ఢీల్లీ పీఠం కూడా షేక్ అవుతుంది..సీఎం జగన్..లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..గిద్దలూరు కంభం మార్కాపురంలో టీడీపీ, వైసీపీ విస్తృత ప్రచారం….

👉అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల ఓట్లతో ఢీల్లీ పీఠం కూడా షేక్ అవుతుంది -ఇచ్చాపురుం బహిరంగ సభలో సీఎం జగన్..

ఇప్పటికే కొనసాగుతున్న, బడ్జెట్ కేటాయించిన పథకాలను అడ్డుకుని మీ బిడ్డను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీకు పథకాలను అందించేందుకు కోర్టుకు వెళ్లి పోరాడుతున్నాడంటే ఆలోచన చేయండి, ఏస్థాయిలో కుట్రలు చేస్తున్నారో..ఇన్ని సంవత్సరాలుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నారు, చివరి రెండు నెలలు పింఛన్ సోమ్ము ఇంటికి రాకపోతే అవ్వాతాతలకు ఈ కుట్రలు, క్రమంతప్పకుండా అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఆఖరి రెండు నెలలు బటన్ నోక్కినా కూడా సోమ్ము రాకుండా ఎవరు కుట్ర చేస్తున్నారని అక్కచెల్లెమ్మలకు తెలియకుండా ఉంటుందా..వీళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన పైన దేవుడు చూస్తున్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి, జరుగుతున్న పరిస్థితులను అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు గమనిస్తున్నారన్నారు..ఓటు అనే ఆయుధంతో వీరు కొట్టబోయే దెబ్బతో ఢీల్లీ పీఠం కూడా కదులుతుందనడం పై ముందు ఏం జరగబోతుందన్న విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

👉లోపాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి..జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. మార్కాపురం..కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏ.ఎస్.దినేష్ కుమార్ మంగళవారం మార్కాపురంలో పర్యటించారు. ఎస్.వీ.కె.పీ. కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం.ల స్ట్రాంగ్ రూమును ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను భద్రపరిచిన తీరును అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. వీటికి కల్పిస్తున్న భద్రత ఏర్పాట్ల పైనా కలెక్టర్ ఆరా తీశారు. ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఒంగోలు లోక్ సభ ఎన్నికలలో ఉపయోగించే ఈ.వి.ఎం.ల కమిషనింగ్ ప్రక్రియను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.ఈ ప్రాంగణంలో లైటింగ్, బ్యారికేడ్ల ఏర్పాటు విషయంలో స్థానిక రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా కు ఆయన పలు సూచనలు చేశారు.అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, పోలింగ్ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ వాళ్లకి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం ఒక ఉద్యోగికి యు.పీ.ఐ. విధానంలో ఒకరు డబ్బులు పంపినట్లు వచ్చిన వార్తలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఉద్యోగి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు… 👉 పోలింగ్ కేంద్రాల పరిశీలన…మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నికరంపల్లె ప్రాథమికోన్నత పాఠశాల, జమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కొలభీమునిపాడు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.విధుల్లో పాల్గొనేందుకు వచ్చే సిబ్బందికి వసతి కల్పించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు.ఈ దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ రాహుల్ మీనా,తహసిల్దార్ రవికుమార్,సెక్టార్ ఆఫీసర్ డి.శ్రీనివాసులు అధికారులు ఉన్నారు.

👉మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంలో ఆముదాలపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు  పాల్గొన్నారు. గడపగడప తిరుగుతూ వారి ప్రేమానురాగాలు ఆదరణలు ఇస్తూ ఆహ్వానించారు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబుకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

*అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..అంబేద్కర్ కోనసీమ జిల్లా..ఆలమూరు మండలం.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో 216(ఏ) నెంబరు గల జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఎస్సై శ్రీను నాయక్ నేతృత్వంలో స్టాటిక్ సర్వ్యులేషన్ టీం ఇంచార్జ్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం రాజానగరం నుండి అమలాపురం వైపుగా ఏపీ 39 ఎల్ క్యూ 77 నెంబరు గల కారులో 15,600 రూపాయల విలువ గల 180ML సామర్థ్యంతో ఉన్న 104 కోటర్ బాటిల్స్ ను స్వాధీనపరుచుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలియజేశారు. అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు వంటి తదితర వస్తువులను సరైన ఆధారాలు లేకుండా తరలించినచో కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏఎస్ఐ సూర్యచంద్రరావు, సిఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….👉 చిత్తూరు జిల్లా..కర్ణాటక నుంచి కంటైనర్ ద్వారా తరలిస్తున్న మద్యం సీజ్ ..బంగారుపాళ్యం వద్ద పోలీసులు పట్టుకున్న పోలీసులురు..50 లక్షలు విలువ చేసే 720 కేసులు గా గుర్తింపు.. తిరుపతి రాజకీయ నాయకులకు చెందినది గా అనుమానిస్తున్న పోలీసులు

👉కంభం జోరుగా సైకిల్ ప్రచారం..

కంభం గ్రామ పంచాయతీ పరిధిలోని 54 పోలింగ్ కేంద్రంలో జోరుగా సైకిల్ ప్రచారం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అనీష్ అహ్మద్(అన్ను )కార్యనిర్వహక కార్యదర్శి (దాదా) బూత్ కన్వీనర్ నాగూర్ ఖాన్ ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించడం అలాగే రేపు 13వ తారీకు జరగబోయే ఎన్నికల్లో ముత్తుముల అశోక్ రెడ్డి నీ పార్లమెంటు కు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో షుకూర్. ఫజల్. ఫయాజ్. మరియు ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

👉యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు ఎంతో కృషి చేసిన జగనన్న..మార్కాపురం టౌన్ లో టీడీపీని వీడి 30 మంది యువత ఎమ్మెల్యే అన్నా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక*..రాష్టంలో యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గ‌త ఐదేళ్లుగా ఎంతో కృషి చేశార‌ని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు.

మంగళవారం మార్కాపురం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన 30 మంది టిడిపికి చెందిన యువకులు టీడీపీని వీడి 18 వ వార్డు కౌన్సిలర్ కరీముల్లా, నాయకులు టి. వెంకటరావు, బెల్లకొండ గోపీ,కంభం వెంకట రమణల ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కాపురం పట్టణం, జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుని కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా పార్టీ కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై వైసీపీ లో చేరామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబు విజయానికి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. పార్టీ లో చేరిన వారిలో ఏనుగుల సాయి, ఏనుగుల శివ, ఏనుగుల ప్రవీణ్, భూపని కిరణ్, ఇవి వెంకట్, సాయి, అశోక్, శివారెడ్డి, శేఖర్, అజయ్, విష్ణు, మౌలాలి, హరి, కాశీ, మహీంద్రా, మహేష్, ఉమా మహేష్, రేవంత్, మోహన్, అరవింద్, రంగా, మనోజ్, శివ, గోపీ, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.*

👉 ఫ్యాను గుర్తుపై ఓటు వేసి,కుందురు,చెవిరెడ్డి లను గెలిపించండి..జంగంగుంట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారంలో నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులు..నియోజకవర్గ అభివృద్ధి చెయ్యడమే నాగార్జున రెడ్డి లక్ష్యం*….

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గెలుపే లక్ష్యంగా వారి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కుందురు కోమలతా రెడ్డి మంగళవారం సాయంత్రం వరుసగా జంగంగుంట్ల గ్రామంలో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు….ఎల్లప్పుడు గిద్దలూరు ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు చూసే తత్వం,నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా నాగార్జున రెడ్డి పనిచేస్తరన్నారు*…నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే నాగార్జున రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు…మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న కుందురు నాగార్జున రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు…కార్యక్రమంలో జంగంగుంట్ల సర్పంచ్ మాసాని సుజాత,ఎంపీపీ తులసమ్మ ఓబుల్ రెడ్డి, కంభం మండల వైయస్సార్ సీపీ కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి, కంభం మండల మాజీ మార్కెట్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి, ఎంపీటీసీ పాలగిరి శరభారెడ్డి,కంభం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు….

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు