పవన్ నీవల్ల మేం బలి కావాలా..జనసేన నేత పంతం సరోజ.. ఈసీ అనుమతి తప్పనిసరి ఈసీవో ముఖేష్ కుమార్.. వైకాపాను వీడుతున్న వారిపై వ్యంగాస్త్రాలు.. కంభం వైకాపాలో చేరికలు

త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌..నీవ‌ల్ల మేం బ‌లికావాలా?.. కాకినాడ జనసేన నేత పంతం సరోజ..

అసెంబ్లీ,పార్ల‌మెంటు ఎన్నిక‌ల పొత్తులు,టికెట్ల కేటాయింపు వ్య‌వ‌హారం వంటివి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు భారీ సెగ పెడుతున్నాయి.అది కూడా కాపులు,శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ”త‌ప్పెవ‌రిది ప‌వ‌న్‌?”అంటూ నిల‌దీత‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.దీంతో ఇప్పుడు జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది చూడాలి.కాకినాడ మాజీ మేయర్, జనసేన నేత పంతం సరోజ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని సర్వనాశనం చేశారు. విధానపరమైన అంశాలు,పార్టీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా ఉండి ఈ రోజు జనసేన పార్టీని ఏం చేశారు? మనకు పోల్ మేనేజ్ మెంట్ లేదని,బూత్ మేనేజ్ మెంట్ లేదని,టీడీపీకి పోల్ మేనేజ్ మెంట్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వాళ్లకే అవకాశం ఇద్దాం, వాళ్లతో సమానంగా కలిసి అడుగులేద్దాం అని మొన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ చెప్పారు. పోల్ మేనేజ్ మెంట్ లేకపోవడం అనేది ఇన్చార్జిల తప్పా?“అని స‌రోజ నిల‌దీశారు.నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి నెలకోసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉంటూ,ఒక రోజుంతా మీటింగులు పెడుతుంటారని,మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉంటూ పోల్ మేనేజ్ మెంట్ కానీ,బూత్ మేనేజ్ మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నార‌ని స‌రోజ ప్ర‌శ్నించారు.“ఈ అంశంపై మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడు పవన్ కల్యాణే నేర్పారు.పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ రోజు వరకు జనసేన పార్టీ ఏం చేస్తోంది?ఆయన దశాబ్దకాలంగా పార్టీని నడిపారు కదా.ఇప్పటిదాకా పోల్ మేనేజ్ మెంట్, బూత్ మేనేజ్ మెంట్ లేదంటే,ఇది ఎవరి వైఫల్యం?ఈ ప్రశ్నకు పవన్ కల్యాణ్,నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పి తీరాలి“అని స‌రోజ నిప్పులు చెరిగారు.ఇంతమంది జనసైనికులు ఉన్నారు, పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చిపోయే యువత ఉంది…పవన్ కల్యాణ్ కోసం చొక్కాలు చించుకుంటూ,కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కారు వెంట పరిగెడుతుంటూ ఆయనకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? అని ప్ర‌శ్నించారు స‌రోజ‌.”పార్టీని న‌మ్ముకున్న వారి భవిష్యత్తును ఇవాళ సర్వనాశనం చేశారు. దశాబ్దకాలం అంటే…ఒక తరానికి భవిష్యత్తు పోయింది. మా నాయకుడు సీఎం అవుతాడు,సీఎం అవుతాడు అని ఒక తరం వారిని ఆయన వెంట తిప్పించుకున్నారు. మా నాయకుడు సీఎం అవ్వాలని కలలుగనే ఈ యువత ఏమైపోవాలి?” అని నిల‌దీశారు.

**రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకున్నా కూడా ఈసీ అనుమతి తప్పనిసరి అని ఈసీవో ముఖేష్ కుమార్ మీనా తాజా లేఖలో స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోవాలనుకునే నేతలు.. స్థానిక రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం నిమిత్తం ఓటర్ల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో సభలు, సమావేశాల విషయంలోనూ కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో… సభలూ, సమావేశాలు పెట్టుకోవాలన్న.. ఆఖరికి కరపత్రాలు పంచాలన్నా కూడా సువిధ యాప్ లో అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించేవారు, కీలక నేతలు తమ తమ ప్రచార వాహనాల అనుమతులను స్థానికంగా కాకుండా.. సీఈఓ స్థాయిలోనే అనుమతులు తీసుకోవాలని.. అదేవిధంగా.. తమ తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈవో వద్దే తీసుకోవాలని తెలిపారు. ఇక ప్రధానంగా సభలు పెట్టుకోవాలన్నీ, ర్యాలీలు చేపట్టాలన్నా కనీసం 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలని.. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచీ ఎలాంటి ప్రచారలకూ అనుమతులు ఉండవని.. తెలిపారు. ఇదే సమయంలో… పోలింగ్ తేదీ రోజున నియోజకవర్గంలో తిరిగేందుకు అసెంబ్లీ అభ్యర్థితో పాటు వారి పోలింగ్ ఏజెంట్ కు కలిపి రెండు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారని ,లోక్ సభ అభ్యర్థులకు మరో వాహనం అనుమతిస్తామని తెలిపారు.

👉వైకాపాను వీడి టీడీపీలో చేరిన వారిపై సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు..         గిద్దలూరు నియోజకవర్గంలో వైస్సార్సీపీ నుండి చేరికలు అంటూ డబ్బా కొట్టుకుంటున్న వ్యక్తులకు టిడిపి కండువాలు మార్చుకుంటున్న వారు టిడిపి కార్యకర్తలేనన్న సంగతి నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసునని గతంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్నారాంబాబు టిడిపి నుండి వైసిపిలో చేరిన క్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నాడు పార్టీలో చేరి ఐదేళ్ళు అధికారం పదవులను అనుభవించి నేడు టిడిపిలో చేరుతున్న పరిస్ధితి..అంతే తప్పా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే నాయకులు కార్యకర్తలు ఏఒక్కరు పార్టీని వీడి పోలేదని అంటుండగా మరికొందరు మాత్రం ప్యాకేజీల కోసం అమ్ముడు పోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు …

👉గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామంలో మొదలైన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ.నాగార్జునరెడ్డి  ఎన్నికల ప్రచార కార్యక్రమం.. వైకాపాలో చేరికలు..

శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మన ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచ్చేయుచున్న సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి గిద్దలూరు నగర పంచాయతీ, గిద్దలూరు రూరల్,బేస్తవారిపేట, కొమరోలు,రాచర్ల మండలాల ముఖ్య నాయకులతో గిద్దలూరు ఇంచార్జ్ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించినారు. 👉కంభం,కందులాపురం గ్రామాలలో “విశ్వబ్రాహ్మణుల”20 కుటుంబాలు మంగళవారం  గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కేపి.నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు తెలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త