సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

👍దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.

ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదని పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి తర్వాత ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభమైంది. డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత బస్సు యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయనపై హత్యాయత్నం ప్రయత్నం జరగడంతో కేసరపల్లి క్యాంపునకు పెద్ద ఎత్తున నాయకులు , కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు.వైయస్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని,బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు. ఇలాంటి దాడులు ఆపలేవని ముఖ్యమంత్రి నేతలతో అన్నారు.ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు. 👉🏼 సీఎం జగన్ ఇతర పార్టీల నుండి అనేక మంది నాయకులను వైయస్ఆర్సీపీ కండువా కప్పి నేడి యాత్రను ప్రారంభించారు.

💫*టీడీపీ (శ్రీశైలం నియోజకవర్గం) నుంచి చేరికలు…నేడు కొత్తగా చేరిన వారిలో అహ్మద్ హుస్సేన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్,హజ్ కమిటీ మాజీ ఛైర్మన్, ముస్తఫా మోమిన్,టిడిపి అధికార ప్రతినిధి,ముఫ్తీ నూర్ మహ్మద్ మరియు మహ్మద్ ఇలియాస్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షులు ఉన్నారు.వారితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేరికకు హాజరయ్యారు….💫టీడీపీ, కాంగ్రెస్ నుంచి చేరికలు……కొత్తగా చేరిన వారిలో చిరుమామిళ్ల శ్రీనివాసరావు (అలియాస్ బుజ్జి) సీనియర్ టీడీపీ నాయకుడు,నందిగామ మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్,వడ్డెలి శ్రీనివాసరావు – నందిగామ టౌన్ మాజీ వైస్ ఛైర్మన్, వై రామారావు – నందిగామ మున్సిపల్‌లో టిడిపి కీలక నాయకుడు, గోడపాటిబూరరావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం చార్జి, షేక్ కరీముల్లా టీడీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షురాలు, డాక్టర్ షేక్ హసీనా,కొమ్ము విజయరాజు,సీనియర్ టీడీపీ నాయకులు.ఈ దీక్షలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ కేశినేని నాని,నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

👉2వాహనాలు..1400 కేజీల బంగారం..ఎవరిది?

ఎందుకంటే ఒక లారీలో వేయి కేజీల బంగారం ఉంటే.. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. కేజీ బంగారం అంటేనే.. ఒకలాంటి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పది గ్రాముల బంగారాన్ని ఒక సగటు మధ్యతరగతి జీవి కొనేందుకు ముందు వెనుకా ఆలోచించాల్సి ఉంటుంది.అలాంటి పరిస్థితి ఉన్న వేళ.. ఏకంగా 1400 కేజీల బంగారం ఒకేసారి..రెండు వాహనాల్లో దొరికిస్తే?అంతకు మించిన సంచలనం ఇంకేం ఉంటుంది? ఇప్పుడు అలాంటి షాకింగ్ సీన్ తమిళనాడులో చోటు చేసుకుంది.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తాజాగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికల సందర్భంగా గస్తీ నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ..మినీ కంటెయినర్ లారీలను సోదాలు జరిపారు.ఈ సందర్భంగా వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎందుకంటే..ఒక లారీలో ఏకంగా వెయ్యి కేజీల బంగారం ఉంటే..మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. ఇంత భారీగా బంగారం పట్టుబడటం సంచలనంగా మారింది.ఇంత భారీగా పట్టుబడిన బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవటం గమనార్హం.మొత్తం 1400 కేజీల బంగారానికి కేవలం 400 కేజీల బంగారానికి మాత్రమే అధికారిక పత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూరు సమీపంలోని మన్నార్ లోని ఒక గోదాంకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.ఇంత భారీ ఎత్తున బంగారం బయటపడటంతో.. చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల్ని పోలీసులు సంప్రదిస్తున్నారు.వారి నుంచి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.ఇంత భారీగా బంగరాన్ని ఎవరు తెప్పించారు? దీనికి సంబంధించిన అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

👉 దర్శి మండలం సామంతపూడి లో దరిశి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి,నారాపశెట్టి పాపారావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు , మునిసిపల్ చైర్మన్ పిచ్చయ్య గారు,కౌన్సెలర్ వి. సి. రెడ్డి మరియు ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 దర్శి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ప్రకాశం జిల్లా పార్లమెంట్ ఇంచార్జి నూకసాని బాలాజీ, దర్శి శాసనసభ అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి భర్త డా. కడియాల లలిత్ సాగర్ మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వై. యస్. ఆర్. సి. పి కన్వీనర్ బి. సుబ్బారెడ్డి, ఫిలిప్స్, ఇంద్రసేన రెడ్డి మరియు 200 కుటుంబాలు నేడు వైకాపాని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

👉త్రిబుల్ ఐటీ లో విషాదం…కడప జిల్లా: ఇడుపులపాయ..

ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం.సురేఖ పరిస్థితి విషమం కడప రిమ్స్ కు తరలింపు.రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని సురేఖ.మృతి చెందిన విద్యార్థిని ప్రకాశం జిల్లా కంభం మండలం జంగం గుంట్ల గ్రామం కు చెందిన సురేఖ గా పోలీసుల గుర్తింపు.సురేఖ మృత్తి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.

👉అన్నమయ్య జిల్లా: రాజంపేట..అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రేణుక మృతి..అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్న నంద్యాలకు చెందిన రేణుక.మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.

👉సొంత గూటికి చేరిన కాపు నాయకుడు అర్ధవీడు ఎంపీపీ.

ఇటీవల వైసీపీని వీడి టీడీపీ లోకి చేరిన అర్ధవీడు ఎంపీపీ మేడూరి వెంకటరావు,నేడు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గార్ల నాయకత్వంలో తిరిగి సొంత గూటికి వైసీపీ లోకి తిరిగి చేరారు..👉*బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో టీడీపి ని వీడి రెండు కుటుంబాలు..ఉండేలా ఆవులరెడ్డి,మోక్షగుండం అనిల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది..

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..