మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

👉మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా !

బీజేపీ నేతలకు సెటైరికల్ గా కానీ డైరెక్ట్ గా కానీ ధీటైన జవాబు ఇవ్వాలంటే ప్రియాంకా గాంధీ ఉండాల్సిందే అన్న మాట కాంగ్రెస్ తో పాటు బయట పక్షాలలోనూ ఉంది. గాంధీ కుటుంబంలో నవతరం వారసులుగా రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఉన్నారు.ఈ ఇద్దరిలో ప్రియాంకా గాంధీ దూకుడుగా రాజకీయాలు చేస్తారు అని పేరు. ఆమె తన నాన్నమ్మ ఇందిరాగాంధీని పోలి ఉంటారు. అంతే కాదు ఆమె ప్రసంగాలు సైతం పదును తేరి ఉంటాయి. బీజేపీ నేతలకు సెటైరికల్ గా కానీ డైరెక్ట్ గా కానీ ధీటైన జవాబు ఇవ్వాలంటే ప్రియాంకా గాంధీ ఉండాల్సిందే అన్న మాట కాంగ్రెస్ తో పాటు బయట పక్షాలలోనూ ఉంది. ఇదిలా ఉంటే తన రాజకీయ జీవితం గురించి భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీ గురించి తాజాగా ప్రియాంకా గాంధీ ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద సునిశిత విమర్శలు చేశారు. అమేధీ రాయబరేలీ నుంచి గాంధీ కుటుంబం పారిపోతోంది అన్న ప్రధాని విమర్శలకు ఆమె జవాబు చెబుతూ 2014 లో గుజరాత్ లోని వడోదరా నుంచి పోటీ చేసి గెలిచిన మోడీ ఆ తరువాత ఆ సీటుని ఎందుకు వదిలేశారని ప్రియాంకా గాంధీ సూటిగానే ప్రశ్నించారు. ఆ సీటులో గెలవమని భయమా లేక పారిపోవడం గానే దాన్ని చూడాలా అని ఆమె మోడీని ప్రశ్నించారు. అమేధీ రాయబరేలీ రెండు సీట్లతో గాంధీ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆమె నొక్కి చెప్పారు. ఈ సీట్లను తమ కుటుంబం ఎపుడూ వదులుకోదు ఎక్కడికీ పారిపోదు అని ఆమె అన్నారు. తాము ఎప్పటికీ కంటికి రెప్పలా ఈ సీట్లను కాపాడుకుంటామని ఆమె చెప్పారు. తాను ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు అన్న దానికి ఆమె వివరణ ఇచ్చారు. పోటీ చేస్తే ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పూర్తిగా సమయం సరిపోదు. నియోజకవర్గానికే సమయం కేటాయించాల్సి ఉంటుంది. అది బీజేపీకే రాజకీయంగా లబ్దిని చేకూరుస్తుంది. అందుకే తాను ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నానని ఈసారి కాంగ్రెస్ ప్రచారానికే పరిమితం అయ్యానని చెప్పారు. భవిష్యత్తులో తాను పోటీ చేస్తానా లేదా అన్నది పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. పార్టీ ఆదేశిస్తే ప్రజలు అలా కోరుకుంటే తాను తప్పకుండా పోటీ చేస్తాను అని ఆమె అన్నారు.దీనిని బట్టి ప్రియాంకా గాంధీ రానున్న కాలంలో ఎంపీగా చట్టసభలలో అడుగుపెడతానని చెప్పకనే చెప్పేశారన్న మాట. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రచారం చేయడం మీదనే తన దృష్టి ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆమె అన్నారు.మొత్తం మీద చూస్తే ప్రియాంకా గాంధీ పూర్తి క్లారిటీతో ఉన్నారని అర్థం అవుతోంది.అదే సమయంలో ఆమె తన ఎన్నికల రాజకీయానికి తెర తీసేది ఎపుడు అన్నది కూడా ఆమెకే తెలుసు అంటున్నారు.

👉 బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?

2019లో అయితే ఏకంగా 70 కి పైగా సీట్లు ఆ పార్టీ సొంతం అయ్యాయి.దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. దేశంలో అధికారం ఎవరు అందుకోవాలన్నా అతి పెద్ద నంబర్ తో ఎంపీలను ఇచ్చే రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ లో బీజేపీకి బిగ్ షాక్ ఈసారి తగులుతుందా అంటే విశ్లేషకులు అవును అనే అంటున్నారు. యూపీలో 80 దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014, 2019లలో బీజేపీ అత్యధిక శాతం సీట్లు ఇక్కడే గెలుచుకుంది. 2019లో అయితే ఏకంగా 70 కి పైగా సీట్లు ఆ పార్టీ సొంతం అయ్యాయి.

