కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌!!! గిద్దలూరు టిడిపి వైకాపాలలో చేరికలు.. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు పై వాదనలు

👉కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌.. కేజ్రీవాల్ అరెస్ట్ పై కాషాయం పార్టీ కుట్ర..ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం మరింత సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఢిల్లీ సీఎం అరెస్ట్ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోందని తెలుస్తుంది.ఈ సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్,మాంగుంట రాఘవకు బెయిల్ మొదలైన విషయాలపై ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.ఇందులో భాగంగా…ఆయన కేజ్రీవాల్ అరెస్ట్ పై కాషాయం పార్టీ కుట్ర ఉందని విరుచుకుపడ్డారు.ఇదే సమయంలో..ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! వయసు ఎంతో తెలుసా? అవును…లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎటువంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవని..కేవలం కుట్రలు చేసే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని..ఆప్ ను నాశనం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాల్లో ఇదొకటని మొదలుపెట్టిన సంజయ్ సింగ్…కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని..ఆ తర్వాతే రాఘవకు బెయిల్ ఇచ్చారని.. ఇప్పుడు టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో మోడీ ఫోటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని కామెంట్స్ చేశారు!! విచారించ‌నున్న అధికారులు! అరవింద్ కేజ్రీవాల్ మీకు తెలుసా అని మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఈడీ మొదట అడిగినప్పుడు,అతను నిజం చెప్పాడని చెప్పిన సంజయ్ సింగ్…తాను అరవింద్ కేజ్రీవాల్‌ ను కలిశానని, అయితే చారిటబుల్ ట్రస్ట్ భూమి విషయంలో కలిశానని చెప్పాడని తెలిపారు.అయితే ఆ తర్వాత కొడుకుని అరెస్ట్ చేసి 5 నెలల పాటు జైలులో ఉంచడంతో..తండ్రి స్టేట్ మెంట్ మార్చాడని ఆరోపించారు.ఇదే సమయంలో… ఫిబ్రవరి 10 – జూలై 16 మధ్య మాగుంట రాఘవ నుంచి ఏడు స్టేట్ మెంట్లు తీసుకోబడ్డాయని.. ఈ ఏడు స్టేట్ మెంట్ లలోనూ మొదటి ఆరింటిలో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అతను ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఈ సమయంలో జూలై 16న ఇచ్చిన ఏడో స్టేట్ మెంట్ లో మాత్రం తన వైఖరిని మార్చుకుని,కుట్రలో భాగస్వామి అయ్యాడని.. ఫలితంగా,అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని..దీంతో బెయిల్ దక్కిందని సంజయ్ చెబుతున్నారు!! కాగా.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున ఒంగోలు నుంచి శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ముందుగా ఈ టిక్కెట్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవకు ఇస్తున్నట్లు కథనాలొచ్చినా.. చివరి నిమిషంలో చంద్రబాబు శ్రీనివాస్ రెడ్డినే ఎంపిక చేశారు!!

👉ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ తరఫు న్యాయవాది,పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని గుర్తు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది.మరోవైపు దస్తగిరికి ప్రాణ హానీ ఉందని సీబీఐ వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు.. దస్తగిరిక ప్రాణ హానీ ఉందని మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించింది.అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు స్పందించిన సీబీఐ.. సుప్రీంలో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొంది.దీంతో సీబీఐ సైతం సునీత పెటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది.

👉 ప్రకాశం జిల్లా అర్దవీడు మండలం బొమ్మిలింగం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ. కర్రల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు. బాధితులకు కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.

👉 అర్ధవీడు మండలంలో వైసీపీకి ఝలక్..మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన అర్ధవీడు మాజీ ఎంపీపీ..

మాగుంట, ముత్తుముల సమక్షంలో అర్ధవీడు మాజీ ఎంపీపీ  తన వర్గం తో కలిసి టిడిపిలో చేరారు.మండలంలో టీడీపీలోకి వరుస చేరికలతో వైసీపీ కంచుకోటగా ఉన్న అర్ధవీడులో ప్రస్తుతం తెలుగుదేశం తన పంజా విసురుతూ ముందుకు దూసుకుపోతుంది.ఇటీవల వైసిపిని వీడిన ఎంపీపీ, మండల ముఖ్య నాయకుల బాటలోనే మండలంలోని మరి కొంతమంది ముఖ్య నాయకులు అధికార పార్టీకి గుడ్ బై చెపుతున్నారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిల సమక్షంలో అర్ధవీడు వైసీపీ ముఖ్య నాయకుడు,మండల మాజీ ఎంపీపీ పాలుగుళ్ల పురుషోత్తమ రెడ్డి,తన ఆధ్వర్యంలో ఒక వైస్ సర్పంచ్, ఒక వార్డు మెంబరు,100 కుటుంబాలతో సహా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన అర్ధవీడు వైస్ సర్పంచ్ సిరివెళ్ల బాలయ్య వార్డ్ మెంబర్ మద్దెర్ల గాలెమ్మ మద్దెర్ల చిన్న సుబ్బారాయుడు వర్రా రాములు షేక్ వలి కీర్తి వెంకటేశ్వర్లు వార్డ్ మెంబర్ తోట చిన్నసుబ్బరాయుడు, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు*

👉 ప్రజలు మళ్లీ సీఎంగా జగనన్ననే కోరుకుంటున్నారు*. కుందూరు*….

రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా మీ కుందూరు నాగార్జున రెడ్డిని, ఎంపీ గా చెవిరెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి..ఎవ్వరికీ సాధ్యం కానన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి,రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచ రాజకీయాలకే ఆదర్శమని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.శుక్రవారం కంభం మండలంలోని నర్సిరెడ్డి పల్లె,తురిమెళ్ల,ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ,ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యంకాని విధంగా కేవలం ఐదేళ్లు పాలనలో జగనన్న రాష్టాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు.చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనరంజక పాలన అందించిన జగనన్న వైపే ప్రజలంతా ఉన్నారని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో తిరిగి జగనన్నను సీఎంగా ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు*……

👉బీసీల సంక్షేమమే ఎన్డీయే కూటమి లక్ష్యం*..మాగుంట, ముత్తుముల సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న 35 బీసీ కటుంబాలు*..

రాష్ట్రంలో బీసీల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు అడుగులు వేస్తుందని అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టిందని ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు.గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంగలవీడు పంచాయతీలోని చంద్రారెడ్డి పల్లె గ్రామానికి చెందిన 35 బీసీ కుటుంబాలు గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువాలు కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో బీసీ సోదరులంతా ఐక్యమత్యంగా పోరాడి గిద్దలూరు అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు ఎంపీ స్థానాలకు అత్యధిక మెజార్టీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన చల్లా ఓబయ్య, బిల్లా రంగయ్య, బిల్లా రవి వార్డ్ మెంబర్ , చాబోలు కాశన్న నాయకులు తదితరులు పాల్గోన్నారు*

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త