భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి.. విద్యుత్ షాక్ 15 మందికి గాయాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుందూరు.. ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణ చైతన్య

*పొదిలిలోని శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వరరావు స్వామీ దేవాలయం వద్ద భద్రత మరియు బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీపి. పరమేశ్వర రెడ్డి..జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు…ఉత్సవాల సమయంలో దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొదిలిలోని శ్రీ పార్వతీ దేవి సమేత నిర్మమహేశ్వరరావు స్వామి దేవస్థానం నందు శుక్రవారం శివరాత్రి మహోత్సవం శనివారం రథోత్సవం సందర్బంగా శుక్రవారం జిల్లా ఎస్పీ ఆలయాన్ని దర్శించుకొని అక్కడి భద్రత బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించి పోలీస్ అధికారులకు పలు సూచనలు తెలియజేసారు. దేవాలయ ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గములు, క్యూలైన్లను, పార్కింగ్‌ స్థలాలు, రథశాల నుండి మండపం వరకు భద్రతా బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

👉మహాశివరాత్రి వేడుకల్లో విద్యుత్ షాక్.. 15 మంది పిల్లలకు గాయాలు.. పలువురి పరిస్థితి విషమం..రాజస్థాన్‌లోని కోటాలో విషాదం నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం జరిగిన విగ్రహాల ఊరేగింపులో కరెంట్ షాక్ జరిగింది. ఈ ఘటనలో 15 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఎంబీఎస్ ఆస్పత్రిలో చేర్పించారు.అక్కడ చిన్నారుల పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కోట ఎస్పీ అమ్రిత దుహన్ వెల్లడించారు. ఇది చాలా విచారకరమైన ఘటన అని తెలిపారు. స్థానికంగా ఉన్న కాళీ బస్తీకి చెందిన కొందరు కలశాలతో ఊరేగింపు వద్దకు చేరుకున్నారని వెల్లడించారు. అదే సమయంలో ఒక చిన్నారి చేతుల్లో ఉన్న 20 అడుగుల పైపు హైటెన్షన్ వైర్‌కు తాకడంతో కరెంట్ షాక్ జరిగినట్లు పేర్కొన్నారు.

*👉సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ*

గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన కొమరోలు మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పామూరుపల్లె గ్రామానికి చెందిన పోలా వెలుగొండ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ 35,000 లను మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి గిద్దలూరు టౌన్ లోని వారి స్వగృహంలో అందజేసారు. కార్యక్రమంలో కొమరోలు మండల కన్వీనర్ బోయిల్లా జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

👉గిద్దలూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయ కర్త కుందురు నాగార్జున రెడ్డి మహా శివరాత్రి పండగ పర్వదినం పురస్కరించుకొని రాచర్ల మండలం రామాపురం గ్రామంలో శ్రీ పార్వతి పరమేశ్వరి దేవతల ఆశీర్వాదంతో ప్రత్యేక పూజలలో పాల్గొని బండ పందెం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.👉అనంతరం కె ఎస్ పల్లి గ్రామంలో శ్రీ ఎగువ భీమా లింగేశ్వర స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొని, బండ పందెములను ప్రారంభించారు. ఎంపీపీ కడప లక్ష్మీ వంశిధర్ రెడ్డి ఎంపీటీసీలు, సర్పంచులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

👉శ్రీ గంగా పార్వతి సమేత కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణచైతన్య*

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలో వెలసిన శ్రీ గంగా పార్వతి సమేత కేదారేశ్వర స్వామి వారిని గిద్దలూరు శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు డా”అన్నా కృష్ణచైతన్య శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక, పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్నా కృష్ణ చైతన్య ను సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమం లో పలువురు వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు*

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త