పవన్ నీవల్ల మేం బలి కావాలా..జనసేన నేత పంతం సరోజ.. ఈసీ అనుమతి తప్పనిసరి ఈసీవో ముఖేష్ కుమార్.. వైకాపాను వీడుతున్న వారిపై వ్యంగాస్త్రాలు.. కంభం వైకాపాలో చేరికలు

త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌..నీవ‌ల్ల మేం బ‌లికావాలా?.. కాకినాడ జనసేన నేత పంతం సరోజ..

అసెంబ్లీ,పార్ల‌మెంటు ఎన్నిక‌ల పొత్తులు,టికెట్ల కేటాయింపు వ్య‌వ‌హారం వంటివి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భారీ సెగ పెడుతున్నాయి.అది కూడా కాపులు,శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ”త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌?”అంటూ నిల‌దీత‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.దీంతో ఇప్పుడు జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.కాకినాడ మాజీ మేయర్, జనసేన నేత పంతం సరోజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని సర్వనాశనం చేశారు. విధానపరమైన అంశాలు,పార్టీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా ఉండి ఈ రోజు జనసేన పార్టీని ఏం చేశారు? మనకు పోల్ మేనేజ్ మెంట్ లేదని,బూత్ మేనేజ్ మెంట్ లేదని,టీడీపీకి పోల్ మేనేజ్ మెంట్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వాళ్లకే అవకాశం ఇద్దాం, వాళ్లతో సమానంగా కలిసి అడుగులేద్దాం అని మొన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. పోల్ మేనేజ్ మెంట్ లేకపోవడం అనేది ఇన్చార్జిల తప్పా?“అని స‌రోజ నిల‌దీశారు.నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి నెలకోసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉంటూ,ఒక రోజుంతా మీటింగులు పెడుతుంటారని,మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటూ పోల్ మేనేజ్ మెంట్ కానీ,బూత్ మేనేజ్ మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నార‌ని స‌రోజ ప్ర‌శ్నించారు.“ఈ అంశంపై మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడు పవన్ కల్యాణే నేర్పారు.పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ రోజు వరకు జనసేన పార్టీ ఏం చేస్తోంది?ఆయన దశాబ్దకాలంగా పార్టీని నడిపారు కదా.ఇప్పటిదాకా పోల్ మేనేజ్ మెంట్, బూత్ మేనేజ్ మెంట్ లేదంటే,ఇది ఎవరి వైఫల్యం?ఈ ప్రశ్నకు పవన్ కల్యాణ్,నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పి తీరాలి“అని స‌రోజ నిప్పులు చెరిగారు.ఇంతమంది జనసైనికులు ఉన్నారు, పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చిపోయే యువత ఉంది…పవన్ కల్యాణ్ కోసం చొక్కాలు చించుకుంటూ,కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కారు వెంట పరిగెడుతుంటూ ఆయనకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? అని ప్ర‌శ్నించారు స‌రోజ‌.”పార్టీని న‌మ్ముకున్న వారి భవిష్యత్తును ఇవాళ సర్వనాశనం చేశారు. దశాబ్దకాలం అంటే…ఒక తరానికి భవిష్యత్తు పోయింది. మా నాయకుడు సీఎం అవుతాడు,సీఎం అవుతాడు అని ఒక తరం వారిని ఆయన వెంట తిప్పించుకున్నారు. మా నాయకుడు సీఎం అవ్వాలని కలలుగనే ఈ యువత ఏమైపోవాలి?” అని నిల‌దీశారు.

**రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకున్నా కూడా ఈసీ అనుమతి తప్పనిసరి అని ఈసీవో ముఖేష్ కుమార్ మీనా తాజా లేఖలో స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకునే నేతలు.. స్థానిక రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం నిమిత్తం ఓటర్ల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో సభలు, సమావేశాల విషయంలోనూ కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో… సభలూ, సమావేశాలు పెట్టుకోవాలన్న.. ఆఖరికి కరపత్రాలు పంచాలన్నా కూడా సువిధ యాప్ లో అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించేవారు, కీలక నేతలు తమ తమ ప్రచార వాహనాల అనుమతులను స్థానికంగా కాకుండా.. సీఈఓ స్థాయిలోనే అనుమతులు తీసుకోవాలని.. అదేవిధంగా.. తమ తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈవో వద్దే తీసుకోవాలని తెలిపారు. ఇక ప్రధానంగా సభలు పెట్టుకోవాలన్నీ, ర్యాలీలు చేపట్టాలన్నా కనీసం 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలని.. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచీ ఎలాంటి ప్రచారలకూ అనుమతులు ఉండవని.. తెలిపారు. ఇదే సమయంలో… పోలింగ్ తేదీ రోజున నియోజకవర్గంలో తిరిగేందుకు అసెంబ్లీ అభ్యర్థితో పాటు వారి పోలింగ్ ఏజెంట్ కు కలిపి రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారని ,లోక్ సభ అభ్యర్థులకు మరో వాహనం అనుమతిస్తామని తెలిపారు.

👉వైకాపాను వీడి టీడీపీలో చేరిన వారిపై సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు..         గిద్దలూరు నియోజకవర్గంలో వైస్సార్సీపీ నుండి చేరికలు అంటూ డబ్బా కొట్టుకుంటున్న వ్యక్తులకు టిడిపి కండువాలు మార్చుకుంటున్న వారు టిడిపి కార్యకర్తలేనన్న సంగతి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసునని గతంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్నారాంబాబు టిడిపి నుండి వైసిపిలో చేరిన క్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాడు పార్టీలో చేరి ఐదేళ్ళు అధికారం పదవులను అనుభవించి నేడు టిడిపిలో చేరుతున్న పరిస్ధితి..అంతే తప్పా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే నాయకులు కార్యకర్తలు ఏఒక్కరు పార్టీని వీడి పోలేదని అంటుండగా మరికొందరు మాత్రం ప్యాకేజీల కోసం అమ్ముడు పోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు …

👉గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామంలో మొదలైన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ.నాగార్జునరెడ్డి  ఎన్నికల ప్రచార కార్యక్రమం.. వైకాపాలో చేరికలు..

శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మన ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి గిద్దలూరు నగర పంచాయతీ, గిద్దలూరు రూరల్,బేస్తవారిపేట, కొమరోలు,రాచర్ల మండలాల ముఖ్య నాయకులతో గిద్దలూరు ఇంచార్జ్ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించినారు. 👉కంభం,కందులాపురం గ్రామాలలో “విశ్వబ్రాహ్మణుల”20 కుటుంబాలు మంగళవారం  గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కేపి.నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు తెలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…