అదే కేంద్రంలో బీజేపీకి బలం అయింది. అలాంటి యూపీ బీజేపీకి ఇపుడు రివర్స్ లో షాక్ ఇస్తే మాత్రం అది చాలా రాజకీయ నష్టాన్ని కలిగిస్తుంది అని అంతా అంటున్నారు. బీజేపీకి కీలకమైన రాష్ట్రంగా ఉన్న యూపీలో ఈసారి పదిహేను సీట్లలో తగ్గిపోతాయని అని అంటున్నారు.

👉ప్రొఫేసర్ నాగేశ్వర్ దీని మీద ఒక యూట్యూబ్ చానల్ లో విశ్లేషణ చేస్తూ బీజేపీ మీద స్పష్టంగా అసంతృప్తి బీజేపీ మీద యూపీ ప్రజలలో కనిపిస్తోంది అని అన్నారు. యోగీ ప్రభుత్వం వచ్చాక పశు వధ శాలను నిషేధించారు. ఉపయోగపడలేని పశువులు ఇతరత్రా వంటి వాటిని అమ్ముకోవడానికి వారికి ఇబ్బందికరంగా ఉంది.

ప్రధాని కిసాన్ యోజన సాయం ఇస్తున్నా దాని కంటే అనేక రెట్లు ఈ పశువుల పోషణకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది అని అంటున్నారు. దాంతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన రైతులు అంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. చెరుకు రైతులకు మద్దతు ధర పెరగకపోవడంతో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉందని అన్నారు.

ఇక వివిధ సామాజిక వర్గాలు నాన్ యాదవ వర్గాలు జాట్ సామాజిక వర్గాలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. రాజ్ పుట్లు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.గుజరాత్ బీజేపీ సీఎం రూపాలా రాజు పుట్లు మీద చేసిన వ్యాఖ్యలు అలగే యోగీ ఆదిత్యనాధ్ ని దించుతారన్న ప్రచారంతో కూడా వారు అంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అన్నది ఆయన విశ్లేషణగా ఉంది.

👉రాజ్ పుట్లు మీటింగులు పెట్టి మరీ బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. జాట్లలో కూడా బీజేపీ మీద అధిక శాతం వ్యతిరేకత పెంచుతున్నారని అంటున్నారు. అలాగే అనేక ఉత్తరాది రాష్ట్రాలలో యువత నిరుద్యోగం విషయంలో బీజేపీ ప్రభుత్వం మీద మండి పోతున్నారని అంటున్నారు.రైతాంగ ఉద్యమాన్ని జాట్లు నడిపారు.ఆ ఉద్యమం ద్వారా వ్యతిరేకతను బీజేపీ మూటకట్టుకుందని అంటున్నారు.బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా చేస్తారు అని పెద్ద ఎత్తున చేస్తున్న విపక్షాల ప్రచారం నేపధ్యంలో అది తీవ్ర స్థాయి వ్యతిరేకతను పెంచుతోంది అని అంటున్నారు.

దళిత్ జాతోలు యాదవ్ లు అంతా యూపీలో ఇపుడు ఏకీకృతం అవుతున్నారని అంటున్నారు. ఎస్పీ యూపీలో ఇచ్చిన పిలుపు కూడా బీజేపీకి సెగ తగిలేలా చేస్తోంది.ఎస్పీ సోషల్ ఇంజనీరింగ్ తో బీజేపీని దెబ్బ తీసే పని కూడా జరుగుతోంది.ఆ విధంగా కూడా యూపీలో కలవరపెడుతోందని అంటున్నారు.అయితే ఇన్ని జరిగినా కూడా బీజేపీ బాగానే సీట్లు తెచ్చుకోవచ్చు అని అంటున్నారు. బీజేపీకి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ అలాగే మోడీ ఇమేజ్, యోగీ పాలన పట్ల ఉన్న వచ్చే సానుకూలత, అలాగే రామ మందిరం ఇష్యూ వల్ల సానుకూలత ఉంది. మజ్లిస్ వంటి పార్టీలు విడిగా పోటీ చేయడం కూడా బీజేపీకి లాభం.అయితే ఇపుడు వస్తున్న విశ్లేషణలు చూస్తే కనుక బీజేపీ పది నుంచి పదిహేను సీట్లు పైన చెప్పిన కారణాల వల్ల కోల్పోతుంది అన్నది ప్రొఫేసర్ చెబుతున్న విశ్లేషణగా ఉంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

👉 ఘోర రోడ్డు ప్రమాదం..

ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుండి వెలిగండ్ల మీదుగా చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుచ్చి మండలం దామరమడుగు వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెలిగండ్ల మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన వేమవరపు మరియమ్మ(46) కంకణంపాడు గ్రామానికి చెందిన వేమవరపు డేవిడ్ (50)గా గుర్తించారు.వివరాలు తెలియాల్సి ఉంది.

👉సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు*

ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ లో శనివారం డీఎస్పీ బాలసుందర రావు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓట్లు లెక్కింపు సందర్భంగా ప్రజలందరూ సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డి.ఎస్.పి బాల సుందర రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త