి వుందనీ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి దేశ నిర్మాణ పటిష్టతకు సూచికగా,ఆర్థిక అభివృద్ధికి బాసటగా నిలుస్తాయనీ,విభిన్న రంగాలలో శాస్త్ర విజ్ఞాన సేవలు అద్భుతాలను చేస్తాయన్నారు.

ప్రజల జీవన ప్రమాణ పురోగతిలో శాస్త్రం సాంకేతిక విజ్ఞాన పాత్ర అద్వితీయమైనదనీ,పాఠశాల స్థాయిలోనే వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ఆవిష్కరణలను తిలకించి ప్రశంసల జల్లు కురిపించారు.కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు వై. వీరనారాయణ, మొయినుద్దీన్, కొమ్మునూరి.కిరణ్ కుమార్, ఏ.వి.శ్రీకృష్ణ, పాండురంగ బాబు పాల్గొన్నారు

👉 భాష్యం స్కూల్ 4 వ అంతస్తు మీద నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి క్రింద పడి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.వివరాల్లో కెళితే కొనకండ్ల రిషిత అనే బాలిక పదవ తరగతి భాష్యం స్కూల్లో చదువుతుంది. స్కూల్ బిల్డింగ్ నాలుగవ అంతస్తులో పదవ తరగతి క్లాసులు నిర్వహిస్తుంది.స్కూల్ మీద నుండి కింద పడ్డ రిషితను హుటాహుటిన పట్టణ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చటం జరిగింది.పై నుండి కింద పడ్డ రిషిత వెంటనే చనిపోవడం జరిగిందని తెలిపారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..