షర్మిల లూజ్…బాబు గెయిన్…!!!
అదే టైం లో వైసీపీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీకే ఇది మేలు చేస్తుందని లెక్క ఉంది. ఏపీలో రాజకీయం ఏదో అనుకుంటే మరేదో అవుతోంది అని అంటున్నారు. దానికి కారణం ఏపీలో అటూ ఇటూ మోహరించి అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఉండడమే. ప్రజలు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఫిక్స్ అయిపోయారు. అయితే కొత్తగా ఎన్నికల ముందు ఎవరు వచ్చి బిగ్ సౌండ్ చేసినా ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా పెరుగుతుందే తప్ప వారికి ఏ మాత్రం లాభం చేకూరదు అని అంటున్నారు. అదే టైం లో వైసీపీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీకే ఇది మేలు చేస్తుందని లెక్క ఉంది. ఇపుడు చూడబోతే అదే నిజం అవుతోంది అని అంటున్నారు. ఇప్పటికి పదిహేను రోజుల క్రితం ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల మొదటి అడుగు మొదటి పలుకు నుంచి జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. అవి వ్యక్తిగత స్థాయిలో కూడా ఉంటున్నాయి. ఇవి ఒక దశలో శృతి మించి రాగాన పడిన సందర్భాలూ ఉన్నాయి. జగన్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల సంభోదించిన తీరు కూడా కాంగ్రెస్ కి మైనస్ అయింది అన్న మాట ఉంది. మరో సందర్భంలో ఆమె తన ఆస్తుల విషయం ప్రస్తావనకు తెచ్చారు. కడపలో ఆమె మాట్లాడుతూ, సాక్షిలో తనకు వాటాలు ఉన్నాయని కూడా ప్రకటించి సంచలనం రేపారు అయితే ఈ వాటాలు ఆస్తులు ఇవన్నీ కూడా షర్మిల వర్సెస్ జగన్ వ్యక్తిగత వివాదాలు అని జనాలకు అర్ధం అయ్యాయి. అలా వారికి అర్ధం అయ్యేలా చేయడంతో షర్మిల ఎమోషనల్ స్పీచెస్ నే దోహదం చేశాయని అంటున్నారు. ఆమె ఎంతసేపూ జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ఇది అన్నాచెల్లెల్లు వివాదం అని జనంలోకి వెళ్ళిపోయింది. నాకు జగన్ అన్యాయం చేశారు అని ఆమె మొదటి రోజునే కుండబద్దలు కొట్టారు. ఆ మీదట ఆమె ఏపీకి అన్యాయం జరిగింది అని మాట్లాడినా జనాల బుర్రలకు మాత్రం ఇదే ఎక్కేసింది. దాంతో ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూడలేకపోతున్నారు. పైగా కాంగ్రెస్ పాతాళం అంచులలో ఉంది. దాన్ని షర్మిల ఎన్నికల వేళకు వచ్చి ఎంత లేపినా లేచేది లేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ ఇంటి మనిషి సొంత ఆడపడుచు ఆయన మీద చేస్తున్న విమర్శలు మాత్రం జనంలో చర్చకు దారి తీస్తున్నాయి, జగన్ పాలన బాగా లేదని విపక్షాలు చెప్పడం వేరు, షర్మిల చెప్పడం వేరు. వైఎస్సార్ పాలనకు జగన్ పాలనకు మధ్య నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల చెప్పినది కూడా జనంలోకి వెళ్ళిపోతోంది.
ఇక జగన్ పాలన బాగులేకపోతే ఆల్టర్నేషన్ గా ఉన్నది కాంగ్రెస్ అసలే కాదు, ఆ పార్టీ కంటే చాలా ముందు టీడీపీ ఉంది. పైగా జనసేనతో టీడీపీ పొత్తు ఉంది. బాబు కూడా వైసీపీని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఇపుడు ఆయన మాటలను బలపరుస్తున్నట్లుగా షర్మిల కామెంట్స్ ఉన్నాయి. దాంతో జగన్ వ్యతిరేక ఓట్లు అన్నీ మరింతగా పెరిగి టీడీపీ ఖాతాలో పడుతున్నాయని అంటున్నారు. ఇది ముందే ఊహించి టీడీపీ దాని అనుకూల మీడియా షర్మిలకు మద్దతుగా ఉందని అంటున్నారు. ఇక షర్మిల ఓట్లు చీల్చేది ఏమీ ఉండదని అవి చీల్చినా కూడా వైసీపీకే భారీ నష్టం అంటున్నారు. అంటే షర్మిల ఏపీలో అగ్రెసివ్ మూడ్ లో చేసిన ప్రసంగాలు తటస్థ ఓటర్లలో కొత్త ఆలోచనలు తట్టిలేపాయని అంటున్నారు. వారు ఎవరికి ఓటు వేయాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు ఇపుడు వారంతా టీడీపీతో ట్రావెల్ చేసే విధంగా షర్మిల రాజకీయ దూకుడు పనికి వచ్చింది అని అంటున్నారు. మొత్తానికి ఏదైతేనేమి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ నాయకత్వం వైసీపీకి భారీ నష్టం టీడీపీకి మేలు అన్నట్లుగా బయటకు వస్తున్న విశ్లేషణలు ఉన్నాయి.
అదే సమయంలో తాను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక హస్తం పార్టీ ఆకాశానికి అంటుతుందని, కొత్త కాంతులు ఆ పార్టీలో వస్తాయని షర్మిల ధీమా పడినా లేక ఆమె వెనక ఉన్న పార్టీ నేతలు అనుకున్నా అవన్నీ భ్రమలు అని చెప్పడానికి గట్టిగా రెండు వారాలు కూడా పట్టలేదు. సో రేపటి రోజున వైసీపీ కాంగ్రెస్ నష్టపోయి టీడీపీ అధికార పీఠం దిశగా దూసుకుపోతే తమ స్వయకృపాపధాదం అని అన్నాచెల్లెలు సమీక్షుకునే రోజు వస్తుందా అంటే 2024 రిజల్ట్ మాత్రమే అవి చెప్పగలవు అంటున్నారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…