ప్రస్తుత రూపంలోని సిఏఏ ను వైకాపా వ్యతిరేకిస్తుంది.ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. గీతాంజలి మృతికి టిడిపి నేతే కారణం.. నందిగామ ఒంగోలు పొదిలి పట్టణాలలో నిరసన..పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న నాగార్జున రెడ్డి

👉ప్రస్తుత రూపంలోని CAAను వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోంది..*వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ : CAA ఉన్న ప్రస్తుత రూపం ఆమోదయోగ్యం కాదు. సి ఎ ఎ కు ప్రజా ఆమోదయోగ్యమైన సవరణలు అవసరం అన్నారు.

CAA (పౌరసత్వ సవరణ చట్టం)ప్రస్తుత రూపంలోని నిబంధనలను వైఎస్సార్ సీపీ అంగీకరించదు. దీనికి సవరణలు చేయాలని వైఎస్సార్ సీపీ పార్లమెంట్‌లో ఇప్పటికే పలుమార్లు కోరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం CAA ను ప్రజామోదయోగ్య చట్టంగా మారుస్తూ ముస్లింల హక్కులను కాపాడాలన్నారు .

  1. 👉గీతాంజలిమృతి కారకులు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. వైఎస్సార్‌సీపీ డిమాండ్.. పలుచోట్ల నిరసనలు..
  2. బాధితురాలు చనిపోయాక కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదు మంత్రి విడదల రజిని..  ప్రతిపక్ష చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయని మంత్రి రజినీ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ ట్రోలు ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గులేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని ఆందోళన చెందారు! వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది! మేము కచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాము, నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
  3. 👉కలనేరవేరటమే తప్పా.. ఎంపీ విజయసాయిరెడ్డి..ఆమె చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. ఆమె చేసిన తప్పు ఏమిటి? జగన్ ప్రభుత్వంలో తన సొంత ఇంటి కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉండటమా? ఏపీ ప్రభుత్వం పథకాల నుంచి లబ్ధి పొందటమా? అదే అసలు కారణమా? ప్రతిపక్ష పార్టీలకు వత్తాసు పలకలేదని ఒక వ్యక్తిని ఎంత నీచంగా వేధిస్తారా అని ప్రశ్నించారు.

👉ఫేక్ ఎకౌంట్ లతో రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించారు : హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతూ అసత్య ప్రచారాలను చేస్తున్నారు..సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరం.. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది.. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.👉👉👉 ఒంగోలులో..

గీతాంజలి మృతికి నిరసనగా ఒంగోలు పట్టణంలోఎమ్మెల్యే సతీమణి శశి,ఆమె కోడలు కావ్య, ఓయూడా చైర్మన్ సింగరాజు మీనా కుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమినేని మాధవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు.గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

👉నందిగామ..గీతాంజలి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి*

సోషల్ మీడియాలో ప్రతిపక్ష టీడీపీ-జనసేన మద్దతుదారులు వేధింపులు, ట్రోల్ చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి గీతాంజలి దారుణ మరణానికి నిరసనగా నందిగామకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ సెంటర్లో నిరసన చేపట్టారు. స్థానిక టీడీపీ నేత దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నేత మద్దినేని ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఈ దురదృష్టకర ఘటనకు వ్యతిరేకంగా గళం విప్పి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటివి పరిస్థితి రాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ‘గీతాంజలిని అవమానించి మానసికంగా వేధించిన ఉన్మాది సజ్జా అజయ్ అని అతడిని కఠినంగా శిక్షించాలి అని కోరారు. నందిగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యకు సజ్జా అజయ్ అత్యంత సన్నిహితుడని వీరంత ఒక బృందంగా చేరి ఇలాంటి దుర్మర్గపు పనులు చేస్తుంటారని ఆరోపించారు.

👉పొదిలిలో కొవ్వోత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించిన మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి అన్నా తనయుడు*

గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి,గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. బుధవారం పొదిలిలో గీతాంజలి మరణానికి నివాళి అర్పిస్తూ వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమాయకంగా మాట్లాడిన తీరు ఆమె భావ వ్యక్తీకరణకు నిదర్శనమని, అయితే ఆమెను ట్రోల్ చేస్తూ చేసిన పోస్టింగ్లు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పోస్టింగ్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో పొదిలి మండల వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు..

👉రూ.23.94 లక్షలతో రంగా పురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ..

రాష్ట్రంలో ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు లకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల,ఇన్సూరెన్స్,అన్ని కూడా రైతు బరోసా కేంద్రములో ఇవ్వడం జరుగుతుంది అన్నారు. 👉అనంతరం ఆయన అర్ధవీడు మండలంలోని 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రంగాపురం- అర్ధవీడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి, ఎంపీపీ వెంకట్రావు, జడ్పిటిసి సభ్యులు చెన్నువిజయ , మాజీ ఎంపీపీ రవికుమార్, రిటైర్డ్ డి ఇ చేరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,గ్రామ సర్పంచి నాగిరెడ్డి ఎంపీటీసీ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు……

👉 గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి సచివాలయ భవనాన్ని గిద్దలూరు నియోజకవర్గపు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి, సర్పంచి రాజమ్మ, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…